AIIMS Delhi: షాకింగ్ న్యూస్.. డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకుని డాక్టర్ ఆత్మహత్య!
- దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఓ షాకింగ్ న్యూస్
- ఢిల్లీ ఎయిమ్స్లో ఓ న్యూరో సర్జన్ డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకుని ఆత్మహత్య
- ఆయన ఇంటి నుంచి మృతదేహం స్వాధీనం
- భార్యతో గొడవే కారణమని ప్రాథమిక సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఓ షాకింగ్ న్యూస్ వెలువడింది. కోల్కతాలో ఓ ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన నుంచి వైద్యుల సంఘం ఇంకా తేరుకోలేదు. ఇంతలో మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్లో ఓ న్యూరో సర్జన్ డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఎయిమ్స్కు ఆనుకుని ఉన్న గౌతమ్నగర్ ప్రాంతంలోని ఆయన ఇంటి నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో తోటి వైద్యులే కాదు పోలీసులు సైతం షాక్కు గురయ్యారు. ప్రస్తుతం ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.
READ MORE: Kolkata rape case: మమతా బెనర్జీకి హర్భజన్ సింగ్ లేఖ..
Also Read
సమాచారం ప్రకారం.. ఢిల్లీ ఎయిమ్స్లో న్యూరోసర్జన్గా పనిచేస్తున్న ఓ వైద్యుడు డ్రగ్ ఓవర్ డోస్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. న్యూరో సర్జన్ వయస్సు 34 సంవత్సరాలు. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుడు దక్షిణ ఢిల్లీలోని గౌతమ్ నగర్ ప్రాంతంలో ఆసుపత్రికి సమీపంలో నివసించారు. ఎయిమ్స్ కుటుంబ కలహాలతో ఇబ్బంది పడ్డాడని ప్రాథమిక సమాచారం.
READ MORE:Kolkata Doctor Case: మమతా బెనర్జీ రివర్స్ అటాక్.. బీజేపీ నేతలు, డాక్టర్లకు బెంగాల్ పోలీసుల సమన్లు..
అతని భార్యతో వివాదం..
ఢిల్లీ ఎయిమ్స్కు చెందిన యువ వైద్యుడు కుటుంబ వివాదంలో ఉన్నాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. భార్యతో గొడవ పడ్డారని ప్రాథమిక సమాచారం. మరణించిన వైద్యుడి భార్య సంఘటన సమయంలో ఫ్లాట్లో లేదు. రక్షాబంధన్ పండుగను జరుపుకోవడానికి ఆమె పుట్టింటికి వెళ్లింది. ఘటనాస్థలికి చేరుకున్న ఢిల్లీ పోలీసు బృందం పరిశీలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గౌతమ్నగర్లోని ఎయిమ్స్ డాక్టర్ ఫ్లాట్లో సూసైడ్ నోట్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Iran: ఈసారి శత్రువు కాలుదువ్వితే కొత్త యుద్ధం చూస్తారు.. ఇరాన్ వార్నింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!