Jammu Kashmir: పాకిస్థాన్లో ఉన్న 23 మంది ఉగ్రవాదులను పరారీలో ఉన్నవారిగా ప్రకటించిన జమ్మూ కాశ్మీర్ కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ఉన్న కిష్త్వార్ జిల్లాకు చెందిన 23 మంది ఉగ్రవాదులను పరారీలో ఉన్న నేరస్థులుగా ప్రకటించింది జమ్మూ కాశ్మీర్ కోర్టు. అందుకు సంబంధించి పోలీసులు సమాచారం ఇచ్చారు. దోడాలోని ప్రత్యేక UAPA (చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం) కోర్టు ఈ ఉగ్రవాదులపై నమోదైన కేసులకు సంబంధించి తమ ముందు హాజరు కావడానికి ఒక నెల సమయం ఇచ్చిందని, లేకపోతే వారి ఆస్తులను అటాచ్ చేస్తామని అధికారులు తెలిపారు.
Read Also: BJP Meeting: రామమందిర శంకుస్థాపన ఏర్పాట్లపై రేపు బీజేపీ సమావేశం
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
ఈరోజు ఇచ్చిన కోర్టు ఆదేశాలతో కిష్త్వార్లో పరారీలో ఉన్న నేరస్తుల సంఖ్య 36కు చేరుకుందని కిష్త్వార్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) ఖలీల్ పోస్వాల్ తెలిపారు. జిల్లాలో భద్రతా సవాళ్లను పరిష్కరించడానికి.. పాకిస్తాన్, పిఓకె నుండి పనిచేస్తున్న కిష్త్వార్కు చెందిన 23 మంది ఉగ్రవాదులను దోడాలోని యుఎపిఎ ప్రత్యేక కోర్టు ప్రకటిత నేరస్థులుగా ప్రకటించింది అని అన్నారు.
Read Also: Gidugu Rudraraju: త్వరలోనే కాంగ్రెస్లోకి వైఎస్ షర్మిల?.. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా..!
ఇదిలాఉంటే.. సెప్టెంబర్ 16న 13 మంది ఉగ్రవాదులను పరారీలో ఉన్నవారిగా కోర్టు ప్రకటించింది. కిష్త్వార్కు చెందిన 36 మంది ఉగ్రవాదులు పాకిస్థాన్, పీఓకే నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని.. వారిపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని ఖలీల్ పోస్వాల్ అన్నారు. ఈ ఉగ్రవాదులు తమ ఎదుట హాజరుకావాలని కోర్టు ఒక నెల గడువు ఇచ్చిందని ఆయన చెప్పారు. వారు చట్టం ముందు లొంగిపోకపోతే, వారి ఆస్తులను క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 82 కింద అటాచ్ చేస్తారు అని ఆయన అన్నారు. వారిలో 12 మంది ఆస్తులను పోలీసులు ఇప్పటికే గుర్తించారు. సెప్టెంబర్లో ప్రకటిత నేరస్థులుగా ప్రకటించిన 13 మంది ఉగ్రవాదుల్లో ఏడుగురి ఆస్తులను గుర్తించామని, వారిని అటాచ్ చేసే ప్రక్రియను కోర్టులో ప్రారంభించామని ఎస్ఎస్పీ తెలిపారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!