Crime: హిందువుగా నమ్మించి.. ఆరో పెళ్లి చేసుకున్న ముస్లిం.. మతం మారాలని ఒత్తిడి తేవడంతో..
- బీహార్లోని పూర్నియాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన
- హిందూ యువతిని ట్రాప్ చేసిన ముస్లిం యువకుడు
- హిందూ యువతిని ఆరో పెళ్లి చేసుకున్న ముస్లిం
- యువకుడి ఇంటి నుంచి తప్పించుకుని ఫిర్యాదు చేసిన యువతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లోని పూర్నియాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ముస్లిం యువకుడు హిందూ యువతిని ప్రేమ వలలో ట్రాప్ చేసేందుకు తన పేరు, గుర్తింపును మార్చుకున్నాడు. ఎలాగోలా ఆమెను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు. నిందితుడు జియారుల్కి ఇది ఆరో పెళ్లి కాగా ఇంతకు ముందు కూడా ఐదు పెళ్లిళ్లు చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ముస్లిం యువకులు మతం మారాలని ఒత్తిడి తెచ్చారని, ఆ తర్వాత అసలు విషయం తెలిసిందని బాధితురాలు ఆరోపించింది.
READ MORE: Modi US Tour: 300 పురాతన వస్తువులను ఇండియాకు తిరిగి ఇచ్చిన అమెరికా..
Also Read
- Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
- Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
- SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
- Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
బాధితురాలి కథనం ప్రకారం.. ముస్లిం యువకుడు జియారుల్ తన పేరును శంకర్ యాదవ్గా మార్చుకున్నాడు. అమ్మాయిలను మభ్యపెట్టేందుకు తన ఆధార్ కార్డును కూడా అదే పేరుతో తయారు చేసుకున్నాడు. నిందితుడైన ముస్లిం యువకుడు అమ్మాయి ఇంట్లో తన పేరు శంకర్ అని చెప్పి తాపీ మేస్త్రీగా పరిచయం అయ్యాడు. పని సాకుతో వితంతువు ఇంటికి చేరుకుని ఆమె కూతురిని తన ప్రేమ వలలో బంధించాడు. ఆ తర్వాత ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు. వివాహానంతరం ఆ మహిళ తన అత్తమామల ఇంటికి చేరుకోగా.. తాను పెళ్లి చేసుకున్న వ్యక్తి హిందువు కాదని, ముస్లిం అని, అంతకుముందు 5 పెళ్లిళ్లు చేసుకున్నాడని తెలిసింది.
READ MORE:Odisha: పిల్లలకు గుడ్లు ఇవ్వడం లేదని.. అంగన్వాడీ కార్యకర్తను చెట్టుకు కట్టేసి కొట్టిన మహిళలు
ఈ విషయం తెలుసుకున్న మహిళ ఆశ్చర్యానికి గురైంది. తన అత్తమామల ఇంటి నుంచి బయటకు రావడానికి మార్గం వెతకడం ప్రారంభించింది. ఈ సమయంలో.. నిందితుడు భర్త, అతని కుటుంబ సభ్యులు మహిళపై నిఘా ఉంచారు. ఆమెను ఇంట్లో నుంచి బయటకు రానివ్వలేదు. తనను బందీగా ఉంచి ‘బీఫ్’ తినమని బలవంతం చేశారు. అంగీకరించక పోవడంతో తనను కొట్టారని ఆ మహిళ ఆరోపించింది. ఆ మహిళ తన ప్రాణాలను కాపాడుకునేందుకు రాత్రి అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి అక్కడ ఫిర్యాదు చేసింది. ఈ విషయమై సదర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్ణియ ఎస్పీ కార్తికేయ శర్మ మాట్లాడుతూ.. మహిళ ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Chit Fund Fraud : చిట్టీల పేరుతో రూ.5 కోట్ల టోపీ.. వ్యాపారికి జైలు
-
Hit and Run : నార్సింగిలో హిట్ అండ్ రన్.. డెలివరీ బాయ్ దుర్మరణం
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 315 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు..
-
Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
-
Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!