Modi US Tour: 300 పురాతన వస్తువులను ఇండియాకు తిరిగి ఇచ్చిన అమెరికా..
- 300 పురాతన వస్తువులను ఇండియాకు తిరిగి ఇచ్చిన అమెరికా
- భారతదేశం నుండి అక్రమంగా తరలించబడిన పురాతన వారసత్వాలు
- 297 పురాతన వస్తువులను ప్రధాని మోడీకి అందజేసిన జో బిడెన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం నుండి అక్రమంగా తరలించబడిన అమూల్యమైన పురాతన వారసత్వాలను అమెరికా ఇండియాకు తిరిగి ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఈ 297 పురాతన వస్తువులను ప్రధాని మోడీకి అందజేశారు. దీంతో.. 2014 నుండి భారతదేశం నుండి స్వాధీనం చేసుకున్న పురాతన వస్తువుల మొత్తం సంఖ్య 640కి పెరిగింది. ఒక్క అమెరికానే 578 వస్తువులను తిరిగి ఇచ్చింది. 2021లో అమెరికా ప్రభుత్వం 157 పురాతన వస్తువులను అందజేసింది. ఇందులో 12వ శతాబ్దానికి చెందిన అద్భుతమైన కాంస్య నటరాజ విగ్రహం కూడా ఉంది.
Read Also: Indian Railways: టిక్కెట్ లేకుండా జనరల్ కోచ్లో ప్రయాణిస్తున్నారా..? ఫైన్ ఎంతో తెలుసా..?
Also Read
- Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
- Vaibhav Sooryavanshi: వైభవ్కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ.. భారత్కు చెందిన 297 పురాతన వస్తువులు తిరిగి ఇచ్చేందుకు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక భారత్కు చెందిన పురాతన వస్తువులు తిరిగి అప్పగిస్తున్నందుకు అమెరికా ప్రభుత్వానికి మోడీ ధన్యవాదాలు తెలిపారు. దీని వల్ల సాంస్కృతిక వస్తువులను అక్రమ రవాణా చేయడాన్ని నిరోధించవచ్చని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
Read Also: Amit Shah: రాహుల్ బాబా మేముండగా ఆ పని ఎన్నటికీ జరగదు..
అంతకుముందు.. 2023లో ప్రధాని అమెరికా పర్యటనకు వెళ్లిన కొద్ది రోజుల తర్వాత, 105 పురాతన వస్తువులు భారతదేశానికి తిరిగి వచ్చాయి. భారత్కు సంబంధించిన పురాతన వస్తువులను వివిధ దేశాల నుంచి వెనక్కి తీసుకురావడానికి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోంది. ఇందులో బ్రిటన్ నుండి 16 కళాఖండాలు, ఆస్ట్రేలియా నుండి 40 మరియు ఇతర ప్రాంతాల నుండి తిరిగి వచ్చాయి. అదే సమయంలో, 2004-2013 మధ్య ఒక కళాఖండం మాత్రమే భారతదేశానికి తిరిగి వచ్చింది. ఈ ఏడాది జులైలో ఢిల్లీలో జరిగిన 46వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో సాంస్కృతిక వస్తువులను తిరిగి రప్పించడంపై అమెరికా- భారత్ల మధ్య ఒప్పందం జరిగింది. భారత్ నుంచి అమెరికాకు కళాఖండాల అక్రమ రవాణాను నిరోధించడం, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం కోసం రెండు దేశాలు ఈ ఒప్పందాన్ని చేసుకున్నాయి.
Deepening cultural connect and strengthening the fight against illicit trafficking of cultural properties.
I am extremely grateful to President Biden and the US Government for ensuring the return of 297 invaluable antiquities to India. @POTUS @JoeBiden pic.twitter.com/0jziIYZ1GO
— Narendra Modi (@narendramodi) September 22, 2024
తాజావార్తలు
-
Bank Holidays: జూలైలో బ్యాంక్లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్గా తెలుసుకోండి!
-
Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
-
Stock market: 4 రోజులు.. రూ.88,000 కోట్ల ప్రాఫిట్! స్టాక్ మార్కెట్ను షేక్ చేసిన ఆరు టాప్ కంపెనీలు ఇవే..
-
Nitin Nabin : తెలంగాణలో త్వరలోనే ‘కమలం’ వికసిస్తుంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
-
Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!