Jharkhand : జార్ఖండ్ రాష్ట్రంలో ఘోరం.. విద్యుత్ షాక్తో ఆరుగురి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand : జార్ఖండ్ రాష్ట్రంలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్ కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. హౌరా-న్యూఢిల్లీ రైలు మార్గంలో సోమవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ధన్బాద్, గోమోహ్ మధ్య నిచిత్పూర్ సమీపంలో 25వేల వోల్ట్ కరెంటు వైర్ తగలడంతో ఐదుగురు సజీవదహనమయ్యారు. విద్యుత్ తీగకు తగిలి చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. హైటెన్షన్ వైర్ కావడంతో శరీరం చాలా వరకు కాలిపోయింది. ఈ ఘటనతో ఈ రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. తూర్పు మధ్య రైల్వేలోని ధన్ బాద్ డివిజన్ పరిధిలో గల నిచిత్ పూర్ రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ఘటన జరిగింది. రైల్వే క్రాసింగ్ వద్ద విద్యుత్ స్థంభాన్ని ఏర్పాటు చేసే సమయంలో బాధితులు విద్యుత్ షాక్ కు గురి అయ్యారు. ఘటనకు సంబంధించిన ప్రాథమిక సమాచారం ప్రకారం ధన్బాద్ రైల్వే డివిజన్లోని ప్రధాన్ఖాంట నుంచి బంధువా వరకు దాదాపు 200 కి.మీ రైలు మార్గంలో రైళ్ల వేగాన్ని గంటకు 120 నుండి 160 కి.మీలకు పెంచే పనులు జరుగుతున్నాయి.
Read Also: Chittoor: తిరుమల ఘాట్ రోడ్డుపై మరో ప్రమాదం..14 మందికి గాయాలు..
Also Read
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
సోమవారం రైల్వే టీఆర్డీ విభాగం తరఫున నిచిత్పూర్ హాల్ట్ రైలు గేటు సమీపంలో స్తంభం ఏర్పాటు పనులు చేపట్టారు. ఇలాంటి పనులు మొదలు పెట్టాలంటే కాంట్రాక్టర్ ఆ చుట్టు ప్రక్కల నిషేధ బోర్డు అమర్చాలి. అలాగే క్రేన్ సహాయంతో పనులు చేయించాలి. కానీ కాంట్రాక్టర్ అనుమతి లేకుండానే కాంట్రాక్టు కార్మికులతో పనులు చేయిస్తున్నాడు. కూలీలు స్తంభాన్ని ఏర్పాటు చేస్తుండగా స్తంభం 25 వేల వోల్టుల హైటెన్షన్ ఓవర్ హెడ్ వైర్ వైపు వాలింది. అదుపు చేసే క్రమంలో స్తంభం హైటెన్షన్ వైరుకు తగలడంతో కరెంట్ షాక్ తో ఐదుగురు స్పాట్లోనే మృతి చెందారు. ఘటన అనంతరం తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో కాంట్రాక్టర్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న డీఆర్ఎం కమల్ కిషోర్ సిన్హా ఆరుగురు మృతి చెందినట్లు ధృవీకరించారు. ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Read Also: Errabelli Dayakar Rao : అభివృద్ధిని చూసి కుళ్లుకుంటున్నాయి : మంత్రి ఎర్రబెల్లి
తాజావార్తలు
-
Bharat Gaurav: నేపాల్కు ‘భారత్ గౌరవ్’ పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
-
Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
-
Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
-
Peddi : ‘పెద్ది’ బాలీవుడ్ పరిస్థితి ఏంటి.. ఓపెనింగ్ లేకుంటే చరణ్ పాన్ ఇండియా కెరీర్ కష్టమే?
-
BCCI Meeting: సూర్యకుమార్ టీ20 కెప్టెన్సీపై కీలక నిర్ణయం?.. బీసీసీఐ సమావేశంలో హాట్ టాపిక్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..