Atrocious : 13ఏళ్ల బాలిక ప్రియుడితో సన్నిహితంగా ఉండగా చెల్లి చూసింది.. ఆ తర్వాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atrocious : సినిమాల ప్రభావమో పెరిగే వాతావరణ ప్రభావమో తెలియదు కానీ..ఈ మధ్య చిన్న పిల్లలే దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. 13 ఏళ్ల బాలిక ప్రియుడితో సన్నిహితంగా ఉండగా ఆమె సొంత 9 ఏళ్ల చెల్లెలు చూసింది. ఈ విషయాన్ని ఎక్కడ తల్లిదండ్రులకు చెబుతుందో అన్న భయంతో ఆ బాలిక చెల్లెలు పట్ల దారుణంగా ప్రవర్తించింది. ప్రియుడితో కలిసి చెల్లిని క్రూరంగా చంపేసింది. అనంతరం ఏమీ తెలియనట్టు నటించింది. కానీ పోలీసుల దర్యాప్తులో ఆమె నేరం అంగీకరించింది. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. బీహార్ లోని వైశాలి జిల్లాలోని జందాహా బ్లాక్ లో దంపతులు తమ13 ఏళ్లు, 9 ఏళ్ల వయసు గల తమ కూతుర్లతో కలిసి జీవిస్తున్నారు. అయితే పేరెంట్స్ ఇటీవల ఓ పెళ్లి వేడుక కోసం వేరే గ్రామానికి వెళ్లారు. అక్కడే నాలుగైదు రోజులు ఉన్నారు. ఈ క్రమంలో 13 ఏళ్ల బాలిక తన ప్రియుడితో ఇంటి వద్ద సన్నిహితంగా మెలిగింది. దీనిని చెల్లెలు చూసింది. దీంతో అక్క, ఆమె ప్రియుడు ఒక్క సారిగా కంగుతిన్నారు. చెల్లి తన విషయం ఎక్కడ బయటపెడుతుందోనని భయంతో అక్క, ఆమె ప్రియుడు కలిసి ఆ బాలికను చంపేశారు. అనంతరం డెడ్ బాడీని ఇంట్లోనే ఉంచారు. అయితే రెండు, మూడు రోజుల తరువాత మృతదేహం కుళ్లిపోయి, దుర్వాసన రావడం మొదలయ్యింది. దీంతో ఆ మృతదేహాన్ని నరికి యాసిడ్ పోసి ఇంటి పెరట్లో పడేశారు. నాలుగైదు రోజుల తరువాత తల్లిదండ్రులు ఇంటికి చేరుకున్నారు. అయితే వారికి చిన్న కూతురు కనిపించలేదు. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read
- SSY vs Fixed Deposit: పిల్లల భవిష్యత్తుకు ఏది బెస్ట్? ఈ తేడాలు తెలుసుకోండి
- Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
- Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
- Harish Rao: జూన్ 30, 2025... తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
Read Also:SSMB 28: తుఫాన్ వస్తుంది… అలర్ట్ గా ఉండండి
ఈ క్రమంలో కొందరు స్థానికులు మృతదేహాలను గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. డాగ్ స్క్వాడ్, ఎఫ్ఎస్ఎల్ బృందం ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం బాలిక అవశేషాలను సేకరించారు. వారి దర్యాప్తులో ఆ డెడ్ బాడీ తప్పిపోయిన బాలికదిగా గుర్తించారు. అనంతరం ఆధారాలను ల్యాబ్కు పంపించి శవపరీక్ష కూడా నిర్వహించారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా బాధితురాలి అక్కను ప్రశ్నించారు. దీంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించి మొత్తం సంఘటనలను బయటపెట్టింది. ఈ ఘటనపై వైశాలి ఎస్పీ రవి రంజన్ కుమార్ మాట్లాడుతూ.. మే 16న తొమ్మిదేళ్ల బాలిక అదృశ్యమైందని, మే 19న ఆమె అవశేషాలు లభ్యమయ్యాయని తెలిపారు. ఈ ఘటనలో తగిన సాక్ష్యాధారాలు లభించడంతో మంగళవారం సాయంత్రం ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని చెప్పారు.
Read Also:IPL 2023: ఐపీఎల్ ఫైనల్ తర్వాతే.. ఆసియా కప్ వేదికపై తుది నిర్ణయం
తాజావార్తలు
-
SSY vs Fixed Deposit: పిల్లల భవిష్యత్తుకు ఏది బెస్ట్? ఈ తేడాలు తెలుసుకోండి
-
Ma Inti Bangaram: సమంత ఖాతాలో మరో ఘనత.. 100 కోట్ల దిశగా ‘మా ఇంటి బంగారం’
-
Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
-
Amazon Prime Day Sale 2026: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026.. స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లపై భారీ డిస్కౌంట్లు
-
Rohit Sharma: కాస్త ఆకలి తగ్గింది.. అయినా ప్రపంచకప్లో అతడు తప్పక ఉండాల్సిందే!
ట్రెండింగ్
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?