Militants Surrender: అరుణాచల్లో ఆయుధాలతో లొంగిపోయిన 15 మంది ఉగ్రవాదులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Militants Surrender: తూర్పు నాగా జాతీయ ప్రభుత్వానికి చెందిన 15 మంది తీవ్రవాదులు, దాని అధ్యక్షుడు తోషా మొసాంగ్తో సహా, ఆదివారం రాష్ట్ర రాజధాని ఇటానగర్లో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ముందు లొంగిపోయారు. ఇక్కడి పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో తిరుగుబాటుదారులు ఆయుధాలు, మందుగుండు సామగ్రితో లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్, రాష్ట్ర హోం మంత్రి బమాంగ్ ఫెలిక్స్, హెచ్క్యూ ఐగాఆర్ (ఎన్) మేజర్ జనరల్ వికాస్ లఖేరా, హెచ్క్యూ 25 సెక్టార్ కమాండర్ బ్రిగ్ స్వర్ణ్ సింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సతీష్ గోల్చా తదితరులు పాల్గొన్నారు.
ఈ ఈవెంట్ను చారిత్రాత్మకంగా పేర్కొంటూ.. హింసను విడనాడి జాతీయ స్రవంతిలో చేరేందుకు కార్యకర్తలను ఒప్పించడంలో అస్సాం రైఫిల్స్, రాష్ట్ర పోలీసుల సంయుక్త చర్చల ప్రయత్నాలపై ముఖ్యమంత్రి పెమా ఖండూ ప్రశంసలు కురిపించారు. అస్సాం రైఫిల్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో అస్సాం రైఫిల్స్ ద్వారా క్యాడర్ల లొంగుబాటు సులభతరం అయింది. వారు హింసను మానుకుని గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని ఉగ్రవాదులను ఒప్పించారు. “తుపాకీ సంస్కృతి సమస్యకు పరిష్కారం కాదు. నేటి లొంగుబాటు రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించడానికి సంస్ధ తీసుకున్న సానుకూల చర్య, ఈ ప్రాంతంలోని ఇతర సమూహాలను ప్రధాన స్రవంతిలో చేరడానికి ప్రేరేపిస్తుంది, ”అని పెమా ఖండూ అన్నారు.
Also Read
- Bhojshala Case: "భోజ్శాల హిందువులదే".. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
- Bhojshala case: "భోజ్శాల ఒక దేవాలయం".. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
- Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
Read Also: Army Rescues Tourists: భారీ హిమపాతం.. 370 మంది పర్యాటకులను రక్షించిన ఆర్మీ
లొంగిపోయిన తిరుగుబాటుదారులకు వారి పునరావాసం కోసం ప్రభుత్వ మద్దతు ఉంటుందని ఖండూ హామీ ఇచ్చారు, ఈశాన్య ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికమని అన్నారు. ఫలితంగా ఈ ప్రాంతంలోని అనేక తిరుగుబాటు గ్రూపులు ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతి చర్చలు ప్రారంభించాయి. చాలా మంది ఇప్పటికే ప్రధాన స్రవంతిలో చేరారు.వారి వద్ద తొమ్మిది చైనా తయారీ ఎమ్క్యూ సిరీస్ ఆయుధాలు, రెండు ఎకె-47 రైఫిళ్లు, ఒక చైనా పిస్టల్, 19 మ్యాగజైన్లు, 415 రౌండ్ల 7.62 ఎంఎం మందుగుండు సామగ్రి, ఐదు రౌండ్ల 9 ఎంఎం పిస్టల్, నాలుగు చైనీస్ గ్రెనేడ్లు న్నాయని సిట్ సూపరింటెండెంట్ రోహిత్ రాజ్బీర్ సింగ్ తెలిపారు. రెక్కలతో కూడిన అండర్-బారెల్ లాంచర్,ఆరు వాకీ టాకీలను స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Bhojshala Case: “భోజ్శాల హిందువులదే”.. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
-
Monsoon 2026: గుడ్న్యూస్.. కేరళలోకి ఆరు రోజులు ముందుగానే మాన్సూన్ ఎంట్రీ! ఖరారు చేసిన ఐఎండీ..
-
PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
-
Bhojshala case: “భోజ్శాల ఒక దేవాలయం”.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
-
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!