Indian Student: 10ఏళ్లు..విదేశాల్లో 633 మంది భారతీయ విద్యార్థుల మృతి..అత్యధికంగా ఇక్కడే..
- విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు ఆందోళన కలిగించే వివరాలు
- వివరాలు విడుదల చేసిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
- గత ఐదేళ్లలో 41 దేశాల్లో కనీసం 633 మంది భారతీయ విద్యార్థుల మృతి
- కెనడాలో అత్యధికంగా 172 మరణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు ఆందోళన కలిగించే వార్త వెలుగులోకి వచ్చింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రకారం.. గత ఐదేళ్లలో 41 దేశాల్లో కనీసం 633 మంది భారతీయ విద్యార్థులు మరణించారు. కెనడాలో అత్యధికంగా 172 మరణాలు సంభవించాయి. హింసాత్మక దాడుల్లో 19 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరణానికి గల కారణాలలో సహజ కారణాలు, ప్రమాదాలు, వైద్య అత్యవసర పరిస్థితులు కూడా ఉన్నాయి. లోక్సభ వర్షాకాల సమావేశంలో కేరళ ఎంపీ కొడికున్నిల్ సురేష్ అడిగిన ప్రశ్నపై విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్సింగ్ ఈ సమాచారాన్ని అందించారు.
READ MORE: Sunitha Krishnan: బాలీవుడ్ వాళ్లు బయోపిక్ రెడీ చేసినా నేను నో చెప్పా!
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
కెనడాలో ఎక్కువ మంది విద్యార్థులు..
కెనడాలో అత్యధికంగా 172 మంది భారతీయ విద్యార్థులు మరణించారని విదేశాంగ మంత్రి లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఆ తర్వాత అమెరికాలో 108 మంది విద్యార్థులు చనిపోయారు. బ్రిటన్లో 58 మంది, ఆస్ట్రేలియాలో 57 మంది, రష్యాలో 37 మంది, జర్మనీలో 24 మంది విద్యార్థులు మరణించారు. పొరుగు దేశం పాకిస్థాన్లో ఓ విద్యార్థి మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, విదేశాల్లో భారతీయ విద్యార్థులపై హింసాత్మక దాడుల గురించి అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాచారం ఇచ్చారు. ఇండియన్ మిషన్/పోస్ట్ డేటా ప్రకారం.. ఇటీవల విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థులపై హింస పెరగలేదని ఆయన అన్నారు.
READ MORE: CM Chandrababu: విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సినవవే వచ్చాయి..
హింసాత్మక దాడుల్లో 19 మంది విద్యార్థులు..
విదేశాల్లో జరిగిన హింసాత్మక దాడుల్లో 19 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని కేంద్ర మంత్రి తెలిపారు. గణాంకాల ప్రకారం.. కెనడాలో అత్యధికంగా 9 మంది విద్యార్థులు మరణించారు. ఆ తర్వాత అమెరికాలో 6 మంది విద్యార్థులు, ఆస్ట్రేలియా, బ్రిటన్, చైనా, కిర్గిస్థాన్లలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. విదేశాల్లోని ఇండియన్ మిషన్/పోస్ట్కు అవాంఛనీయ సంఘటనల కేసులు వచ్చినప్పుడు, వెంటనే ఆ దేశ సంబంధిత అధికారులతో సమాచారం తీసుకుంటామని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!