LAGOS : 11రోజులు అన్నం, నీళ్లు లేకుండా ఓడ వెనుక కూర్చుని..3,200 కి.మీ. ప్రయాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LAGOS : పేదరికం కారణంగా పశ్చిమ ఆఫ్రికా నుంచి స్పెయిన్ కు వలస వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇలా వస్తున్న వలసదారులను పోలీసులు అరెస్టు చేసి బహిష్కరిస్తున్నారు. దాంతో వారు కానరీ దీవులకు శరణార్థులుగా వలస వెళ్తున్నారు. అందుకోసం ప్రమాదకరమైన ప్రయాణాలు చేస్తుంటారు. ముగ్గురు శరణార్థులు ఓడ వెనుక కూర్చుని 3,200 కిలోమీటర్లు ప్రయాణించి కానరీ దీవులకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆ ముగ్గురు శరణార్థుల పరిస్థితి విషమంగా మారినట్లు తెలుస్తోంది. నైజీరియాలోని లాగోస్ నుండి కానరీ ద్వీపానికి ముగ్గురు వ్యక్తులు వలసవెళ్లారు. వీరు ముగ్గురూ ఆయిల్ ట్యాంకర్ అలిదిని-2 వెనుక భాగంలో ప్రయాణించారు.
Read Also: Viral Video: క్లాస్ రూంలో చిన్నారుల ఎదుట టీచరు చిందులు.. డ్యాన్స్ ఇరగదీసింది
Also Read
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
- 10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
- AP Weather Alert: ఆంధ్రప్రదేశ్లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
- Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
దాదాపు 11 రోజుల పాటు అన్నం, నీళ్లు లేకుండా రాత్రుళ్లు ప్రయాణం సాగించారు. దాదాపు 3,200 కి.మీ సముద్ర ప్రయాణం చేశారు. ఇలా వారు సజీవంగా కానరీ దీవులకు ఎలా చేరుకోగలిగారో చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే వారి పరిస్థితి విషమించడంతో అక్కడి స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. అక్కడ శరణార్థులకు ఇంటెన్సివ్ కేర్ చికిత్స అందిస్తున్నారు. ఈ ఏడాది 11,600 మంది సముద్ర మార్గంలో తమ దేశంలోకి ప్రవేశించారని స్పెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదించింది. వీరిలో వేలాది మంది ఆఫ్రికన్ శరణార్థులు ఉన్నట్లు సమాచారం.
- Tags
- Refugees
- rice
- ship
- traveled days
- Water
తాజావార్తలు
-
Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
-
Ranabaali Postpone : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పోస్ట్పోన్ అవుతుందా?
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
UPI Charges: రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై.. ఛార్జీల విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!