NTV Telugu Site icon

Kidnap: బ్యాంకాక్‌లో నంద్యాల జిల్లా వాసి కిడ్నాప్‌

Kidnapping 2

Kidnapping 2

Kidnap: బ్యాంకాక్‌లో నంద్యాల జిల్లా వాసి కిడ్నాప్‌ ఘటన కలకలం రేపుతోంది. నంద్యాల జిల్లా డోన్ మండలం చిన్న మల్కాపురంకు చెందిన మధు కుమార్ అనే వ్యక్తి కిడ్నాప్‌ అయ్యాడు. కిడ్నాప్ చేసిన దుండగులు 8 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలిసింది. మధు కుమార్ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగ రీత్యా 24న బెంగళూరు నుంచి బ్యాంకాక్ వెళ్లాడు. తనను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని, 8 లక్షలు ఇస్తే వదులుతామంటున్నారని 25న మధుకుమార్ తన అక్కకు మెస్సేజ్ చేశాడు.

Read Also: Indian Student: 10ఏళ్లు..విదేశాల్లో 633 మంది భారతీయ విద్యార్థుల మృతి..అత్యధికంగా ఇక్కడే..

డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని, తన సెల్‌ఫోన్‌ నుంచి అక్క రాజ్యలక్ష్మికి మెసేజ్ చేశాడు. అనంతరం మధుకుమార్ సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. ఈ క్రమంలోనే మధుకుమార్ తల్లిదండ్రులు డోన్‌ రూరల్ పోలీసులను ఆశ్రయించారు. కిడ్నాపర్ల నుంచి తన కుమారుడిని కాపాడాలని కోరుతున్నారు.