Yemen Shipwreck: యెమెన్ తీరంలో పడవ బోల్తా.. 13 మంది మృతి
- యెమెన్ తీరంలో పడవ బోల్తా
- పడవ మునిగిపోవడంతో 13 మంది మృతి
- 14 మంది గల్లంతు.. వారి కోసం గాలింపు చర్యలు
- పడవలో మొత్తం 25 మంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యెమెన్ తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. పడవ మునిగిపోవడంతో 13 మంది చనిపోయారు. ఐక్యరాజ్యసమితి మైగ్రేషన్ ఏజెన్సీని ఉటంకిస్తూ నివేదిక ప్రకారం.. పడవ ప్రమాదంలో 14 మంది గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. యెమెన్లోని తైజ్ ప్రావిన్స్ తీరంలో మంగళవారం వలస పడవ బోల్తా పడింది. ఈ పడవలో తూర్పు ఆఫ్రికా దేశం ఇథియోపియాకు చెందిన 25 మంది పౌరులు ఉన్నారు. ఇద్దరు యెమెన్కు చెందినవారు ఉన్నారు. కాగా.. ఈ పడవ తూర్పు ఆఫ్రికా దేశం జిబౌటి నుండి బయలుదేరింది.
Read Also: Shiekh Hasina: షేక్ హసీనాపై మరో 4 మర్డర్ కేసులు పెట్టిన బంగ్లాదేశ్..
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
పడవ ప్రమాదానికి సంబంధించి IOM నివేదిక ప్రకారం.. చనిపోయిన వారిలో 11 మంది మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు అన్వేషణ కొనసాగిస్తోంది. తప్పిపోయిన వారిలో యెమెన్ కెప్టెన్.. అతని సహాయకుడు కూడా ఉన్నారు. ఓడ బోల్తా పడటానికి గల కారణాలు తెలియరాలేదు. యెమెన్లోని IOM మిషన్ యొక్క తాత్కాలిక అధిపతి మాట్లాడుతూ.. ఇది ప్రమాదకరమైనది అయినప్పటికీ, పెద్ద సంఖ్యలో వలసదారులు ఈ సముద్ర మార్గం గుండా ప్రయాణిస్తున్నారని చెప్పారు. జూన్-జూలైలో కూడా పడవ బోల్తా పడిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు.
Read Also: Kolkata Doctor Murder: మహిళా డాక్టర్పై అత్యాచారం ఘటనపై.. కోల్కతా గణేశ్ ఉత్సవ కమిటీ సంచలన నిర్ణయం
2023లో 97,200 మంది వలసదారులు యెమెన్కు వచ్చారు. ఈ సంఖ్య 2022 కంటే ఎక్కువ. భద్రతను దృష్టిలో ఉంచుకుని అధిక సంఖ్యలో ప్రజలు సముద్ర మార్గంలో ప్రయాణిస్తున్నారు. 10 సంవత్సరాలకు పైగా.. ఈ దేశం పేదరికంతో పాటు అంతర్యుద్ధంతో బాధపడుతోంది. సౌదీ అరేబియా.. ఇతర గల్ఫ్ దేశాలకు కార్మికులుగా, గృహ కార్మికులుగా పనిచేయడానికి ప్రజలు వెళ్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!