London: డబ్బులు అడిగినందుకు సిక్కు టాక్సీ డ్రైవర్ హత్య.. హంతకుడికి జైలు శిక్ష..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
London: 2022లో ఇంగ్లండ్లో సిక్కు ట్యాక్సీ డ్రైవర్కు చెల్లింపుల విషయంలో జరిగిన వాగ్వాదం తర్వాత యువకుడు హత్యకు గురయ్యాడు. లండన్లో జరిగిన ఈ హత్యకేసు నిందితుడికి శిక్ష పడింది. టాక్సీ డ్రైవర్ పేరు అంఖ్ సింగ్ (59). టోమాజ్ మార్గోల్ (36) అనే వ్యక్తి హత్య చేసి దోషిగా నిర్ధారించబడ్డాడు. సింగ్ హత్యకు సంబంధించి అతను ఈ వారం వోల్వర్హాంప్టన్ క్రౌన్ కోర్టులో నేరాన్ని అంగీకరించాడు. దీంతో దోషికి వచ్చే నెలలో శిక్ష పడనుంది. వోల్వర్హాంప్టన్ పోలీస్ CIDకి చెందిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ (DI) మిచెల్ థుర్గూడ్ మాట్లాడుతూ.. ఈ రకమైన హింస చాలా విచారకరమని అన్నారు. ఇది ఖచ్చితంగా అర్ధంలేనిదని ఆరోపించారు. సింగ్ తన పనిని తాను చేసుకునేవాడని.. చట్టాన్ని గౌరవించే వ్యక్తి అని తెలిపాడు. అక్టోబర్ 30, 2022 ఉదయం అంఖ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడని.. కొంత సమయం తర్వాత అతను మరణించాడని కోర్టుకు తెలిపారు.
Read Also: AP Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..SSC బోర్డులో ఉద్యోగాలు..
Also Read
అయితే హత్యకు గల కారణాలేంటంటే.. అంఖ్ సింగ్ మార్గోల్ అనే వ్యక్తిని తన టాక్సీలో తీసుకువెళ్తున్నాడు. అయితే ట్యాక్సీ డబ్బులు ఇవ్వాలని సింగ్ అడగ్గా.. అందులో ప్రయాణిస్తున్న యువకుడు వాదించడం ప్రారంభించాడు. చెల్లింపు విధానం విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో.. మార్గోల్ సింగ్పై దాడికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. మార్గోల్ సింగ్ తలపై కొట్టడంతో నేలమీద పడిపోయాడని.. అంతేకాకుండా కాళ్లతో తన్నాడు. దీంతో అప్పటికే సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. తర్వాత కాసేపటికి మృతి చెందాడు. మరోవైపు ఈ ఘటనపై సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. నిందితుడు మార్గోల్గా గుర్తించారు. తర్వాత అతని అడ్రస్ ను కనుగొని.. నిందితుడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత నిందితుడు పోలీసుల ఎదుట నిజాలు బయటపెట్టాడు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!