IPL 2025 Mega Auction: ఎనిమిది మందికి అవకాశం ఇవ్వండి.. టాప్ ఐపీఎల్ ఫ్రాంచైజీ విజ్ఞప్తి!
- ఈ ఏడాది చివరలో మెగా వేలం
- నేడు ముంబైలో బీసీసీఐ సమావేశం
- ఫ్రాంచైజీల నుంచి కీలక విజ్ఞప్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI Meeting on IPL 2025 Mega Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 కోసం ఈ ఏడాది చివరలో మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఐపీఎల్ గవర్నింగ్ బాడీ, బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. నేడు ముంబైలో ఐపీఎల్ ఫ్రాంచైజీలతో బీసీసీఐ సమావేశం అయ్యే అవకాశం ఉంది. అయితే మీటింగ్ జరగనున్న నేపథ్యంలో ఫ్రాంచైజీల నుంచి కీలక విజ్ఞప్తులు వస్తున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఆటగాళ్ల రిటైన్షన్, జట్టు పర్స్ వాల్యూ పెంపుపై దృష్టిసారించాలని కోరుతున్నాయట.
మెగా వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు వెచ్చించే మొత్తాన్ని (పర్స్ వాల్యూ) రూ.120 కోట్లకు పెంచాలని గవర్నింగ్ బాడీని ఐపీఎల్ ఫ్రాంచైజీలు కోరుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతి జట్టుకు రూ.100 కోట్ల పర్స్ వాల్యూ ఉంది. ఇక కనీసం ఆరుగురిని రిటైన్ చేసుకొనే వెసులుబాటు కల్పించాలని ఫ్రాంచైజీలు డిమాండ్ చేస్తున్నాయట. ఐపీఎల్ టాప్ జట్టు ఒకటి ఎనిమిది మందికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు నలుగురిని మాత్రమే రిటైన్ చేసుకొనే అవకాశం ఉంది.
Also Read
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
- 19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
Also Read: 5G Smartphones: మొబైల్ ప్రియులకు శుభవార్త.. ఇక 8 వేలకే 5జీ స్మార్ట్ఫోన్!
‘పర్స్ వాల్యూ విషయంలో బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ బాడీ కూడా సానుకూలంగా ఉంది. పర్స్ విలువ తప్పకుండా పెరిగే అవకాశం ఉంది. 20-25 శాతం పెంపు ఉండొచ్చు. అతిపెద్ద సమస్య మాత్రం ఆటగాళ్ల రిటెన్షన్. రైట్ టు మ్యాచ్తో కలిపి రిటెన్షన్లో 8 మందికి అవకాశం ఇవ్వాలని కొన్ని ప్రాంఛైజీలు కోరుతున్నాయి. బీసీసీఐ 6 మందికి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ అందులో ఉండాలి. ఓవర్సీస్ ప్లేయర్ల రిటైన్ విషయంలోనూ చర్చ జరగనుంది. ఢిల్లీ, హైదరాబాద్ జట్లు ఒకరి కంటే ఎక్కువ ఓవర్సీస్ ప్లేయర్లను రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
-
Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
-
Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!