Modi US Tour: 300 పురాతన వస్తువులను ఇండియాకు తిరిగి ఇచ్చిన అమెరికా..
- 300 పురాతన వస్తువులను ఇండియాకు తిరిగి ఇచ్చిన అమెరికా
- భారతదేశం నుండి అక్రమంగా తరలించబడిన పురాతన వారసత్వాలు
- 297 పురాతన వస్తువులను ప్రధాని మోడీకి అందజేసిన జో బిడెన్.
భారతదేశం నుండి అక్రమంగా తరలించబడిన అమూల్యమైన పురాతన వారసత్వాలను అమెరికా ఇండియాకు తిరిగి ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఈ 297 పురాతన వస్తువులను ప్రధాని మోడీకి అందజేశారు. దీంతో.. 2014 నుండి భారతదేశం నుండి స్వాధీనం చేసుకున్న పురాతన వస్తువుల మొత్తం సంఖ్య 640కి పెరిగింది. ఒక్క అమెరికానే 578 వస్తువులను తిరిగి ఇచ్చింది. 2021లో అమెరికా ప్రభుత్వం 157 పురాతన వస్తువులను అందజేసింది. ఇందులో 12వ శతాబ్దానికి చెందిన అద్భుతమైన కాంస్య నటరాజ విగ్రహం కూడా ఉంది.
Read Also: Indian Railways: టిక్కెట్ లేకుండా జనరల్ కోచ్లో ప్రయాణిస్తున్నారా..? ఫైన్ ఎంతో తెలుసా..?
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ.. భారత్కు చెందిన 297 పురాతన వస్తువులు తిరిగి ఇచ్చేందుకు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక భారత్కు చెందిన పురాతన వస్తువులు తిరిగి అప్పగిస్తున్నందుకు అమెరికా ప్రభుత్వానికి మోడీ ధన్యవాదాలు తెలిపారు. దీని వల్ల సాంస్కృతిక వస్తువులను అక్రమ రవాణా చేయడాన్ని నిరోధించవచ్చని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
Read Also: Amit Shah: రాహుల్ బాబా మేముండగా ఆ పని ఎన్నటికీ జరగదు..
అంతకుముందు.. 2023లో ప్రధాని అమెరికా పర్యటనకు వెళ్లిన కొద్ది రోజుల తర్వాత, 105 పురాతన వస్తువులు భారతదేశానికి తిరిగి వచ్చాయి. భారత్కు సంబంధించిన పురాతన వస్తువులను వివిధ దేశాల నుంచి వెనక్కి తీసుకురావడానికి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోంది. ఇందులో బ్రిటన్ నుండి 16 కళాఖండాలు, ఆస్ట్రేలియా నుండి 40 మరియు ఇతర ప్రాంతాల నుండి తిరిగి వచ్చాయి. అదే సమయంలో, 2004-2013 మధ్య ఒక కళాఖండం మాత్రమే భారతదేశానికి తిరిగి వచ్చింది. ఈ ఏడాది జులైలో ఢిల్లీలో జరిగిన 46వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో సాంస్కృతిక వస్తువులను తిరిగి రప్పించడంపై అమెరికా- భారత్ల మధ్య ఒప్పందం జరిగింది. భారత్ నుంచి అమెరికాకు కళాఖండాల అక్రమ రవాణాను నిరోధించడం, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం కోసం రెండు దేశాలు ఈ ఒప్పందాన్ని చేసుకున్నాయి.
Deepening cultural connect and strengthening the fight against illicit trafficking of cultural properties.
I am extremely grateful to President Biden and the US Government for ensuring the return of 297 invaluable antiquities to India. @POTUS @JoeBiden pic.twitter.com/0jziIYZ1GO
— Narendra Modi (@narendramodi) September 22, 2024
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో