UNICEF: పిల్లలపై వలస సంక్షోభం.. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇప్పుడే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వ్యాప్తంగా పిల్లల సంక్షోభానికి గురువుతున్నారు. అనేక కారణాల వల్ల పిల్లల వలసలకు గురువుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇప్పుడే పిల్లల వలస పెరిగిందని యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్) శుక్రవారం వెల్లడించింది. అనేక కారణాల వల్ల సొంత ప్రాంతాలను వదిలి ఇతర దేశాలకు పిల్లలు శరణార్థులుగా వెళ్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా 36.5 మిలియన్ల పిల్లలు 2021 చివరి నాటికి ఘర్షణ, హింస ఇతర సంక్షోభాల కారణంగా సొంత ప్రాంతాలను వదిలి వెళ్లారు. దాదాపుగా 22.8 మిలియన్ల మంది అంతర్గత సంక్షోభం, హింస కారణంగా వలస వెళ్లారు. దీంతో పాటు వాతావరణం, పర్యావరణ పరిణామాలు, విపత్తుల కారణంగా పిల్లలు వరస సంక్షోభాన్ని ఎదుర్కొంటూ శరణార్థులుగా మారుతున్నాయి. తాజాగా 2022లో ఉక్రెయిన్- రష్యా పరిణామాలు కూడా పిల్లల వలసలకు కారణం అయింది. అయితే ఇది యూనిసెఫ్ నివేదికలో చేర్చ లేదు.
Also Read
- Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
- Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
- Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
ఆఫ్ఘనిస్తాన్ తీవ్రమైన హింస, దీర్ఘకాలిక సంఘర్షణ, రాజకీయ అస్థిరత కారణంగా చాలా మంది పిల్లలు మైగ్రేట్ అవుతున్నారు. సరిహద్దుల్లోని పాకిస్తాన్, తజకిస్తాన్, తుర్కమెనిస్తాన్ వంటి దేశాలు శరణార్థి సంక్షోభానికి ప్రభావితం అవుతున్నాయి. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, యెమెన్ వంటి దేశాల్లో వాతావరణ మార్పులు, తీవ్రవాదం, విధ్వంసక పరిణామాలు పిల్లలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. శరణార్థి పిల్లల్లో ఆరోగ్య సంరక్షణ, విద్య, రక్షణ వంటి సేవలు అవసరం అని యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేథరీన్ రస్సెల్ అన్నారు. పిల్లలు వలస వెళ్లకుండా విద్య, రక్షణ ఇతర సేవలు అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అనాథలైన పిల్లలు అక్రమ రవాణా, దోపిడి, హింసకు గురయ్యే ప్రమాదం ఉందని.. ప్రపంచ వ్యాప్తంగా మానవ అక్రమ రవాణాలో 28 శాతం పిల్లలే ఉంటున్నారని నివేదిక తెలిపింది.
తాజావార్తలు
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
-
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..