Stampede in Yemen: ఘోర విషాదం.. ఆర్థిక సహాయ పంపిణీలో తొక్కిసలాట, 85 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stampede in Yemen: బుధవారం అర్థరాత్రి యెమెన్ రాజధాని సనాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అరేబియా ద్వీపకల్పంలోని అత్యంత పేద దేశమైన యెమెన్లో ఆర్థిక సహాయం పంపణీ చేసే కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 85 మందికిపైగా మరణించారు. వందల మంది గాయపడ్డారు. సనాలో జరిగిన తొక్కిసలాటలో 85 మంది మరణించారని, 322 మందికి పైగా గాయపడ్డారని హౌతీ భద్రతా అధికారి తెలిపారు. చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. హౌతీ నియంత్రణలో ఉన్న రాజధానిలోని సహాయం పంపిణీ చేస్తున్న పాఠశాలలో ఈ సంఘటన జరిగిందని చెప్పారు. బంధువుల ఆచూకీ కోసం ప్రజలు సంఘటనా స్థలానికి తరలి రావడంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతం చుట్టూ భారీగా మోహరించారు. కానీ వారిని లోపలికి అనుమతించలేదు. మృతులు, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. పంపిణీకి కారణమైన వారిని అదుపులోకి తీసుకున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
స్థానిక అధికారులతో సమన్వయం లేకుండా ఆర్థిక సహాయాన్ని సరిగ్గా పంపిణీ చేయడం వల్లే ఈ ఘటన జరిగిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి బ్రిగేడియర్ అబ్దుల్-ఖాలిక్ అల్-అఘరీ తెలిపారు. ఈద్-ఉల్-ఫితర్ ముందు ఈ విషాదం జరిగింది. మీడియా నివేదికల ప్రకారం.. ఒక పాఠశాలలో సహాయ పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. సంఘటన తర్వాత తిరుగుబాటుదారులు పాఠశాలను సీలు చేశారు. అలాగే జర్నలిస్టులతో సహా ఇక్కడికి రాకుండా నిషేధం విధించారు. సాయుధ హౌతీ తిరుగుబాటుదారులు జనాన్ని నియంత్రించేందుకు గాల్లోకి కాల్పులు జరిపారని, విద్యుత్ లైన్కు తగిలి అది పేలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో కార్యక్రమానికి హాజరైన వారిలో భయాందోళనలు నెలకొనడంతో ప్రజలు పరుగులు తీశారు. ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నామని, విషయం విచారణలో ఉందని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్ రాజధాని సనాను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
Also Read
- NEET: దమ్ముంటే ఇప్పుడు లీక్ చేయండి.. నీట్ పరీక్ష కోసం రంగంలోకి ఇండియన్ ఎయిర్ఫోర్స్..
- RCB Player: ‘ఆర్సీబీకి ఆడాలని నాకు లేదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్..
- Iran-Israel War: శాంతించండి.. దాడులు ఆపాలంటూ ఇరాన్, ఇజ్రాయెల్కు భారత్ విజ్ఞప్తి
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
Read Also: Oxfam India: విదేశీ నిధుల ఉల్లంఘనలపై ఆక్స్ఫామ్ ఇండియాలో సీబీఐ సోదాలు
2014లో తమ ఉత్తర బలమైన కోటను ఆక్రమించి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వాన్ని తొలగించినప్పటి నుంచి యెమెన్ రాజధాని ఇరాన్ మద్దతుగల హౌతీల నియంత్రణలో ఉంది. ఇది ప్రభుత్వాన్ని పునరుద్ధరించడానికి 2015లో జోక్యం చేసుకోవడానికి సౌదీ నేతృత్వంలోని సంకీర్ణాన్ని ప్రేరేపించింది. ఈ వివాదం ఇటీవలి సంవత్సరాలలో సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య ప్రాక్సీ వార్గా మారింది. యోధులు, పౌరులతో సహా 150,000 మందికి పైగా మరణించారు. ఈ అంతర్యుద్ధాన్ని ప్రపంచంలోని అత్యంత ఘోరమైన మానవతా విషాదాలలో ఒకటిగా ఐక్యరాజ్యసమితి అభివర్ణించింది.
తాజావార్తలు
-
NEET: దమ్ముంటే ఇప్పుడు లీక్ చేయండి.. నీట్ పరీక్ష కోసం రంగంలోకి ఇండియన్ ఎయిర్ఫోర్స్..
-
Thaman: ఇదే నా లాస్ట్ సినిమా: తమన్
-
RCB Player: ‘ఆర్సీబీకి ఆడాలని నాకు లేదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్..
-
Iran-Israel War: శాంతించండి.. దాడులు ఆపాలంటూ ఇరాన్, ఇజ్రాయెల్కు భారత్ విజ్ఞప్తి
-
Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!