Omar Abdullah: ఉగ్రదాడిపై స్పందించిన జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా..
- గత కొన్ని రోజులుగా జమ్మూకశ్మీర్లో వరుస ఉగ్రదాడులు
- తాజాగా శ్రీనగర్లో గ్రెనెట్ దాడి
- మార్కెట్లో ప్రజలపై గ్రెనెట్ విసిరిన ఉద్రవాదులు
- ఈ ఘటనపై స్పందించిన సీఎం ఒమర్ అబ్దుల్లా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీనగర్లో జరిగిన ఉగ్రదాడిపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఓ ప్రకటన చేశారు. ఈ సంఘటన దురదృష్టకరమని అభివర్ణిస్తూ.. తన సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. “గత కొన్ని రోజులుగా లోయలోని కొన్ని ప్రాంతాల్లో ఉగ్రదాడులు & ఎన్కౌంటర్లు ఎక్కువగా జరుగుతన్నాయి. శ్రీనగర్లోని ‘సండే మార్కెట్’ వద్ద అమాయక దుకాణదారులపై గ్రెనేడ్ దాడికి సంబంధించిన ఈరోజు వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అమాయక పౌరులను టార్గెట్ చేయడాన్ని సమర్థించలేం. ప్రజలు ఎలాంటి నిర్భయంగా జీవించేందుకు వీలుగా ఈ దాడులను వీలైనంత త్వరగా ముగించేందుకు భద్రతా యంత్రాంగం అన్ని విధాలా కృషి చేయాలి.” అని సీఎం పోస్ట్లో పేర్కొన్నారు.
READ MORE: Kandula Durgesh: అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాళ్లలో ప్రభుత్వం అమలు చేస్తోంది..
Also Read
- RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
శ్రీనగర్లో ఏం జరిగింది?
జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్లో ఆదివారం గ్రెనేడ్ దాడి జరిగింది. ప్రధాన శ్రీనగర్లోని టీఆర్సీ కార్యాలయం సమీపంలోని ఆదివారం మార్కెట్లో ఈ దాడి జరిగింది. మార్కెట్లో ఉన్న జనం ఈ పేలుడులో 10 మంది గాయపడినట్లు సమాచారం. ఒక రోజు ముందు, ఖన్యార్లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఒక ఉగ్రవాదిని భద్రతా దళాలు హతమార్చాయి. జమ్మూకశ్మీర్లో వరుసగా రెండో రోజు శనివారం కూడా తీవ్రవాద కార్యకలాపాలు జరిగాయి. శనివారం జరిగిన రెండు ఎన్కౌంటర్లలో ముగ్గురు పాకిస్థాన్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ రెండు ఎన్కౌంటర్లు వేర్వేరు చోట్ల జరిగాయి. మొదటి ఎన్కౌంటర్ శ్రీనగర్లో జరగగా, రెండోది అనంతనాగ్లో జరిగింది. ఇందులో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన పాకిస్థాన్ టాప్ కమాండర్, మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఉస్మాన్గా గుర్తించబడిన ఎల్ఇటి కమాండర్ దశాబ్ద కాలంగా కాశ్మీర్ లోయలో చురుకుగా పనిచేశాడని.. ఇన్స్పెక్టర్ మస్రూర్ వానీ హత్యలో కూడా ప్రమేయం ఉందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. గతేడాది అక్టోబరులో ఈద్గా మైదానంలో క్రికెట్ ఆడుతూ మస్రూర్ వానీని అతి సమీపం నుంచి కాల్చి చంపిన సంగతి తెలిసిందే.
READ MORE: B. C. Janardhan Reddy: గత ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేశారు..
తాజావార్తలు
-
Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
-
RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
-
Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..