Indian Railways: రెండేళ్లలో రైళ్లపై దాడులు.. 7,971 కేసులు.. రూ.5.79 కోట్ల నష్టం
- దేశంలో పెరుగుతున్న రైళ్ల మీద దాడులు
- వందేభారత్, సాధారణ రైళ్లపై రాళ్లు
- రెండేళ్లలో 7,971 కేసులు నమోదు
- రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి
భారతదేశంలో రైళ్ల మీద దాడులు చెయ్యడం సర్వసాధారణం అయ్యింది. ముఖ్యంగా వందేభారత్ రైళ్లు ప్రారంభం అయిన తరువాత రైళ్ల మీద అల్లరిమూకలు రాళ్లు రువ్వడం చాలా ఎక్కువ అయ్యింది. వందేభారత్ రైళ్లను టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చిన తరువాత మామూలు రైళ్ల మీద దాడులు ఎక్కువ అయ్యాయి. రైళ్లపై రాళ్లు రువ్వడం, ట్రాక్లను ధ్వంసం చేయడం వంటి కేసులు పెరుగుతున్నాయి. ఈ దాడులకు సంబంధించి 2023 నుంచి ఫిబ్రవరి 2025 వరకు మొత్తం 7,971 కేసులు నమోదైనట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ దాడుల వల్ల దెబ్బతిన్న రైళ్ల మరమ్మతుల కోసం రూ.5.79 కోట్లు ఖర్చు చేశామని స్పష్టం చేశారు.
READ MORE: IT Raids : క్రేన్ వక్కపొడి కంపెనీపై ఐటీ సోదాలు.. 40 కేజీల బంగారం, 100 కేజీల వెండి స్వాధీనం
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
ఇప్పటి వరకు 4,549 మందిని అరెస్టు చేసినట్లు చెప్పుకొచ్చారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. రాళ్ల దాడుల ఘటనల వెనక ఉన్న కారణాలను తెలుసుకోవడం కోసం నిజనిర్ధరణ కమిటీ నుంచి నివేదిక కోరిందా? అని తెలంగాణ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలను నియంత్రించేందుకు జీఆర్పీ, జిల్లా పోలీసులు, స్థానిక అధికారులతో కలిసి ఆర్పీఎఫ్ పని చేస్తోందని రైల్వే మంత్రి తెలిపారు. రాళ్ల దాడుల వల్ల కలిగే పర్యవసానాలను తెలియజేస్తూ ట్రాకులకు సమీపంలోని నివాస ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. సంఘ వ్యతిరేక శక్తులపై చర్యలు తీసుకునేందుకు వీలుగా ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!