India Weather : వాతావరణంపై షాకింగ్ రిపోర్ట్.. ఇప్పటికే 3వేలకు పైగా మరణాలు
- ప్రతికూల వాతావరణంపై షాకింగ్ రిపోర్ట్
- దేశంలో ఇప్పటికే 3వేలకు పైగా మరణాలు
- గతేడాది కంటే అత్యధికం
- ఏపీలో అత్యధికంగా ఇళ్లు ధ్వంసం
- 32 లక్షల హెక్టార్లకు పైగా పంట నష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్లో వాతావరణ పరిస్థితులపై షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (CSE) ఈ నివేదిక ప్రకారం.. 2024 మొదటి తొమ్మిది నెలల్లో భారతదేశం 93 శాతం రోజులు ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంది. 274 రోజులలో 255 రోజులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విపరీతమైన వేడి, చలి, తుఫాను, వర్షం, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తుల వల్ల ప్రభావితమైనట్లు నివేదిక చూపుతోంది. ఈ విపత్తులు 3,238 మంది ప్రాణాలను బలిగొన్నాయి. 2.35 లక్షలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. వ్యవసాయం కూడా భారీగా నష్టపోయింది. 32 లక్షల హెక్టార్లకు పైగా భూమిలో పంటలు నాశనమయ్యాయి.
ఈ ఏడాది అధిక మరణాలు..
సీఎస్ఈ నివేదిక 2023 కంటే 2024లో వాతావరణ ప్రభావం ఎక్కువగా ఉందని చూపిస్తుంది. గత ఏడాది ఇదే సమయంలో దేశంలో 273 రోజులలో 235 రోజులు ప్రతికూల వాతావరణ పరిస్థితులు కనిపించాయి. ఫలితంగా 2,923 మంది మరణించారు. 18.4 లక్షల హెక్టార్లలో పంటలు ధ్వంసమయ్యాయి. 80,293 ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఢిల్లీకి చెందిన సంస్థ తన వార్షిక ‘స్టేట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వెదర్’ నివేదికలో మధ్యప్రదేశ్లో వాతావరణం విధ్వంసం సృష్టించిన గరిష్ట సంఖ్య 176 రోజులు అని పేర్కొంది.
Also Read
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
కేరళలో అత్యధిక మరణాలు..
కేరళలో అత్యధికంగా 550 మంది చనిపోయారు. మధ్యప్రదేశ్లో 353 మంది, అస్సాంలో 256 మంది వాతావరణ బారిన పడి అనంతలోకాలకు చేరుకున్నారు. అయితే… ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 85,806 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 142 రోజుల పాటు తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొన్న మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా పంట నష్టం వాటిల్లగా, 60 శాతం పంటలు నాశనమయ్యాయి. పంట నష్టంలో మధ్యప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. ఈ ధోరణి ఊహాజనితమైనది కాదని సిఎస్ఇ డైరెక్టర్ జనరల్ సునీతా నారాయణ్ అంటున్నారు.
వాతావరణం ఎక్కడ విధ్వంసం సృష్టించింది?
నివేదికలోని ప్రాంతాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే.. వాతావరణం మధ్య భారతదేశంలో గరిష్టంగా 218 రోజుల పాటు విధ్వంసం సృష్టించింది. దీని తర్వాత నార్త్-వెస్ట్ వస్తుంది. ఈ ప్రదేశంలో 213 రోజులు ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొన్నాయి. మధ్య భారతదేశంలో 1,001 మంది మరణించారు. దీని తర్వాత దక్షిణ ద్వీపకల్పం-762 మరణాలు, తూర్పు, ఈశాన్య -741 మరణాలు , నార్త్-వెస్ట్ -734 మరణాలు సంభవించాయి.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!