IPL 2025 Mega Auction: ఎనిమిది మందికి అవకాశం ఇవ్వండి.. టాప్ ఐపీఎల్ ఫ్రాంచైజీ విజ్ఞప్తి!
- ఈ ఏడాది చివరలో మెగా వేలం
- నేడు ముంబైలో బీసీసీఐ సమావేశం
- ఫ్రాంచైజీల నుంచి కీలక విజ్ఞప్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI Meeting on IPL 2025 Mega Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 కోసం ఈ ఏడాది చివరలో మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఐపీఎల్ గవర్నింగ్ బాడీ, బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. నేడు ముంబైలో ఐపీఎల్ ఫ్రాంచైజీలతో బీసీసీఐ సమావేశం అయ్యే అవకాశం ఉంది. అయితే మీటింగ్ జరగనున్న నేపథ్యంలో ఫ్రాంచైజీల నుంచి కీలక విజ్ఞప్తులు వస్తున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఆటగాళ్ల రిటైన్షన్, జట్టు పర్స్ వాల్యూ పెంపుపై దృష్టిసారించాలని కోరుతున్నాయట.
మెగా వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు వెచ్చించే మొత్తాన్ని (పర్స్ వాల్యూ) రూ.120 కోట్లకు పెంచాలని గవర్నింగ్ బాడీని ఐపీఎల్ ఫ్రాంచైజీలు కోరుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతి జట్టుకు రూ.100 కోట్ల పర్స్ వాల్యూ ఉంది. ఇక కనీసం ఆరుగురిని రిటైన్ చేసుకొనే వెసులుబాటు కల్పించాలని ఫ్రాంచైజీలు డిమాండ్ చేస్తున్నాయట. ఐపీఎల్ టాప్ జట్టు ఒకటి ఎనిమిది మందికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు నలుగురిని మాత్రమే రిటైన్ చేసుకొనే అవకాశం ఉంది.
Also Read
- IPL 2026: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎంట్రీ..
- AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
- TVK Vijay: అలా అయితే మద్దతు విత్డ్రా చేసుకుంటాం.. సీఎం విజయ్కు కొత్త తలనొప్పి..
Also Read: 5G Smartphones: మొబైల్ ప్రియులకు శుభవార్త.. ఇక 8 వేలకే 5జీ స్మార్ట్ఫోన్!
‘పర్స్ వాల్యూ విషయంలో బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ బాడీ కూడా సానుకూలంగా ఉంది. పర్స్ విలువ తప్పకుండా పెరిగే అవకాశం ఉంది. 20-25 శాతం పెంపు ఉండొచ్చు. అతిపెద్ద సమస్య మాత్రం ఆటగాళ్ల రిటెన్షన్. రైట్ టు మ్యాచ్తో కలిపి రిటెన్షన్లో 8 మందికి అవకాశం ఇవ్వాలని కొన్ని ప్రాంఛైజీలు కోరుతున్నాయి. బీసీసీఐ 6 మందికి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ అందులో ఉండాలి. ఓవర్సీస్ ప్లేయర్ల రిటైన్ విషయంలోనూ చర్చ జరగనుంది. ఢిల్లీ, హైదరాబాద్ జట్లు ఒకరి కంటే ఎక్కువ ఓవర్సీస్ ప్లేయర్లను రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
IPL 2026: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎంట్రీ..
-
AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
-
RC 17: చరణ్ ఫాన్స్.. రెడీ అవండమ్మా!
-
E30 Petrol: పెట్రోల్లో పెరగనున్న ఇథనాల్ శాతం.. వాహనదారులకు లాభమా? నష్టమా?
-
Drishyam 3: దృశ్యం క్రేజ్ అదృశ్యం!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!