UP: దెయ్యంపట్టిందంటూ.. మూడేళ్ల బాలిక ప్రాణం తీసిన తాంత్రికురాలు..
- అనారోగ్యానికి గురైన బాలికను తాంత్రిక వద్దకు తీసుకెళ్లిన కుటుంబీకులు
- బాలికను మూడు దెయ్యాలు ఆవహించాయన్న మహిళా మంత్రగత్తె
- బాలిక అరచేతులను కాల్చిన వైనం
- చిత్రహింసల కారణంగా ప్రాణాలు వదిలిన చిన్నారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర్ ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో మూడేళ్ల బాలికను.. ఓ మహిళా తాంత్రికురాలు పొట్టనబెట్టుకుంది. అనారోగ్యంతో ఉన్న బాలికను ఆ కుటుంబ సభ్యులు తాంత్రిక వద్దకు తీసుకువచ్చారు. బాలికను మూడు దెయ్యాలు ఆవహించాయని మహిళా తాంత్రిక తెలిపింది. వాటిని తొలగించేందుకు బాలికను బలంగా కొట్టడం ప్రారంభించింది. బాలిక రెండు అరచేతులను కాల్చేసింది. దీంతో బాలిక మృతి చెందింది. బాలిక జలుబుతో బాధపడుతుండగా.. వైద్యుడి వద్దకు తీసుకెళ్లకుండా.. మంత్రగత్తె వద్దకు తీసుకెళ్లారు కుటుంబీకులు.
READ MORE: Beerla Ilaiah: మంత్రి పదవి ఆశిస్తున్నా.. సీఎం సానుకూలంగా స్పందించారు..
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
విషయం ఏమిటంటే.. సందీప్ అనే యువకుడు ఉత్తర్ ప్రదేశ్ లోని రమియాబెహడ్ మిజారియా గ్రామానికి చెందిన వాడు. అతడి 3 ఏళ్ల కూతురు మహికి జ్వరం వచ్చింది. దీంతో తన కుమార్తెను వైద్యుల దగ్గరు తీసుకెళ్లాడు. చికిత్స అనంతరం వైద్యులు పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కానీ సందీప్ కుటుంబం ఓ మహిళా తాంత్రికురాలి వద్దకు బాలికన తీసుకెళ్లింది. మంత్రగత్తే బాలికను మూడు దెయ్యాలు పట్టుకున్నాయని.. చెప్పింది. మంత్రాన్ని ఉపయోగించి బాలికను రక్షిస్తానని మాయమాటలు చెప్పింది. కొంత డబ్బును కూడా కుటుంబీకుల నుంచి వసూలు చేసింది.
READ MORE: Tamil nadu: తమిళనాడులో పీఎంకే పార్టీ కార్యకర్తపై హత్యాయత్నం
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తాంత్రిక మహిళ మొదట మహిని కొట్టి, కాలిన కుండతో ఆమె రెండు అరచేతులను కాల్చింది. బాలిక ఎంత అరిచినా వినిపించుకోలేదు. చిత్రహింసల కారణంగా మహిని పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబీకులు మళ్లీ బాలికను జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా మారడంతో లక్నోకు తరలించారు. ప్రైవేటు ఆస్పత్రిలో చూయించుకునే స్తోమత లేకపోవడంతో కుటుంబీకులు తిరిగి ఇంటికి వచ్చేశారు. సమాచారం అందుకున్న రమియాబెహర్ ఎస్ ఐ వీరేంద్ర సింగ్ తోటి పోలీసుల నుంచి విరాళాలు సేకరించి చికిత్స నిమిత్తం బాలికను లక్నో పంపించారు. అయినా బాలిక మృతి చెందింది. దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మహిళా తాంత్రికురాలిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!