Priyanka Gandhi: జంతర్మంతర్ వద్ద రెజ్లర్లకు ప్రియాంక గాంధీ సంఘీభావం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Gandhi: మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అగ్రశ్రేణి రెజ్లర్లు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. బజరంజ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫొగాట్, ఇతరులు శనివారం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తమ తాజా నిరసనను కొనసాగించారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ రెజ్లర్లు రెండో రౌండ్ నిరసన చేపట్టారు. బీజేపీ ఎంపీని అన్ని పదవుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ శనివారం ఉదయం నిరసన స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు మద్దతు తెలిపారు. జ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా నిరసనకు నాయకత్వం వహిస్తున్న మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేష్ ఫొగాట్లతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మాట్లాడారు.
Read Also: Karnataka Assembly Elections: కర్ణాటక నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు?.. కాలభైరవ జోస్యం నిజమయ్యేనా?
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Whats App Update: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు శుక్రవారం రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.మహిళా రెజ్లర్ల నుండి వచ్చిన ఫిర్యాదులపై, కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్లో రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.. ఎఫ్ఐఆర్లలో ఒకటి మైనర్ లైంగిక వేధింపుల ఫిర్యాదుపై, లైంగిక నేరాల నుండి పిల్లలను కఠినంగా రక్షించే చట్టం (పోక్సో) కింద నమోదు చేయబడింది. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఏడుగురు మహిళా రెజ్లర్లు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులు, ఇతరులకు నోటీసులు జారీ చేసిన తర్వాత ఇది జరిగింది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్కు చెందిన పలువురు నేతలు కూడా క్రీడాకారులకు మద్దతుగా నిలిచారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈరోజు నిరసనలో ఉన్న రెజ్లర్లను పరామర్శించనున్నారు.
తాజావార్తలు
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App Update: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!