Himanta Biswa Sarma: అస్సాంలో మరో 300 మదర్సాలను మూసివేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాష్ట్రంలో మదర్సాలపై అణిచివేతను కొనసాగిస్తానని తన ప్రతిజ్ఞను పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో మరో 300 మదర్సాలు మూసివేయబడతాయని గురువారం చెప్పారు. ‘‘బీజేపీకి, ఈ మదర్సాలను నిర్వహిస్తున్న వ్యక్తులకు మధ్య సమావేశం జరిగింది. మరో 300 మదర్సాలు మూతపడతాయని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. అస్సాం పోలీసులు, క్వామీ సంస్థల మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఇది జరిగింది” అని అస్సాం ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలోని 600 మదర్సాలను మూసివేస్తున్నట్లు మార్చిలో సీఎం హిమంత ప్రకటించారు.
Read Also: Titanic Ship: సముద్రంలో మునిగిన టైటానిక్ షిప్ ఇలా ఉందా.. శకలాల 3డీ స్కాన్ చిత్రాల వెల్లడి
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
మాకు మదర్సాలు వద్దు.. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు కావాలని.. కాబట్టి అన్ని మదర్సాలను మూసివేయాలని తాను భావిస్తున్నట్లు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటకలోని బెలగావిలో బీజేపీ విజయ్ సంకల్ప్ యాత్రలో ప్రసంగిస్తూ హిమంత బిస్వా శర్మ అన్నారు. హిమంత బిస్వా శర్మ 2020లో అస్సాంలో ఒక వివాదాస్పద చట్టాన్ని ప్రవేశపెట్టారు. దాని ప్రకారం, అన్ని ప్రభుత్వ మదర్సాలు సాధారణ విద్య అందించే “సాధారణ పాఠశాలలు”గా మార్చబడతాయి. జనవరి 2023 నాటికి, రాష్ట్రంలో 3,000 నమోదిత, నమోదుకాని మదర్సాలు ఉన్నాయి. 1934లో అస్సాం విద్యా పాఠ్యాంశాల్లో మదర్సా విద్య ప్రవేశపెట్టబడింది. అదే సమయంలో రాష్ట్ర మదర్సా బోర్డు కూడా సృష్టించబడింది.
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!