Maharashtra: బిస్కెట్లు తిని ఆస్పత్రి పాలైన 80 మంది విద్యార్థులు
- బిస్కెట్లు తిని ఆస్పత్రి పాలైన 80 మంది విద్యార్థులు
- మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో ఘటన
- జిల్లా పరిషత్ పాఠశాలలో పోషకాహారం కార్యక్రమం
- ఈ కార్యక్రమంలో ఇచ్చిన బిస్కెట్లు తిని పిల్లలకు అస్వస్థత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీ నగర్లోని జిల్లా పరిషత్ పాఠశాలలో 80 మంది విద్యార్థులు పోషకాహార కార్యక్రమం కింద బిస్కెట్లు తిని ఆసుపత్రిలో చేరారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారులకు వికారం, వాంతులు వచ్చాయి. ఫిర్యాదు మేరకు గ్రామపెద్దలు, పరిపాలన అధికారులు పాఠశాలకు చేరుకుని విద్యార్థులను ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయమై ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ బాబాసాహెబ్ ఘుఘే మాట్లాడుతూ.. 257 మంది విద్యార్థులకు బిస్కెట్లు తిన్న ఫుడ్ పాయిజన్ లక్షణాలు కనిపించాయని తెలిపారు. వీరిలో 153 మందిని ఆసుపత్రికి తీసుకురాగా.. మరికొందరికి చికిత్స అందించి ఇంటికి పంపించారు. తీవ్రమైన లక్షణాలతో ఉన్న ఏడుగురు విద్యార్థులను తదుపరి చికిత్స కోసం ఛత్రపతి శంభాజీనగర్ సివిల్ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. పాఠశాలలో మొత్తం 296 మంది విద్యార్థులు ఉన్నారు. ఫుడ్ పాయిజనింగ్కు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
READ MORE: Nellore: రూ.500 కడితే 7లక్షలు.. నెల్లూరులో మనీ స్కీం పేరుతో భారీ మోసం
Also Read
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
కాగా.. ఆగస్టు 8 న, ఉత్తరప్రదేశ్లోని బాబా రాఘవ్ దాస్ (బిఆర్డి) మెడికల్ కాలేజీలో 8వ తరగతి చదువుతున్న శివమ్ యాదవ్ ఫుడ్ పాయిజన్ కారణంగా మరణించాడు. అతను మహర్షి దేవ్రాహ బాబా మెడికల్ కాలేజీ నుంచి బదిలీపై వచ్చాడు. డియోరియా.. బరియార్పూర్లోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశ్రమ స్కూల్లోని హాస్టల్లో ఆహారం తిని అస్వస్థతకు గురైన 90 మంది విద్యార్థులలో శివమ్ కూడా ఉన్నాడు.
తాజావార్తలు
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!