Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News 500 Arrested And 400 Detained After Violent Pfi Protests In Kerala Says Police

Kerala: పీఎఫ్ఐ నిరసనలు హింసాత్మకం.. 500 మంది అరెస్ట్

Published Date :September 23, 2022 , 7:40 pm
By Mahesh Jakki
Kerala: పీఎఫ్ఐ నిరసనలు హింసాత్మకం.. 500 మంది అరెస్ట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kerala: పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) దాడులను నిరసిస్తూ శుక్రవారం కేరళలో చేపట్టిన ధర్నా హింసాత్మకంగా మారింది. ఈ దాడులకు వ్యతిరేకంగా పీఎఫ్‌ఐ కార్యకర్తలు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేపట్టారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పీఎఫ్‌ఐ చేపట్టిన పన్నెండు గంటల ధర్నా నేపథ్యంలో హింసాత్మక నిరసనలకు సంబంధించి శుక్రవారం 500 మందిని అరెస్టు చేయగా, 400 మంది పీఎఫ్ఐ నాయకులను ముందస్తుగా నిర్బంధంలో ఉంచారు. ఈ నిరసనల్లో కన్నూర్‌లోని మట్టన్నూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై రాళ్ల దాడి కూడా జరిగిందని పోలీసులు తెలిపారు.

నిరసనలకు సంబంధించి ఇప్పటివరకు 500 మందిని అరెస్టు చేసినట్లు లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ విజయ్ సాఖారే తెలిపారు.పేలుడు సామగ్రిని తీసుకెళ్లినందుకు అరెస్టు చేసిన మరో సంఘటనకు సంబంధించిన వివరాలను కూడా ఏడీజీపీ తెలిపారు. “మరొక కేసులో, బాంబుతో మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురిని తర్వాత అరెస్టు చేశారు. మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది” అని సాఖారే చెప్పారు.

అంతకుముందు మట్టన్నూరులోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై పీఎఫ్‌ఐ కార్యకర్తల అరెస్టుకు నిరసనగా పెట్రోలు బాంబు పేల్చారు. నివేదికల ప్రకారం, స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు సంఘ్ కార్యాలయంపై పెట్రోల్ బాంబు విసిరారు, ఫలితంగా కిటికీ అద్దాలు పగిలిపోయాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దేశవ్యాప్తంగా భారీ దాడుల్లో పీఎఫ్ఐ నాయకులను అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత, ఆ సంస్థ శుక్రవారం తెల్లవారుజామున 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు బంద్‌కు పిలుపునిచ్చింది. హర్తాల్ (సమ్మె) 12 గంటల పాటు కొనసాగుతుందని నిరసనకారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిరసన సందర్భంగా రాష్ట్రంలోని పలు చోట్ల రాళ్లదాడి ఘటనలు చోటుచేసుకున్నాయి. వాయనాడ్ జిల్లాలోని పనమరం గ్రామంలో కేరళ రాష్ట్ర రవాణా సంస్థ (KSRTC) బస్సుపై నిరసనకారులు రాళ్లు రువ్వుతున్న దృశ్యాలు కనిపించాయి. కోజికోడ్, కొచ్చి, అలప్పుజా, కొల్లంలో కూడా ఆర్టీసీ బస్సులపై దాడులు జరిగాయి.

Telecom Bill 2022: త్వరలోనే పార్లమెంట్ ముందుకు నూతన టెలికాం బిల్లు

“కొల్లాం జిల్లాలోని పల్లిముక్కు వద్ద బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు పోలీసు అధికారులను దుర్భాషలాడారు. వారు ఆపడానికి ప్రయత్నించిన తర్వాత వారిని కొట్టారు” అని పోలీసులు తెలిపారు.గాయపడిన ఆంటోని, నిఖిల్ అనే పోలీసు అధికారులు ఆసుపత్రిలో చేరారు. నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో, పూంతురలో దాడికి గురైన తర్వాత ఒక ఆటో రిక్షా, కారు దెబ్బతిన్న స్థితిలో కనిపించాయి. కొట్టాయంలో రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి.నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, రాష్ట్ర పోలీసు బలగాలు 15 రాష్ట్రాలలో దేశంలోని బహుళ ప్రదేశాలలో నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో మొత్తం 106 పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యకర్తలను గురువారం అరెస్టు చేసినట్లు ఆధారాలు ఉన్నాయి.

పీఎఫ్‌ఐ ధర్నాతో రాష్ట్రంలో నెలకొన్న హింసాత్మక పరిస్థితులపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా పరిగణించిన హైకోర్టు.. పీఎఫ్‌ఐపై చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రంలో హర్తాల్‌పై నిషేధం ఉందని, ఏడు రోజుల ముందస్తు నోటీసు లేకుండా ఎవరూ బంద్‌కు పిలుపునివ్వకూడదంటూ 2019 నాటి తీర్పును గుర్తుచేసింది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఆమోదయోగ్యం కాదని, కోర్టు తీర్పును ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరో వైపు ప్రభుత్వం కూడా పీఎఫ్‌ఐపై చర్యలకు ఉపక్రమించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • india
  • Kerala Police
  • PFI
  • pfi protests
  • PFI protests in Kerala

తాజావార్తలు

  • Abrar Ahmed: కావ్యా మారన్ టీమ్‌లోకి ఎంట్రీ.. ట్రోల్స్‌పై పాకిస్థాన్ ఓవర్ యాక్షన్ స్పిన్నర్ షాకింగ్ రియాక్షన్!

  • Dhurandhar2 : ‘ధురంధర్ 2’ ప్రీమియర్స్.. ఇంకా అందని కంటెంట్.. షోలు రద్దయ్యే ఛాన్స్?

  • IPL Umpires Salary: ఆటగాళ్లకే కాదు.. అంపైర్లకు కూడా కళ్లు చెదిరే జీతాలు.. ఒక మ్యాచ్‌కు వారి ఫీజు ఎంతంటే.?

  • Dhurandhar TheRevenge : ధురంధర్ 2 మొదటి రోజు కలెక్షన్స్.. బాహుబలి, పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్?

  • PEDDI : తమిళ్, కన్నడలో పెద్దికి పోటీ తప్పదా..?

ట్రెండింగ్‌

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • Gemini Horoscope: పరాభవనామ సంవత్సరంలో ‘మిధున రాశి’ ఫలితాలు.. అప్పటి వరకు మాట అదుపులో ఉంచుకోవాల్సిందే.!

  • Chris Gayle IPL Record: ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికీ నంబర్ వన్‌గా గేల్.. రోహిత్, కోహ్లీ, ధోనీలకు కష్టమే!

  • 8.12 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే, 200MP కెమెరాతో OPPO Find N6 లాంచ్.. ధర ఎంతంటే?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions