Militants Surrender: అరుణాచల్లో ఆయుధాలతో లొంగిపోయిన 15 మంది ఉగ్రవాదులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Militants Surrender: తూర్పు నాగా జాతీయ ప్రభుత్వానికి చెందిన 15 మంది తీవ్రవాదులు, దాని అధ్యక్షుడు తోషా మొసాంగ్తో సహా, ఆదివారం రాష్ట్ర రాజధాని ఇటానగర్లో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ముందు లొంగిపోయారు. ఇక్కడి పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో తిరుగుబాటుదారులు ఆయుధాలు, మందుగుండు సామగ్రితో లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్, రాష్ట్ర హోం మంత్రి బమాంగ్ ఫెలిక్స్, హెచ్క్యూ ఐగాఆర్ (ఎన్) మేజర్ జనరల్ వికాస్ లఖేరా, హెచ్క్యూ 25 సెక్టార్ కమాండర్ బ్రిగ్ స్వర్ణ్ సింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సతీష్ గోల్చా తదితరులు పాల్గొన్నారు.
ఈ ఈవెంట్ను చారిత్రాత్మకంగా పేర్కొంటూ.. హింసను విడనాడి జాతీయ స్రవంతిలో చేరేందుకు కార్యకర్తలను ఒప్పించడంలో అస్సాం రైఫిల్స్, రాష్ట్ర పోలీసుల సంయుక్త చర్చల ప్రయత్నాలపై ముఖ్యమంత్రి పెమా ఖండూ ప్రశంసలు కురిపించారు. అస్సాం రైఫిల్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో అస్సాం రైఫిల్స్ ద్వారా క్యాడర్ల లొంగుబాటు సులభతరం అయింది. వారు హింసను మానుకుని గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని ఉగ్రవాదులను ఒప్పించారు. “తుపాకీ సంస్కృతి సమస్యకు పరిష్కారం కాదు. నేటి లొంగుబాటు రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించడానికి సంస్ధ తీసుకున్న సానుకూల చర్య, ఈ ప్రాంతంలోని ఇతర సమూహాలను ప్రధాన స్రవంతిలో చేరడానికి ప్రేరేపిస్తుంది, ”అని పెమా ఖండూ అన్నారు.
Also Read
Read Also: Army Rescues Tourists: భారీ హిమపాతం.. 370 మంది పర్యాటకులను రక్షించిన ఆర్మీ
లొంగిపోయిన తిరుగుబాటుదారులకు వారి పునరావాసం కోసం ప్రభుత్వ మద్దతు ఉంటుందని ఖండూ హామీ ఇచ్చారు, ఈశాన్య ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికమని అన్నారు. ఫలితంగా ఈ ప్రాంతంలోని అనేక తిరుగుబాటు గ్రూపులు ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతి చర్చలు ప్రారంభించాయి. చాలా మంది ఇప్పటికే ప్రధాన స్రవంతిలో చేరారు.వారి వద్ద తొమ్మిది చైనా తయారీ ఎమ్క్యూ సిరీస్ ఆయుధాలు, రెండు ఎకె-47 రైఫిళ్లు, ఒక చైనా పిస్టల్, 19 మ్యాగజైన్లు, 415 రౌండ్ల 7.62 ఎంఎం మందుగుండు సామగ్రి, ఐదు రౌండ్ల 9 ఎంఎం పిస్టల్, నాలుగు చైనీస్ గ్రెనేడ్లు న్నాయని సిట్ సూపరింటెండెంట్ రోహిత్ రాజ్బీర్ సింగ్ తెలిపారు. రెక్కలతో కూడిన అండర్-బారెల్ లాంచర్,ఆరు వాకీ టాకీలను స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!