Jangon Crime: కూతురి వేలు కొరకిన అల్లుడు.. ఇంట్లోనే సమాధి కట్టిన మామ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jangon Crime: జనగామ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. అల్లుడిని హత్య చేసిన మేనమామ ఇంటి వెనుక ఉన్న సెప్టిక్ ట్యాంక్లో పాతిపెట్టాడు. నిత్యం మద్యం సేవించి కూతురిని వేధించడంతో ఈ నేరానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. జనగామ జిల్లా దేవరుప్పుల మండలానికి చెందిన చింతా అబ్బసాయికి ముగ్గురు కుమార్తెలు. అందరినీ పెళ్లి చేసుకున్నాడు. కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన తన అక్క కుమారుడు రామిండ్ల నాగరాజుతో రెండో కుమార్తె శైలజకు వివాహం చేశాడు. కొడుకులు లేకపోవడంతో నాగరాజ్ను అల్లుడిగా తీసుకొచ్చారు. నాగరాజు-శైలజ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.
Read also: Prabhas: 50 రోజుల్లో రికార్డులని చెల్లాచెదురు చేయడానికి ‘డైనోసర్’ వస్తుంది
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
అయితే గత కొంత కాలంగా నాగరాజు మద్యానికి బానిసయ్యాడు. తరచూ మద్యం సేవించి భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలో పలుమార్లు దేవరుప్పుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేసేవారు. ఈ నెల 7వ తేదీన రాత్రి 10 గంటల ప్రాంతంలో నాగరాజు బాగా తాగి ఇంటికి వచ్చాడు. భార్యతో మళ్లీ గొడవ పడ్డాడు. అతడికి అన్నం పెట్టేందుకు వచ్చిన భార్యను నాగరాజ్ వేలిని బలంగా కొరికాడు. దీంతో ఆమెకు తీవ్రగాయాలై రక్తస్రావం అయింది.
ఇది చూసిన శైలజ తండ్రి అబ్బాసీ ఆగ్రహానికి గురై నాగరాజ్ చెంపపై బలంగా కొట్టాడు. దీంతో మేనమామ ఒంటిపై ఉన్న కండువాతో నాగరాజు ఉరి వేసుకునేందుకు ప్రయత్నించాడు. మేనమామ అబ్బాసీ కూడా అల్లుడు మెడలో కండువాతో గట్టిగా బిగించాడు. ఈ గొడవలో నాగరాజు ప్రాణాలు కోల్పోయాడు.
Read also: Rahul Gandhi: అవిశ్వాస తీర్మానంపై రాహుల్ గాంధీ ప్రసంగంపై నో క్లారిటీ
దీంతో ఆందోళన చెందిన తండ్రి, కూతురు అతడి మృతదేహాన్ని ఇంటి వెనుక ఉన్న సెప్టిక్ ట్యాంక్లో తలకిందులుగా పాతిపెట్టారు. మరుసటి రోజు ఉదయం జనగామలోని తన స్నేహితుడి ఇంటి నుంచి వచ్చిన నాగరాజ్ పెద్ద కుమారుడు కిరణ్ ఇంట్లో తండ్రి బట్టలు పడి ఉండడం చూసి ఆరా తీశారు. నాన్న ఎక్కడున్నారని అడగ్గా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నాగరాజు సెప్టిక్ ట్యాంక్లో శవమై కనిపించాడు. విషయం మనవడికి తెలియడంతో నివ్వెరపోయిన అబ్బాసీ గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలను కలిశాడు. వారి సూచన మేరకు కూతురితో సహా స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సెప్టిక్ ట్యాంక్లో పాతిపెట్టిన నాగరాజు మృతదేహాన్ని బయటకు తీశారు. నాగరాజు కాళ్లు, చేతులు చీరతో కట్టి ఉండడంతో పాటు తలపై బలమైన గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Hardik Pandya Trolls: హార్దిక్ పాండ్యాకు ఇంత స్వార్ధమా.. కాస్త ఎంఎస్ ధోనీని చూసి నేర్చుకో!
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!