Kerala: పీఎఫ్ఐ నిరసనలు హింసాత్మకం.. 500 మంది అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దాడులను నిరసిస్తూ శుక్రవారం కేరళలో చేపట్టిన ధర్నా హింసాత్మకంగా మారింది. ఈ దాడులకు వ్యతిరేకంగా పీఎఫ్ఐ కార్యకర్తలు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేపట్టారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పీఎఫ్ఐ చేపట్టిన పన్నెండు గంటల ధర్నా నేపథ్యంలో హింసాత్మక నిరసనలకు సంబంధించి శుక్రవారం 500 మందిని అరెస్టు చేయగా, 400 మంది పీఎఫ్ఐ నాయకులను ముందస్తుగా నిర్బంధంలో ఉంచారు. ఈ నిరసనల్లో కన్నూర్లోని మట్టన్నూర్లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై రాళ్ల దాడి కూడా జరిగిందని పోలీసులు తెలిపారు.
నిరసనలకు సంబంధించి ఇప్పటివరకు 500 మందిని అరెస్టు చేసినట్లు లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ విజయ్ సాఖారే తెలిపారు.పేలుడు సామగ్రిని తీసుకెళ్లినందుకు అరెస్టు చేసిన మరో సంఘటనకు సంబంధించిన వివరాలను కూడా ఏడీజీపీ తెలిపారు. “మరొక కేసులో, బాంబుతో మోటార్సైకిల్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురిని తర్వాత అరెస్టు చేశారు. మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది” అని సాఖారే చెప్పారు.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
అంతకుముందు మట్టన్నూరులోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై పీఎఫ్ఐ కార్యకర్తల అరెస్టుకు నిరసనగా పెట్రోలు బాంబు పేల్చారు. నివేదికల ప్రకారం, స్కూటర్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు సంఘ్ కార్యాలయంపై పెట్రోల్ బాంబు విసిరారు, ఫలితంగా కిటికీ అద్దాలు పగిలిపోయాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దేశవ్యాప్తంగా భారీ దాడుల్లో పీఎఫ్ఐ నాయకులను అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత, ఆ సంస్థ శుక్రవారం తెల్లవారుజామున 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు బంద్కు పిలుపునిచ్చింది. హర్తాల్ (సమ్మె) 12 గంటల పాటు కొనసాగుతుందని నిరసనకారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిరసన సందర్భంగా రాష్ట్రంలోని పలు చోట్ల రాళ్లదాడి ఘటనలు చోటుచేసుకున్నాయి. వాయనాడ్ జిల్లాలోని పనమరం గ్రామంలో కేరళ రాష్ట్ర రవాణా సంస్థ (KSRTC) బస్సుపై నిరసనకారులు రాళ్లు రువ్వుతున్న దృశ్యాలు కనిపించాయి. కోజికోడ్, కొచ్చి, అలప్పుజా, కొల్లంలో కూడా ఆర్టీసీ బస్సులపై దాడులు జరిగాయి.
Telecom Bill 2022: త్వరలోనే పార్లమెంట్ ముందుకు నూతన టెలికాం బిల్లు
“కొల్లాం జిల్లాలోని పల్లిముక్కు వద్ద బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు పోలీసు అధికారులను దుర్భాషలాడారు. వారు ఆపడానికి ప్రయత్నించిన తర్వాత వారిని కొట్టారు” అని పోలీసులు తెలిపారు.గాయపడిన ఆంటోని, నిఖిల్ అనే పోలీసు అధికారులు ఆసుపత్రిలో చేరారు. నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో, పూంతురలో దాడికి గురైన తర్వాత ఒక ఆటో రిక్షా, కారు దెబ్బతిన్న స్థితిలో కనిపించాయి. కొట్టాయంలో రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి.నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, రాష్ట్ర పోలీసు బలగాలు 15 రాష్ట్రాలలో దేశంలోని బహుళ ప్రదేశాలలో నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో మొత్తం 106 పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకర్తలను గురువారం అరెస్టు చేసినట్లు ఆధారాలు ఉన్నాయి.
పీఎఫ్ఐ ధర్నాతో రాష్ట్రంలో నెలకొన్న హింసాత్మక పరిస్థితులపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా పరిగణించిన హైకోర్టు.. పీఎఫ్ఐపై చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రంలో హర్తాల్పై నిషేధం ఉందని, ఏడు రోజుల ముందస్తు నోటీసు లేకుండా ఎవరూ బంద్కు పిలుపునివ్వకూడదంటూ 2019 నాటి తీర్పును గుర్తుచేసింది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఆమోదయోగ్యం కాదని, కోర్టు తీర్పును ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరో వైపు ప్రభుత్వం కూడా పీఎఫ్ఐపై చర్యలకు ఉపక్రమించింది.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..