Kakarla Suresh: ఉదయగిరి టీడీపీలోకి చేరికలు.. పార్టీలోకి ఆహ్వానించిన కాకర్ల సురేష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి, నారా లోకేష్ సమక్షంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం నాడు ఆయన అనుచర వర్గంతో కలిగిరి మండలం అనంతపురం గ్రామం నుంచి సుమారు 3000 బైకులతో ర్యాలీగా వచ్చి టీడీపీలో చేరారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో కలిగిరి ఎంపీపీ, ఎంపీటీసీలు సర్పంచులు, మాజీ సర్పంచులు, వార్డ్ నెంబర్లు, ముఖ్య నాయకులు సుమారు 1000 మందికి పైగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. వారందరికీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కంభం విజయరామిరెడ్డిలు కండువాలు కప్పి సాధారంగా పార్టీలోనికి ఆహ్వానించారు.
Read Also: CM Revanth Reddy: నేడు జగిత్యాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
Also Read
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
- Jos Buttler: "నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం".. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- 540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాం.. ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకుంటే పరిశ్రమలు వస్తాయి.. ఉపాధి దొరుకుతుంది, రాజధాని నిర్మాణం జరుగుతుంది, పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది, సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయన్నారు. అలాగే, రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది.. బాబు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాకర్ల సురేష్ కోరారు. ఇక, ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలను ప్రగతి పథంలో నడిపిస్తామని నియోజకవర్గంలో వెనుకబడిన సీతారామపురం మండలాన్ని అగ్రగామిగా నిలుపుతామని నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ లు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్తో ఇండియా మార్కెట్పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!