Airlines Make Threatening Calls: రోజుకు 50 విమాన బెదిరింపు కాల్స్.. విదేశీ కుట్ర లేదా మరేదైనా?
- భారతీయ విమానయాన గత 14 రోజులుగా బాంబు బెదిరింపులు
- రోజుకు 50 విమాన బెదిరింపు కాల్స్
- ప్రయాణికుల్లో భయాందోళనలు
- విదేశీ కుట్ర లేదా మరేదైనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ విమానయాన సంస్థలకు గత 14 రోజులుగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఈరోజు.. ఆదివారం (అక్టోబర్ 27న) ప్రయాణికులతో నిండిన కనీసం 50 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇన్ని బెదిరింపు కాల్స్ రావడంతో.. ఇది విదేశీ కుట్రనా.. లేక నిజంగానే ఎవరైనా కావాలనే చేస్తున్నారా? అన్నది తెలుసుకోవడం కష్టమవుతోంది. ఈ బెదిరింపులు విమానయాన సంస్థల్లోనే కాకుండా ప్రయాణికుల్లో కూడా విమాన ప్రయాణానికి సంబంధించి భయాందోళనలకు గురిచేస్తున్నాయి.
READ MORE: Benjamin Netanyahu: ‘‘మా నాన్నను చంపారు’’.. నెతన్యాహూకి అవమానం..
Also Read
మూలాధారాల ప్రకారం.. గత 14 రోజుల్లో వివిధ భారతీయ విమానయాన సంస్థలకు చెందిన 350 కంటే ఎక్కువ విమానాలకు బాంబు బెదిరింపులు నివేదించబడ్డాయి. ఇలాంటి బెదిరింపులు ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే వచ్చాయి. ఈరోజు 18 ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే ‘ఆకాసా ఎయిర్’ కూడా తన 15 విమానాలకు భద్రతా హెచ్చరికలు అందాయని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత, అన్నింటికి టేకాఫ్కు అనుమతి ఇచ్చామని తెలిపింది. విస్తారా తన 17 విమానాలకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయని తెలిపింది.
READ MORE: Raging: కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ పై నేషనల్ మెడికల్ కౌన్సిల్ దృష్టి..
బెదిరింపులను ఆపేందుకు ప్రభుత్వం ఏం చేస్తోంది?
ఈ బూటకపు కాల్స్ వెనుక ఉద్దేశం గురించి అడిగితే… రామ్మోహన్ ఇలా కామెంట్ చేశాడు. “ఈ సమయంలో దాని గురించి చెప్పడం చాలా కష్టం. పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారు ఈ సమస్య వెనుక ఉన్న నేరస్థులను పట్టుకోవాలి. వారిని గుర్తించిన తర్వాత వారి ఉద్దేశాలు అర్థం చేసుకోవడం సులభం అవుతుంది.” అని అన్నారు. ఒకే వ్యక్తి వివిధ విమానాల గురించి ట్వీట్ చేసి గందరగోళాన్ని సృష్టించడానికి కారణమవుతున్నట్లు కనిపిస్తోందని రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు. “ఎక్స్లో ఒక వ్యక్తి మాత్రమే ఇలాంటి పోస్టులు పెట్టాడు. అనేక విమానాల గురించి ట్వీట్ చేశాడు. దీంతో మొత్తం వ్యవస్థలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాడు.” భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఇతర ముఖ్య సిబ్బందిని అలెర్ట్ చేస్తున్నామన్నారు రామ్మోహన్. “మేం దీనిని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలనుకుంటున్నాం” అని ఆయన పోస్టు పెట్టారు. బాధ్యులను గుర్తించి శిక్షిస్తామని తెలిపారు. బెదిరింపులకు ప్రతిస్పందనగా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) శనివారం ఎయిర్లైన్ ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఫేక్ బెదిరింపు కాల్స్ను అరికట్టడానికి కఠినమైన నిబంధనలు అమలు చేయాలని భావిస్తోంది.
తాజావార్తలు
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?