YouTube: యూట్యూట్ లో తప్పుడు వార్తల ప్రసారం.. 8 ఛానళ్లపై కేంద్రం వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముందస్తు లోక్సభ ఎన్నికలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను నిషేధించడం వంటి తప్పుడు వార్తలను ప్రసారం చేసినందుకు గాను 8 యూట్యూబ్ ఛానళ్లను (23 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు) కేంద్ర ప్రభుత్వం నిషేదిస్తున్నట్లు తెలిపింది. ఆ ఛానళ్లలో యహాన్ సచ్ దేఖో, క్యాపిటల్ టీవీ, కేపీఎస్ న్యూస్, సర్కారీ వ్లాగ్, ఎర్న్ టెక్ ఇండియా, వరల్డ్ బెస్ట్ న్యూస్ ఛానల్, ఎస్పీఎన్ 9 న్యూస్, ఎడ్యుకేషనల్ దోస్త్ ఇందులో ఉన్నాయి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మెంబర్స్, ఆ ఛానళ్లకు సంబంధిం వివరాలను సేకరించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Also: PK MB: మహేశ్ బాబుకి స్పెషల్ బర్త్ డే విషెష్ చెప్పిన పవర్ స్టార్…
Also Read
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- Telangana Liquor : తెలంగాణలో లిక్కర్ లవర్స్కు జాక్పాట్.. 121 కొత్త బ్రాండ్లు.!
- YS Jagan: జూనియర్ డాక్టర్ల సమ్మెపై వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
వరల్డ్ బెస్ట్ న్యూస్ భారత సైన్యాన్ని కించపరుస్తూ.. సైన్యాన్ని తక్కవ చేసి చూపించారని అధికారులు వెల్లడించారు. ఇక, ఎడ్యుకేషనల్ దోస్త్ అనే ఛానల్ ప్రభుత్వ పథకాల గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మెంబర్స్ నిర్ధారించారు. SPN9 ఛానల్ రాష్ట్రపతి, ప్రధాన మంత్రితో పాటు పలువురికి సంబంధించిన ఫేక్ వార్తలను ప్రచురించింది.
Read Also: Jangon Crime: కూతురి వేలు కొరకిన అల్లుడు.. ఇంట్లోనే సమాధి కట్టిన మామ..!
అదేవిధంగా సర్కారీ వ్లాగ్ ఛానల్ ప్రభుత్వ పథకాలపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక, కేపీఎస్ న్యూస్ అనే ఛానల్ రూ.20కి వంటగ్యాస్ సిలిండర్లు, లీటరుకు రూ.15కు పెట్రోలు లభిస్తుందంటూ ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు, ఆర్డర్లు, నిర్ణయాలకు సంబంధించి ఫేక్ న్యూస్ ప్రచారం చేసిందని అధికారుల విచారణలో వెల్లడైంది.
Read Also: Prabhas: 50 రోజుల్లో రికార్డులని చెల్లాచెదురు చేయడానికి ‘డైనోసర్’ వస్తుంది
అయితే, క్యాపిటల్ టీవీ ఛానల్ ప్రధాని, కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన అమలుకు సంబంధించిన ఉత్తర్వుల గురించి అసత్యపు న్యూస్ ను ప్రచారం చేసిందని తేలింది. యహన్ సచ్ దేఖో ఛానల్ ఎన్నికల సంఘం, భారత ప్రధాన న్యాయమూర్తికి సంబంధించిన ఫేక్ న్యూస్ ను టెలికాస్ట్ చేసిందని అధికారులు గుర్తించారు. చివరగా ఎర్న్ ఇండియా టెక్ ఛానల్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇతర సేవలకు సంబంధించి నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అధికారుల ఎంక్వైరీలో తేలింది.
తాజావార్తలు
-
Mythri Naveen: ఈ సినిమా చూసి 10 నిమిషాలు ఏడిచాను
-
Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
-
Shiva Nirvana: రవన్నతో ఆ సీన్ తీస్తున్నప్పుడు భయపడ్డా.. ‘ఇరుముడి’ అసలు కథ బయటపెట్టిన డైరెక్టర్!
-
Telangana Liquor : తెలంగాణలో లిక్కర్ లవర్స్కు జాక్పాట్.. 121 కొత్త బ్రాండ్లు.!
-
YS Jagan: జూనియర్ డాక్టర్ల సమ్మెపై వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!