Gurukul School: గురుకుల పాఠశాలలో 16 మంది విద్యార్థులకు అస్వస్థత.. కారణం అదే
- గురుకుల పాఠశాలలో 16 మంది విద్యార్థులకు అస్వస్థత
- అస్వస్థత గురైన 5, 6, 7, 8 తరగతులకు చెందిన 16 మంది విద్యార్థులు
- స్కూల్ ఆవరణలో దోమల మందు పిచికారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతుండడంతో ఆందోళన నెలకొంది. తమ పిల్లలకు ఎప్పుడు ఏమవుతుందో అని భయాందోళనకు గురవుతున్నారు తల్లిదండ్రులు. ఇప్పుడు మరో ఘటన చోటుచేసుకుంది. అయితే ఇది ఫుడ్ పాయిజన్ వల్ల మాత్రం కాదు. స్కూల్ ఆవరణలో దోమల మందు పిచికారీ చేయడంతో మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం చందనపూర్ గ్రామంలోని బాలుర గురుకుల పాఠశాలలో 16 మంది విద్యార్థుల అస్వస్థతకు గురయ్యారు.
Also Read:Kovvur Midnight Clash: కొవ్వూరులో కూటమి నేతల కుమ్ములాటలు – జనసేన శ్రేణుల ఆందోళన
Also Read
అస్వస్థత గురైన 5, 6, 7, 8 తరగతులకు చెందిన 16 మంది విద్యార్థులు. వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది అనారోగ్యానికి గురైన విద్యార్థులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తగు జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి స్కూల్ ఆవారణలో దోమల మందు పిచికారి చేయించిన పాఠశాల సిబ్బందిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపైన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..