Hyderabad: మాదాపూర్లో ఓవైపునకు ఒరిగిన 5 అంతస్తుల భవనం.. తప్పెవరిది?
- ఓవైపునకు ఒరిగిన 5 అంతస్తుల భవనం
- మాదాపూర్ సిద్దిక్ నగర్ లో ఘటన
- నిన్న రాత్రి 8:10 నిమిషాలకు పెద్ద
- నిర్మాణ ప్రమాణాలు పాటించకుండా ఇంటి నిర్మాణ కోసం పక్కకే భారీ గుంత
- ఒరిగిన భవనాన్ని కూల్చివేసేందుకు రంగం సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గచ్చిబౌలి.. మాదాపూర్ సిద్దిక్ నగర్ లో 5 అంతస్తుల భవనం ఓవైపునకు ఒరిగింది. ఈ భవనాన్ని కూల్చి వేసేందుకు రంగం సిద్ధమైంది. నిన్న రాత్రి 8:10 నిమిషాలకు పెద్ద శబ్దంతో 60 గజాల స్థలంలో ఒరిగింది. సరైన నిర్మాణ ప్రమాణాలు పాటించకుండా ఇంటి నిర్మాణ కోసం పక్కకే 150 గజాల స్థలంలో పిల్లర్ పూట్టింగ్ కోసం పెద్ద గుంత తవ్వడంతో ఈ భవనం వంగినట్లు చెబుతున్నారు. కూల్చివేసేందుకు సిద్ధమైన భవనం 60 గజాల స్థలం ఉంది. హైడ్రాలిక్ యంత్రంతో మరికొద్ది సేపట్లో కూల్చి వేసేందుకు సిద్ధమవుతున్నారు హైడ్రా అధికారులు. కుంగిన భవనం చు పక్కల ఉన్న ఇళ్ళల్లోని నివాసితులకు ఖాళీ చేయించారు. జిహెచ్ఎంసి, డి ఆర్ఎఫ్ ట్రాఫిక్, విద్యుత్, అంబులెన్స్ & లా అండ్ ఆర్డర్ పోలీసులు ఘటనా స్థలంలో పరిస్థితులను పర్యవేక్షిస్తూ.. అప్రమత్తంగా ఉన్నారు.
READ MORE: Virat Kohli: విరాట్ కోహ్లీని అక్కడే టార్గెట్ చేయండి.. ఆస్ట్రేలియా బౌలర్లకు హీలీ సూచన!
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
కాగా.. 5 అంతస్తుల భవనం యజమాని స్వప్న మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల క్రితం భవనం నిర్మించినట్లు తెలిపారు. “50 గజాల స్థలంలో జీ ప్లస్ ఫోర్ మొత్తం ఐదు అంతస్తులు భవనం నిర్మించాం. 15 రోజుల నుంచి మా భవనం పక్కనే ఖాళీ స్థలంలో ఇంటి నిర్మాణం కోసం పనులు జరుగుతున్నాయి. మా ఊరు మిర్యాలగూడ మా ఆయన కారు డ్రైవర్, మాకు ఇద్దరు పిల్లలు. మాకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మా భవనం పక్కనే ఉన్న స్థలం యజమాని గుంతలు తవ్వాడు. ఆ గుంతలు తొవ్వుతున్న క్రమంలో మా పిల్లర్స్ డ్యామేజ్ అయ్యాయి. దాని కారణంగా మా భవనం ఓవైపు ఒరిగింది. మా ఊర్లో ఉన్న భూములు అమ్ముకొని మాదాపూర్ లో ఇల్లు కట్టుకుని ఉంటున్నాం. అధికారులు మా భవనం కూల్చేందుకు మేము ఒప్పుకున్నాం. మా భవనం ప్రతి ఫ్లోర్ లో 6 రూంలు ఉన్నాయి. మొత్తం 20 మంది ఉంటున్నారు. ఇప్పుడు మా భవనం కులుస్తే మా పరిస్థితి ఏంటి? మాకు మా పిల్లలకు ఈ భవనమే ఆధారం. మాకు న్యాయం జరగాలి. కాళీ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టిన స్థలం యజమానితో నష్ట పరిహారం కట్టించాలి.” అని ఓనర్ ఆవేదన చెందారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!