Crime: హిందువుగా నమ్మించి.. ఆరో పెళ్లి చేసుకున్న ముస్లిం.. మతం మారాలని ఒత్తిడి తేవడంతో..
- బీహార్లోని పూర్నియాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన
- హిందూ యువతిని ట్రాప్ చేసిన ముస్లిం యువకుడు
- హిందూ యువతిని ఆరో పెళ్లి చేసుకున్న ముస్లిం
- యువకుడి ఇంటి నుంచి తప్పించుకుని ఫిర్యాదు చేసిన యువతి
బీహార్లోని పూర్నియాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ముస్లిం యువకుడు హిందూ యువతిని ప్రేమ వలలో ట్రాప్ చేసేందుకు తన పేరు, గుర్తింపును మార్చుకున్నాడు. ఎలాగోలా ఆమెను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు. నిందితుడు జియారుల్కి ఇది ఆరో పెళ్లి కాగా ఇంతకు ముందు కూడా ఐదు పెళ్లిళ్లు చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ముస్లిం యువకులు మతం మారాలని ఒత్తిడి తెచ్చారని, ఆ తర్వాత అసలు విషయం తెలిసిందని బాధితురాలు ఆరోపించింది.
READ MORE: Modi US Tour: 300 పురాతన వస్తువులను ఇండియాకు తిరిగి ఇచ్చిన అమెరికా..
Also Read
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
- Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
- Icon Star : ఐకాన్ స్టార్ కొత్త రూల్.. ఫ్యాన్స్కు పండగే!
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
బాధితురాలి కథనం ప్రకారం.. ముస్లిం యువకుడు జియారుల్ తన పేరును శంకర్ యాదవ్గా మార్చుకున్నాడు. అమ్మాయిలను మభ్యపెట్టేందుకు తన ఆధార్ కార్డును కూడా అదే పేరుతో తయారు చేసుకున్నాడు. నిందితుడైన ముస్లిం యువకుడు అమ్మాయి ఇంట్లో తన పేరు శంకర్ అని చెప్పి తాపీ మేస్త్రీగా పరిచయం అయ్యాడు. పని సాకుతో వితంతువు ఇంటికి చేరుకుని ఆమె కూతురిని తన ప్రేమ వలలో బంధించాడు. ఆ తర్వాత ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు. వివాహానంతరం ఆ మహిళ తన అత్తమామల ఇంటికి చేరుకోగా.. తాను పెళ్లి చేసుకున్న వ్యక్తి హిందువు కాదని, ముస్లిం అని, అంతకుముందు 5 పెళ్లిళ్లు చేసుకున్నాడని తెలిసింది.
READ MORE:Odisha: పిల్లలకు గుడ్లు ఇవ్వడం లేదని.. అంగన్వాడీ కార్యకర్తను చెట్టుకు కట్టేసి కొట్టిన మహిళలు
ఈ విషయం తెలుసుకున్న మహిళ ఆశ్చర్యానికి గురైంది. తన అత్తమామల ఇంటి నుంచి బయటకు రావడానికి మార్గం వెతకడం ప్రారంభించింది. ఈ సమయంలో.. నిందితుడు భర్త, అతని కుటుంబ సభ్యులు మహిళపై నిఘా ఉంచారు. ఆమెను ఇంట్లో నుంచి బయటకు రానివ్వలేదు. తనను బందీగా ఉంచి ‘బీఫ్’ తినమని బలవంతం చేశారు. అంగీకరించక పోవడంతో తనను కొట్టారని ఆ మహిళ ఆరోపించింది. ఆ మహిళ తన ప్రాణాలను కాపాడుకునేందుకు రాత్రి అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి అక్కడ ఫిర్యాదు చేసింది. ఈ విషయమై సదర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్ణియ ఎస్పీ కార్తికేయ శర్మ మాట్లాడుతూ.. మహిళ ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
-
Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
-
Icon Star : ఐకాన్ స్టార్ కొత్త రూల్.. ఫ్యాన్స్కు పండగే!
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!