Airlines Make Threatening Calls: రోజుకు 50 విమాన బెదిరింపు కాల్స్.. విదేశీ కుట్ర లేదా మరేదైనా?
- భారతీయ విమానయాన గత 14 రోజులుగా బాంబు బెదిరింపులు
- రోజుకు 50 విమాన బెదిరింపు కాల్స్
- ప్రయాణికుల్లో భయాందోళనలు
- విదేశీ కుట్ర లేదా మరేదైనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ విమానయాన సంస్థలకు గత 14 రోజులుగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఈరోజు.. ఆదివారం (అక్టోబర్ 27న) ప్రయాణికులతో నిండిన కనీసం 50 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇన్ని బెదిరింపు కాల్స్ రావడంతో.. ఇది విదేశీ కుట్రనా.. లేక నిజంగానే ఎవరైనా కావాలనే చేస్తున్నారా? అన్నది తెలుసుకోవడం కష్టమవుతోంది. ఈ బెదిరింపులు విమానయాన సంస్థల్లోనే కాకుండా ప్రయాణికుల్లో కూడా విమాన ప్రయాణానికి సంబంధించి భయాందోళనలకు గురిచేస్తున్నాయి.
READ MORE: Benjamin Netanyahu: ‘‘మా నాన్నను చంపారు’’.. నెతన్యాహూకి అవమానం..
Also Read
- PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
- Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్ను పరీక్షించిన పాకిస్తాన్..
- Tilak Varma: తిలక్ వర్మకు కొత్త బాధ్యతలు.. కెప్టెన్గా ఎంపిక చేసిన బీసీసీఐ..
మూలాధారాల ప్రకారం.. గత 14 రోజుల్లో వివిధ భారతీయ విమానయాన సంస్థలకు చెందిన 350 కంటే ఎక్కువ విమానాలకు బాంబు బెదిరింపులు నివేదించబడ్డాయి. ఇలాంటి బెదిరింపులు ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే వచ్చాయి. ఈరోజు 18 ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే ‘ఆకాసా ఎయిర్’ కూడా తన 15 విమానాలకు భద్రతా హెచ్చరికలు అందాయని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత, అన్నింటికి టేకాఫ్కు అనుమతి ఇచ్చామని తెలిపింది. విస్తారా తన 17 విమానాలకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయని తెలిపింది.
READ MORE: Raging: కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ పై నేషనల్ మెడికల్ కౌన్సిల్ దృష్టి..
బెదిరింపులను ఆపేందుకు ప్రభుత్వం ఏం చేస్తోంది?
ఈ బూటకపు కాల్స్ వెనుక ఉద్దేశం గురించి అడిగితే… రామ్మోహన్ ఇలా కామెంట్ చేశాడు. “ఈ సమయంలో దాని గురించి చెప్పడం చాలా కష్టం. పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారు ఈ సమస్య వెనుక ఉన్న నేరస్థులను పట్టుకోవాలి. వారిని గుర్తించిన తర్వాత వారి ఉద్దేశాలు అర్థం చేసుకోవడం సులభం అవుతుంది.” అని అన్నారు. ఒకే వ్యక్తి వివిధ విమానాల గురించి ట్వీట్ చేసి గందరగోళాన్ని సృష్టించడానికి కారణమవుతున్నట్లు కనిపిస్తోందని రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు. “ఎక్స్లో ఒక వ్యక్తి మాత్రమే ఇలాంటి పోస్టులు పెట్టాడు. అనేక విమానాల గురించి ట్వీట్ చేశాడు. దీంతో మొత్తం వ్యవస్థలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాడు.” భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఇతర ముఖ్య సిబ్బందిని అలెర్ట్ చేస్తున్నామన్నారు రామ్మోహన్. “మేం దీనిని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలనుకుంటున్నాం” అని ఆయన పోస్టు పెట్టారు. బాధ్యులను గుర్తించి శిక్షిస్తామని తెలిపారు. బెదిరింపులకు ప్రతిస్పందనగా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) శనివారం ఎయిర్లైన్ ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఫేక్ బెదిరింపు కాల్స్ను అరికట్టడానికి కఠినమైన నిబంధనలు అమలు చేయాలని భావిస్తోంది.
తాజావార్తలు
-
PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
-
YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
-
Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్ను పరీక్షించిన పాకిస్తాన్..
-
Nizam Exhibitors: మేం పెద్ది సినిమాని టార్గెట్ చేయలేదు.. పర్సనల్ టార్గెట్ చేశారు!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?