Kerala: పీఎఫ్ఐ నిరసనలు హింసాత్మకం.. 500 మంది అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దాడులను నిరసిస్తూ శుక్రవారం కేరళలో చేపట్టిన ధర్నా హింసాత్మకంగా మారింది. ఈ దాడులకు వ్యతిరేకంగా పీఎఫ్ఐ కార్యకర్తలు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేపట్టారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పీఎఫ్ఐ చేపట్టిన పన్నెండు గంటల ధర్నా నేపథ్యంలో హింసాత్మక నిరసనలకు సంబంధించి శుక్రవారం 500 మందిని అరెస్టు చేయగా, 400 మంది పీఎఫ్ఐ నాయకులను ముందస్తుగా నిర్బంధంలో ఉంచారు. ఈ నిరసనల్లో కన్నూర్లోని మట్టన్నూర్లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై రాళ్ల దాడి కూడా జరిగిందని పోలీసులు తెలిపారు.
నిరసనలకు సంబంధించి ఇప్పటివరకు 500 మందిని అరెస్టు చేసినట్లు లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ విజయ్ సాఖారే తెలిపారు.పేలుడు సామగ్రిని తీసుకెళ్లినందుకు అరెస్టు చేసిన మరో సంఘటనకు సంబంధించిన వివరాలను కూడా ఏడీజీపీ తెలిపారు. “మరొక కేసులో, బాంబుతో మోటార్సైకిల్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురిని తర్వాత అరెస్టు చేశారు. మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది” అని సాఖారే చెప్పారు.
Also Read
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
అంతకుముందు మట్టన్నూరులోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై పీఎఫ్ఐ కార్యకర్తల అరెస్టుకు నిరసనగా పెట్రోలు బాంబు పేల్చారు. నివేదికల ప్రకారం, స్కూటర్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు సంఘ్ కార్యాలయంపై పెట్రోల్ బాంబు విసిరారు, ఫలితంగా కిటికీ అద్దాలు పగిలిపోయాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దేశవ్యాప్తంగా భారీ దాడుల్లో పీఎఫ్ఐ నాయకులను అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత, ఆ సంస్థ శుక్రవారం తెల్లవారుజామున 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు బంద్కు పిలుపునిచ్చింది. హర్తాల్ (సమ్మె) 12 గంటల పాటు కొనసాగుతుందని నిరసనకారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిరసన సందర్భంగా రాష్ట్రంలోని పలు చోట్ల రాళ్లదాడి ఘటనలు చోటుచేసుకున్నాయి. వాయనాడ్ జిల్లాలోని పనమరం గ్రామంలో కేరళ రాష్ట్ర రవాణా సంస్థ (KSRTC) బస్సుపై నిరసనకారులు రాళ్లు రువ్వుతున్న దృశ్యాలు కనిపించాయి. కోజికోడ్, కొచ్చి, అలప్పుజా, కొల్లంలో కూడా ఆర్టీసీ బస్సులపై దాడులు జరిగాయి.
Telecom Bill 2022: త్వరలోనే పార్లమెంట్ ముందుకు నూతన టెలికాం బిల్లు
“కొల్లాం జిల్లాలోని పల్లిముక్కు వద్ద బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు పోలీసు అధికారులను దుర్భాషలాడారు. వారు ఆపడానికి ప్రయత్నించిన తర్వాత వారిని కొట్టారు” అని పోలీసులు తెలిపారు.గాయపడిన ఆంటోని, నిఖిల్ అనే పోలీసు అధికారులు ఆసుపత్రిలో చేరారు. నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో, పూంతురలో దాడికి గురైన తర్వాత ఒక ఆటో రిక్షా, కారు దెబ్బతిన్న స్థితిలో కనిపించాయి. కొట్టాయంలో రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి.నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, రాష్ట్ర పోలీసు బలగాలు 15 రాష్ట్రాలలో దేశంలోని బహుళ ప్రదేశాలలో నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో మొత్తం 106 పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకర్తలను గురువారం అరెస్టు చేసినట్లు ఆధారాలు ఉన్నాయి.
పీఎఫ్ఐ ధర్నాతో రాష్ట్రంలో నెలకొన్న హింసాత్మక పరిస్థితులపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా పరిగణించిన హైకోర్టు.. పీఎఫ్ఐపై చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రంలో హర్తాల్పై నిషేధం ఉందని, ఏడు రోజుల ముందస్తు నోటీసు లేకుండా ఎవరూ బంద్కు పిలుపునివ్వకూడదంటూ 2019 నాటి తీర్పును గుర్తుచేసింది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఆమోదయోగ్యం కాదని, కోర్టు తీర్పును ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరో వైపు ప్రభుత్వం కూడా పీఎఫ్ఐపై చర్యలకు ఉపక్రమించింది.
తాజావార్తలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!