Chhattisgarh: ట్యాంక్ లోని నీరు తాగి 132 మందికి అస్వస్థత.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఘటన..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh: ఛత్తీస్గఢ్లోని బలోద్ జిల్లా గుండర్ దేహి బ్లాక్ కు చెందిన ఖుతేరి గ్రామ ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. ఊరిలో ఉండే ట్యాంక్ లోని నీరు తాగి 132 మంది అస్వస్థతకు గురయ్యారు. అయితే గ్రామంలోనే వారికి తాత్కాలిక శిబిరం ఏర్పాటు చేసి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో 112 మంది జ్వరంతో బాధపడుతుండగా.. 5 మందికి వాంతులు విరేచనాలు, 15 మంది జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఒకే గ్రామంలో ఇంతమంది అస్వస్థతకు గురి కావడంతో వైద్యారోగ్య శాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు.
Read Also: Guinness World Record: గిన్నిస్ రికార్డుల్లోకి ఐరాస యోగా డే ఈవెంట్.. ఎందుకంటే..?
Also Read
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
ట్యాంక్ లోని నీరు తాగిన వారిలో మరికొంత మంది అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్లోని నీరు తాగడం వల్లే రోగాల బారిన పడుతున్నట్లు గ్రామ ప్రజలు వాపోతున్నారు. మరోవైపు వైద్యులు నీరు మరిగించి తాగాలని, ఆహార పదార్థాలను మూతపెట్టి ఉంచాలని, పాత ఆహారం తినవద్దని సూచిస్తున్నారు. త్రాగునీటిలో క్లోరిన్ టాబ్లెట్ వాడాలని తెలిపారు. అంతేకాకుండా 7 రోజుల పాటు ఆరోగ్య కార్యకర్తల ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
Read Also: Bandi Sanjay: కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ.. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే..
జూన్ 17వ తేదీ నుండి ఆ గ్రామంలో జ్వరం మరియు తలనొప్పికి సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు నిరంతరంగా ప్రతిరోజూ డజన్ల కొద్దీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే అదృష్టవశాత్తు ఒక్కరూ కూడా విషమంగా లేకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఖుతేరి గ్రామంలో ఇలాంటి కేసులు ఇంకా వస్తున్నాయని సీఎంహెచ్వో జేఎల్ యూకే తెలిపారు. అందకోసం గ్రామ పంచాయతీ భవన్లో శిబిరాలు ఏర్పాటు చేసి అందరికీ వైద్యం అందిస్తున్నారు. అయితే అధికారులు వాటర్ ట్యాంక్లోని నీటి నమూనాలను పరిశీలనకు పంపారు. గ్రామస్థులు అనారోగ్యం పాలవడానికి గల కారణాలేమిటన్నది నివేదిక వచ్చిన తేలనునట్లు సీఎంహెచ్వో వెల్లడించారు.
తాజావార్తలు
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్లో ఉండగానే ఇంత సడెన్గా ఆ డెసిషన్ ఎందుకు?
-
WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
-
Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
-
Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
-
Rama Nandana: “మొగుడిని బాత్రూమ్లో దాచేది”.. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!