Smart Phone :స్మార్ట్ ఫోన్ కోసం రక్తాన్నిఅమ్ముకునేందుకు 16ఏళ్ల బాలిక రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smart Phone : కరోనా పుణ్యమాని మనిషి జీవితం తారుమారైంది. ప్రభుత్వాలు లాక్డౌన్లు పెట్టడంతో.. విద్యాసంస్థలు ఆన్ లైన్ క్లాసులకు ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. అవి వినేందుకు పిల్లలకు స్మార్ట్ ఫోన్లు కంపల్సరీ అయ్యాయి. ఈ క్రమంలోనే వారు ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. ఎంతలా అంటే ఫోన్ కోసం ఎంతకైనా తెగించే విధంగా మారిపోతున్నారు. ఒక నిరుపేద కుటుంబానికి చెందిన 16 ఏళ్ల బాలిక స్మార్ ఫోన్ కొనడం కోసం ఏకంగా తన రక్తాన్ని అమ్మేందుకు ప్రయత్నించింది.
ఈ షాకింగ్ ఘటన పశ్చిమ బెంగాల్లోని దినజ్పూర్ జిల్లాలో జరిగింది. స్మార్ట్ఫోన్ కొనడానికి తన రక్తాన్ని విక్రయించడానికి సోమవారం జిల్లా ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ను సంప్రదించింది. దినజ్పూర్ జిల్లాలోని తపన్ పోలీస్ స్టేషన్ పరిధి కర్దా ప్రాంతంలో నివసిస్తున్న 16 ఏళ్ల బాలిక 12వ తరగతి చదువుతున్నది. స్మార్ట్ ఫోన్ కొనాలని భావించిన ఆమె రూ.9,000 విలువైన మొబైల్ ఫోన్ను ఆన్లైన్లో ఆర్డర్ చేసింది. అయితే ఆ మొబైల్ అందేలోపు అంత డబ్బు ఏర్పాటు చేసుకోవడం కష్టంగా భావించింది. దీంతో తన రక్తాన్ని అమ్మి డబ్బులు సమకూర్చుకునేందుకు ఆ బాలిక ప్రయత్నించింది.
Also Read
- Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
- Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..
- Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
- Vaibhav Sooryavanshi: వైభవ్ క్రేజ్ మాములుగా లేదుగా.. క్షణాల్లో అమ్ముడుపోయిన టికెట్లు..
Read Also: Madhya Pradesh: బట్టల్లేకుండా వస్తానంటే.. కలెక్టర్ కమ్ అన్నాడంట
బాలూరాఘట్ లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి వెళ్లి, అక్కడి సిబ్బందిని కలిసింది బాలిక. డబ్బులిస్తే రక్తం ఇస్తానని చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన బ్లడ్ బ్యాంక్ అధికారులు చైల్డ్లైన్ ఇండియాకు సమాచారం అందించారు. అనంతరం ఆ బాలిక అసలు రక్తం ఎందుకు అమ్మాలనుకుంటోందో ఆరా తీశారు. ముందు తన సోదరుడి చికిత్స కోసం ఆ బాలిక అబద్దం చెప్పినా.. ఆ తర్వాత స్మార్ట్ఫోన్ కొనుగోలు కోసమని చెప్పడం విని అధికారులు షాకయ్యారు. జిల్లా శిశు సంక్షేమ కమిటీ సహకారంతో బాలికను తల్లిదండ్రులకు అప్పగించి కౌన్సెలింగ్ చేశారు.
Read Also: Gym Trainer : హార్ట్ ఎటాక్ తో కూర్చున్న కుర్చీలోనే ప్రాణాలొదిలిన జిమ్ ట్రైనర్
ఈ మేరకు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తెలిపిన వివరాల మేరకు…ఉదయం 10 గంటలకు ఒక అమ్మాయి మా దగ్గరికి వచ్చింది. జిల్లా ఆసుపత్రికి చెందిన బ్లడ్ బ్యాంక్ కావడంతో రక్తం తీసుకునేందుకు వచ్చిందని మొదట్లో అనుకున్నాం. కానీ ఆమె మాకు రక్తాన్ని అమ్మాలనుకుంటున్నట్లు చెప్పినప్పుడు మేమంతా షాక్ అయ్యాము..అని బాలూర్ఘాట్ జిల్లా ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్ నుండి కనక్ కుమార్ దాస్ అన్నారు.
- Tags
- Blood
- girl
- Smart Phone
- West Bengal
తాజావార్తలు
-
Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
-
Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..
-
The India Story: మనం తినేది అన్నమా? విషమా?.. భయపెడుతున్న ‘ది ఇండియా స్టోరీ’ టీజర్
-
Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!