Selfie Video: మంచిర్యాల రైల్వే స్టేషన్లో సెల్పీ వీడియో కలకలం.. బీఆర్ఎస్ నాయకుడి వేదింపులు తాళలేక..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Man’s Selfie Video goes viral at Mancherial Railway Station: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి తీసుకున్న సెల్పీ వీడియో కలకలం రేపింది. బీఆర్ఎస్ నాయకుడు వేదింపులు తాళలేక తాను ఆత్మహత్య చేసుకుంటా అంటూ తన కుమారుడితో కలిసి ఓ వ్యక్తి సెల్పీ వీడియో తీసుకున్నాడు. తనకు ప్రాణ హాని ఉందని పోలీసులకు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తనపై దాడులకు ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే వేములవాడ రాజన్న దేవాలయం సన్నిధిలో కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటామని వీడియోలో సదరు వ్యక్తి పేర్కొన్నాడు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియో ప్రకారం… మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు అండతో జిల్లా బీఆర్ఎస్ నాయకుడు మోటపల్లి గురువయ్య.. లక్షపేటకు చెందిన రాజేందర్ అనే వ్యక్తిని వేదిస్తున్నారు. ఆగష్టు 12న రాజేందర్ ఇంటిపై దాడిచేయించిన గురువయ్య.. అతడి కంపౌండ్ గోడను ధ్వంసం చేశారు. ఈ ఘనపై రాజేందర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇంటిపై దాడి చేసిన సమయంలో వీడియో తీయగా.. ఆ ఫోన్ కూడా గురువయ్య లాక్కేళ్లారు. దీనిపై పోలీసులు ఏమీ స్పందించలేదు.
Also Read
- Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
- Nandamuri Tejaswini: డాన్స్ స్టెప్స్ తో మెస్మరైజ్ చేసిన బాలకృష్ణ చిన్న కుమార్తె.. వీడియో వైరల్
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
- AP Liquor Case: లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు.. కీలక వివరాలు వెల్లడి
Also Read: Software Dead: కారు టైరు పేలి.. సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి!
ఇక అక్టోబర్ 22న అర్ధరాత్రి మోటపల్లి గురువయ్య ఓ సుపారీ గ్యాంగ్ ను పంపించి రాజేందర్పై అటాక్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనను ఇరుగుపొరుగు వారు చూసారు. ఈ ఘటనపై రాజేందర్ లక్షపేట పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది. బీఆర్ఎస్ నాయకుడి వేదింపులు తాళలేక రాజేందర్ తన కుమారుడితో కలిసి మంచిర్యాల రైల్వే స్టేషన్లో సెల్పీ వీడియో తీసి తనకు న్యాయం చేయాలని కోరాడు. ఇప్పటికైనా పోలీసులు చర్యలు తీసుకోకపోతే.. వేములవాడ రాజన్న దేవాలయం సన్నిధిలో కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటామని వీడియోలో రాజేందర్ స్పష్టం చేశాడు. అయితే బీఆర్ఎస్ నాయకుడు గురువయ్య తనను ఎందుకు వేదిస్తున్నాడనే విషయం రాజేందర్ చెప్పలేదు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
IRAN-US DEAL: అక్షరాల రూ.28లక్షల కోట్ల భారీ డీల్.. ఇరాన్-అమెరికా యుద్ధంలో కీలక మలుపు!
-
Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
-
Suvendu Adhikari: బంగ్లాదేశ్ గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న బెంగాల్ సీఎం.. అక్రమ వలసదారుల తాట తీస్తున్నాడుగా!
-
Kavya Maran: “ఓడినా తల ఎత్తుకుని వెళ్తాన్నాం”.. SRH టీమ్లో ధైర్యం నింపిన కావ్యా మారన్.. వైరల్ వీడియో
-
Nandamuri Tejaswini: డాన్స్ స్టెప్స్ తో మెస్మరైజ్ చేసిన బాలకృష్ణ చిన్న కుమార్తె.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..