Jammu Kashmir: పాకిస్థాన్లో ఉన్న 23 మంది ఉగ్రవాదులను పరారీలో ఉన్నవారిగా ప్రకటించిన జమ్మూ కాశ్మీర్ కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ఉన్న కిష్త్వార్ జిల్లాకు చెందిన 23 మంది ఉగ్రవాదులను పరారీలో ఉన్న నేరస్థులుగా ప్రకటించింది జమ్మూ కాశ్మీర్ కోర్టు. అందుకు సంబంధించి పోలీసులు సమాచారం ఇచ్చారు. దోడాలోని ప్రత్యేక UAPA (చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం) కోర్టు ఈ ఉగ్రవాదులపై నమోదైన కేసులకు సంబంధించి తమ ముందు హాజరు కావడానికి ఒక నెల సమయం ఇచ్చిందని, లేకపోతే వారి ఆస్తులను అటాచ్ చేస్తామని అధికారులు తెలిపారు.
Read Also: BJP Meeting: రామమందిర శంకుస్థాపన ఏర్పాట్లపై రేపు బీజేపీ సమావేశం
Also Read
ఈరోజు ఇచ్చిన కోర్టు ఆదేశాలతో కిష్త్వార్లో పరారీలో ఉన్న నేరస్తుల సంఖ్య 36కు చేరుకుందని కిష్త్వార్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) ఖలీల్ పోస్వాల్ తెలిపారు. జిల్లాలో భద్రతా సవాళ్లను పరిష్కరించడానికి.. పాకిస్తాన్, పిఓకె నుండి పనిచేస్తున్న కిష్త్వార్కు చెందిన 23 మంది ఉగ్రవాదులను దోడాలోని యుఎపిఎ ప్రత్యేక కోర్టు ప్రకటిత నేరస్థులుగా ప్రకటించింది అని అన్నారు.
Read Also: Gidugu Rudraraju: త్వరలోనే కాంగ్రెస్లోకి వైఎస్ షర్మిల?.. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా..!
ఇదిలాఉంటే.. సెప్టెంబర్ 16న 13 మంది ఉగ్రవాదులను పరారీలో ఉన్నవారిగా కోర్టు ప్రకటించింది. కిష్త్వార్కు చెందిన 36 మంది ఉగ్రవాదులు పాకిస్థాన్, పీఓకే నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని.. వారిపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని ఖలీల్ పోస్వాల్ అన్నారు. ఈ ఉగ్రవాదులు తమ ఎదుట హాజరుకావాలని కోర్టు ఒక నెల గడువు ఇచ్చిందని ఆయన చెప్పారు. వారు చట్టం ముందు లొంగిపోకపోతే, వారి ఆస్తులను క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 82 కింద అటాచ్ చేస్తారు అని ఆయన అన్నారు. వారిలో 12 మంది ఆస్తులను పోలీసులు ఇప్పటికే గుర్తించారు. సెప్టెంబర్లో ప్రకటిత నేరస్థులుగా ప్రకటించిన 13 మంది ఉగ్రవాదుల్లో ఏడుగురి ఆస్తులను గుర్తించామని, వారిని అటాచ్ చేసే ప్రక్రియను కోర్టులో ప్రారంభించామని ఎస్ఎస్పీ తెలిపారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!