Maharashtra: బిస్కెట్లు తిని ఆస్పత్రి పాలైన 80 మంది విద్యార్థులు
- బిస్కెట్లు తిని ఆస్పత్రి పాలైన 80 మంది విద్యార్థులు
- మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో ఘటన
- జిల్లా పరిషత్ పాఠశాలలో పోషకాహారం కార్యక్రమం
- ఈ కార్యక్రమంలో ఇచ్చిన బిస్కెట్లు తిని పిల్లలకు అస్వస్థత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీ నగర్లోని జిల్లా పరిషత్ పాఠశాలలో 80 మంది విద్యార్థులు పోషకాహార కార్యక్రమం కింద బిస్కెట్లు తిని ఆసుపత్రిలో చేరారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారులకు వికారం, వాంతులు వచ్చాయి. ఫిర్యాదు మేరకు గ్రామపెద్దలు, పరిపాలన అధికారులు పాఠశాలకు చేరుకుని విద్యార్థులను ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయమై ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ బాబాసాహెబ్ ఘుఘే మాట్లాడుతూ.. 257 మంది విద్యార్థులకు బిస్కెట్లు తిన్న ఫుడ్ పాయిజన్ లక్షణాలు కనిపించాయని తెలిపారు. వీరిలో 153 మందిని ఆసుపత్రికి తీసుకురాగా.. మరికొందరికి చికిత్స అందించి ఇంటికి పంపించారు. తీవ్రమైన లక్షణాలతో ఉన్న ఏడుగురు విద్యార్థులను తదుపరి చికిత్స కోసం ఛత్రపతి శంభాజీనగర్ సివిల్ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. పాఠశాలలో మొత్తం 296 మంది విద్యార్థులు ఉన్నారు. ఫుడ్ పాయిజనింగ్కు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
READ MORE: Nellore: రూ.500 కడితే 7లక్షలు.. నెల్లూరులో మనీ స్కీం పేరుతో భారీ మోసం
Also Read
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఉగ్ర దేశ జాబితా నుంచి ఆ దేశం తొలగింపు
- Tamil Nadu: పందెంకోడి మిస్సింగ్.. వాట్సాప్లో ఆరా.. యువకుల మధ్య తీవ్ర ఘర్షణ
- Nepal Floods: నేపాల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై మంత్రి లోకేష్ సమీక్ష.. ముగ్గురి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు!
- కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
కాగా.. ఆగస్టు 8 న, ఉత్తరప్రదేశ్లోని బాబా రాఘవ్ దాస్ (బిఆర్డి) మెడికల్ కాలేజీలో 8వ తరగతి చదువుతున్న శివమ్ యాదవ్ ఫుడ్ పాయిజన్ కారణంగా మరణించాడు. అతను మహర్షి దేవ్రాహ బాబా మెడికల్ కాలేజీ నుంచి బదిలీపై వచ్చాడు. డియోరియా.. బరియార్పూర్లోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశ్రమ స్కూల్లోని హాస్టల్లో ఆహారం తిని అస్వస్థతకు గురైన 90 మంది విద్యార్థులలో శివమ్ కూడా ఉన్నాడు.
తాజావార్తలు
-
Harish Rao : హనుమకొండలో హైటెన్షన్.. ధర్నా తర్వాత హరీశ్ రావు అరెస్ట్..
-
TOXIC : టాక్సిక్ టాక్ ఏంటి.. డే-1 ఈ కలెక్షన్స్ ఏంటి?
-
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఉగ్ర దేశ జాబితా నుంచి ఆ దేశం తొలగింపు
-
Tamil Nadu: పందెంకోడి మిస్సింగ్.. వాట్సాప్లో ఆరా.. యువకుల మధ్య తీవ్ర ఘర్షణ
-
Nepal Floods: నేపాల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై మంత్రి లోకేష్ సమీక్ష.. ముగ్గురి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు!
ట్రెండింగ్
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?