Pakistan : కేజీ బియ్యం రూ.335.. ధర చూసి బిత్తరపోతున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan : శ్రీలంకలో గత ఏడాది ఆర్థిక సంక్షోభం నెలకొంది. భారత్ సహా పొరుగు దేశాల సహకారంతో శ్రీలంక దాని నుంచి ప్రస్తుతం కోలుకుంటుంది. ఈ విషయంలో మరో ఆసియా దేశమైన పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత ఏడాది దేశంలో వరదల కారణంగా 1,700 మందికి పైగా మరణించారు. 20 లక్షల మంది ఇళ్లు కోల్పోయారు. ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల వంటి సమస్యలతో పాక్ ప్రజలు దయనీయ స్థితిలో ఉన్నారు. కొత్త సంవత్సరం బ్రెడ్, పాల ఉత్పత్తులు, గోధుమలతో సహా రోజువారీ వస్తువుల ధరలు పెరిగాయి.
Read Also: Maheshwar Reddy: మంత్రి ఇంద్రకిరణ్కి మహేశ్వర్ రెడ్డి కౌంటర్.. ఆ వ్యాఖ్యలు హాస్యాస్పదం
Also Read
ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభంతో పాటు, జూన్ 2022లో వరదల ప్రభావం విద్యుత్ ఉత్పత్తిపై పడింది. ఇంధన రంగంపై ప్రభావం కారణంగా, ఇంధన కొరత కూడా ఏర్పడింది. దేశం కూడా విదేశీ మారకద్రవ్య నిల్వల కొరతతో బాధపడుతోంది. ఆర్థిక సంక్షోభం నుండి కోలుకోవడానికి, పాకిస్తాన్ యునైటెడ్ స్టేట్స్, సౌదీ అరేబియా, అంతర్జాతీయ ద్రవ్య నిధితో సహా సంస్థల నుండి రుణాలను కోరింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి కూడా రుణం పొందేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది. ఈ CDMP కోసం ఇది రుణ నిర్వహణ ప్రణాళికను రూపొందించి IMFకి పంపింది. అయితే, దీనిని పరిశీలించిన సంస్థ ఈ ప్రణాళికను తిరస్కరించింది.
Read Also:Vemula Prashanth Reddy: ప్రధాని మోడీ ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు
దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దేశంలో ధరలు ఒక్కసారిగా పెరిగి ప్రజలపై పెనుభారం మోపింది. రంజాన్ మాసంలో ధరలు మరోసారి రెట్టింపయ్యాయి. దీని ప్రకారం కిలో బియ్యం ధర రూ.50 నుంచి రూ. 335కు పెరిగింది. పండ్ల ధరలు కూడా అనూహ్యంగా పెరిగాయి. స్వీట్ ఆరెంజ్ ధర డజన్ రూ.440, ఆరెంజ్ డజన్ రూ.400, అరటిపండు డజన్ రూ.300. దానిమ్మ పండు కిలో రూ.440, ఇరానియన్ యాపిల్ కిలో రూ.340, జామ పండు రూ.350, స్ట్రాబెర్రీ రూ.280గా ఉంది. అదేవిధంగా మాంసం ధరలు కూడా పెరుగుతున్నాయి. గతంలో కిలో రూ.700గా ఉన్న మాంసం ధర రూ.1000కు చేరింది. మటన్ ధర కూడా రూ.1,400 నుంచి రూ.1,800కి పెరిగింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర మాకు ఆమోదయోగ్యంగా లేదని మార్కెట్ వ్యాపారులు చెబుతున్నారు. ఆహార ద్రవ్యోల్బణం పెరగడంతో ప్రస్తుత సంవత్సరంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ధరల పెరుగుదల వల్ల పేద ప్రజలు పండుగను సక్రమంగా జరుపుకోలేకపోతున్నారు.
తాజావార్తలు
-
Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!