Jammu Kashmir: పాకిస్థాన్లో ఉన్న 23 మంది ఉగ్రవాదులను పరారీలో ఉన్నవారిగా ప్రకటించిన జమ్మూ కాశ్మీర్ కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ఉన్న కిష్త్వార్ జిల్లాకు చెందిన 23 మంది ఉగ్రవాదులను పరారీలో ఉన్న నేరస్థులుగా ప్రకటించింది జమ్మూ కాశ్మీర్ కోర్టు. అందుకు సంబంధించి పోలీసులు సమాచారం ఇచ్చారు. దోడాలోని ప్రత్యేక UAPA (చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం) కోర్టు ఈ ఉగ్రవాదులపై నమోదైన కేసులకు సంబంధించి తమ ముందు హాజరు కావడానికి ఒక నెల సమయం ఇచ్చిందని, లేకపోతే వారి ఆస్తులను అటాచ్ చేస్తామని అధికారులు తెలిపారు.
Read Also: BJP Meeting: రామమందిర శంకుస్థాపన ఏర్పాట్లపై రేపు బీజేపీ సమావేశం
Also Read
ఈరోజు ఇచ్చిన కోర్టు ఆదేశాలతో కిష్త్వార్లో పరారీలో ఉన్న నేరస్తుల సంఖ్య 36కు చేరుకుందని కిష్త్వార్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) ఖలీల్ పోస్వాల్ తెలిపారు. జిల్లాలో భద్రతా సవాళ్లను పరిష్కరించడానికి.. పాకిస్తాన్, పిఓకె నుండి పనిచేస్తున్న కిష్త్వార్కు చెందిన 23 మంది ఉగ్రవాదులను దోడాలోని యుఎపిఎ ప్రత్యేక కోర్టు ప్రకటిత నేరస్థులుగా ప్రకటించింది అని అన్నారు.
Read Also: Gidugu Rudraraju: త్వరలోనే కాంగ్రెస్లోకి వైఎస్ షర్మిల?.. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా..!
ఇదిలాఉంటే.. సెప్టెంబర్ 16న 13 మంది ఉగ్రవాదులను పరారీలో ఉన్నవారిగా కోర్టు ప్రకటించింది. కిష్త్వార్కు చెందిన 36 మంది ఉగ్రవాదులు పాకిస్థాన్, పీఓకే నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని.. వారిపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని ఖలీల్ పోస్వాల్ అన్నారు. ఈ ఉగ్రవాదులు తమ ఎదుట హాజరుకావాలని కోర్టు ఒక నెల గడువు ఇచ్చిందని ఆయన చెప్పారు. వారు చట్టం ముందు లొంగిపోకపోతే, వారి ఆస్తులను క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 82 కింద అటాచ్ చేస్తారు అని ఆయన అన్నారు. వారిలో 12 మంది ఆస్తులను పోలీసులు ఇప్పటికే గుర్తించారు. సెప్టెంబర్లో ప్రకటిత నేరస్థులుగా ప్రకటించిన 13 మంది ఉగ్రవాదుల్లో ఏడుగురి ఆస్తులను గుర్తించామని, వారిని అటాచ్ చేసే ప్రక్రియను కోర్టులో ప్రారంభించామని ఎస్ఎస్పీ తెలిపారు.
తాజావార్తలు
-
Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై ‘లవ్ యూ’ నోట్!
-
Iran: మసీదుల్లో ఆయుధ శిక్షణ.. 3 కోట్ల మంది పేర్లు నమోదు..
-
Bhojshala Case: “భోజ్శాల ఆలయం కాదు”.. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
-
Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..