Diamond: రైతు పొలంలో విలువైన వజ్రం లభ్యం.. దాని ధర ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతుకు విలువైన వజ్రం లభించింది. దీంతో ఆయన పంట పండింది. వజ్రం విలువైనది కావడంతో చుట్టుపక్కల వ్యాపారస్థులు ఆ రైతు ఇంటికి చేరుకున్నారు. ఆ వజ్రాన్ని కొనేందుకు పోటీ పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం మదనంతపురంలో ఓ రైతు పొలంలో విలువైన వజ్రం బయటపడింది. వర్షాలు పడటంతో స్థానికులు వజ్రాల వేట మొదలు పెట్టారు. ఓ రైతుకు విలువైన వజ్రం లభించడంతో ఆయన ఇంటికి తీసుకెళ్లారు. దాన్ని పరీక్షించే లోపే వ్యాపారులు ఆయన ఇంటి ముందు క్యూ కట్టారు. వజ్రాన్ని రూ.18 లక్షల నగదు, 10 తులాల బంగారు ఇచ్చి దాన్ని కొనుగోలు చేశారు. బహిరంగ మార్కె్ట్ లో ఆ వజ్రం ధర రూ. 30 లక్షలు ఉంటుందని అంచానా వేస్తున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట తెలియడంతో మదనంతపురం పొలాల్లోకి గ్రామస్థులు పోటెత్తారు.
READ MORE: TOI-6713.01: “తనలో తాను కరుగుతున్న వింత గ్రహం”.. గురుడి ఉపగ్రహంతో పోలిక..
Also Read
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
కాగా.. కర్నూలు జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లాలో తొలకరి వర్షాలు కురవగానే వజ్రాల వేట మొదలవుతుంది. కానీ ఈసారి వేసవివకాలంలోనే వజ్రాల కోసం జనాలు గాలింపు మొదలుపెట్టారు. తుగ్గలి మండలంలోని తుగ్గలి, రామాపురం, చిన్నజొన్నగిరి, పగిడిరాయి, జి.ఎర్రగుడి, ఉప్పర్లపల్లి, గిరిగెట్ల, మదనంతపురంలో వజ్రాల కోసం గాలిస్తారు. మద్దికెర మండలంలోని పెరవలి, మద్దికెర, బసినేపల్లి ప్రాంతాల్లో కూడా వెతుకుతారు. ఇటు అనంతపురం జిల్లాలోని వజ్రకరూర్, బేతాపల్లి, ఊటకల్లు, బసినేపల్లి తదితర ప్రాంతాల్లో వజ్రాల కోసం వేట మొదలైంది. వర్షాలు బాగా కురవగానే జనాలు పొలాలబాటపడతారు. ప్రతి ఏటా విలువైన వజ్రాలు దొరుకుతుండటంతో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు వెతుకుతుంటారు. పొలాల్లో దొరికిన వజ్రాలను రహస్యంగా వ్యాపారులకు అమ్మేస్తుంటారు.. వ్యాపారులు కూడా ఆ దగ్గరలోనే మకాం వేస్తారు. కొన్ని సందర్భాల్లో వేలం పాట నిర్వహించి వ్యాపారులు ఆ వజ్రాన్ని దక్కించుకుంటారు. అయితే ఇలా దొరికిన వజ్రం రంగు, జాతిని బట్టి క్యారెట్ల రూపంలో లెక్క చేసి.. ఆ విలువకు తగిన విధంగా డబ్బులతో పాటుగా బంగారం ఇచ్చి వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు.
తాజావార్తలు
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!