Stampede in Yemen: ఘోర విషాదం.. ఆర్థిక సహాయ పంపిణీలో తొక్కిసలాట, 85 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stampede in Yemen: బుధవారం అర్థరాత్రి యెమెన్ రాజధాని సనాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అరేబియా ద్వీపకల్పంలోని అత్యంత పేద దేశమైన యెమెన్లో ఆర్థిక సహాయం పంపణీ చేసే కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 85 మందికిపైగా మరణించారు. వందల మంది గాయపడ్డారు. సనాలో జరిగిన తొక్కిసలాటలో 85 మంది మరణించారని, 322 మందికి పైగా గాయపడ్డారని హౌతీ భద్రతా అధికారి తెలిపారు. చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. హౌతీ నియంత్రణలో ఉన్న రాజధానిలోని సహాయం పంపిణీ చేస్తున్న పాఠశాలలో ఈ సంఘటన జరిగిందని చెప్పారు. బంధువుల ఆచూకీ కోసం ప్రజలు సంఘటనా స్థలానికి తరలి రావడంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతం చుట్టూ భారీగా మోహరించారు. కానీ వారిని లోపలికి అనుమతించలేదు. మృతులు, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. పంపిణీకి కారణమైన వారిని అదుపులోకి తీసుకున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
స్థానిక అధికారులతో సమన్వయం లేకుండా ఆర్థిక సహాయాన్ని సరిగ్గా పంపిణీ చేయడం వల్లే ఈ ఘటన జరిగిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి బ్రిగేడియర్ అబ్దుల్-ఖాలిక్ అల్-అఘరీ తెలిపారు. ఈద్-ఉల్-ఫితర్ ముందు ఈ విషాదం జరిగింది. మీడియా నివేదికల ప్రకారం.. ఒక పాఠశాలలో సహాయ పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. సంఘటన తర్వాత తిరుగుబాటుదారులు పాఠశాలను సీలు చేశారు. అలాగే జర్నలిస్టులతో సహా ఇక్కడికి రాకుండా నిషేధం విధించారు. సాయుధ హౌతీ తిరుగుబాటుదారులు జనాన్ని నియంత్రించేందుకు గాల్లోకి కాల్పులు జరిపారని, విద్యుత్ లైన్కు తగిలి అది పేలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో కార్యక్రమానికి హాజరైన వారిలో భయాందోళనలు నెలకొనడంతో ప్రజలు పరుగులు తీశారు. ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నామని, విషయం విచారణలో ఉందని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్ రాజధాని సనాను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
Also Read
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nepal Floods: నేపాల్లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
- Bigg Boss Agnipariksha 2: బిగ్బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
Read Also: Oxfam India: విదేశీ నిధుల ఉల్లంఘనలపై ఆక్స్ఫామ్ ఇండియాలో సీబీఐ సోదాలు
2014లో తమ ఉత్తర బలమైన కోటను ఆక్రమించి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వాన్ని తొలగించినప్పటి నుంచి యెమెన్ రాజధాని ఇరాన్ మద్దతుగల హౌతీల నియంత్రణలో ఉంది. ఇది ప్రభుత్వాన్ని పునరుద్ధరించడానికి 2015లో జోక్యం చేసుకోవడానికి సౌదీ నేతృత్వంలోని సంకీర్ణాన్ని ప్రేరేపించింది. ఈ వివాదం ఇటీవలి సంవత్సరాలలో సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య ప్రాక్సీ వార్గా మారింది. యోధులు, పౌరులతో సహా 150,000 మందికి పైగా మరణించారు. ఈ అంతర్యుద్ధాన్ని ప్రపంచంలోని అత్యంత ఘోరమైన మానవతా విషాదాలలో ఒకటిగా ఐక్యరాజ్యసమితి అభివర్ణించింది.
తాజావార్తలు
-
Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
-
Nepal Floods: నేపాల్లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
-
Bigg Boss Agnipariksha 2: బిగ్బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
-
Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
-
Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!