Baba Siddique: బాబా సిద్ధిఖీ హత్య కేసులో కుట్రదారుడు అక్తర్ అరెస్ట్
- బాబా సిద్ధిక్ హత్యకేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్
- జీషాన్ అక్తర్ కెనడాలో అరెస్ట్
- భారత్కు తరలించేందుకు ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్యకేసులో కుట్రదారుడు జీషాన్ అక్తర్ కెనడాలో అరెస్ట్ అయ్యాడు. అక్తర్ను తీసుకొచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ 2024 అక్టోబర్ 12న బాంద్రా ప్రాంతంలో హత్యకు గురయ్యారు. కార్యాలయంలో ఉండగా దుండగులు కాల్పులు జరిపి హతమార్చారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ హత్య జరగడంతో దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. అయితే తాజాగా ఈ హత్య కేసులో కుట్రదారుడైన జీషన్ అక్తర్ కెనడాలో అరెస్ట్ అయ్యాడు. నకిలీ పాస్పోర్ట్ కేసులో జీషాన్ అక్తర్ (22)ను అరెస్టు చేసినట్లు వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: US: ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేసే ఛాన్స్.. అమెరికా హై అలర్ట్
Also Read
- KTR: ప్రచార హామీలు మరిచారా.? జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రభుత్వంపై ఫైర్.!
- Brij Bhushan Sharan Singh: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసు.. బ్రిజ్ భూషణ్ సింగ్ను నిర్దోషిగా తేల్చిన కోర్టు
- Sangareddy: చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.3 కోట్లతో భార్యాభర్తలు పరార్.!
- Solar Eclipse: అజ్ఞానం రాసిన కథను.. విజ్ఞానం తిరగరాసింది.. సూర్యగ్రహణం వెనుక దాగిన నిజం!
జీషన్ అక్తర్ను భారత్కు తీసుకొచ్చేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు మహారాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి యోగేష్ కదమ్ బుధవారం తెలిపారు. అనంతరం అతన్ని విచారిస్తామని పేర్కొన్నారు. ముంబై పోలీసుల కథనం ప్రకారం.. జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్.. బాబా సిద్ధిఖీని హత్య చేసేందుకు జీషన్ అక్తర్, శుభం లోంకర్లకు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కేసులో ఇప్పటి వరకు 25 మందిని అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Thammudu : ఇదేంటి దిల్ రాజు ఇలా ఓపెన్ అయ్యాడు?
బాబు సిద్ధిఖీ హత్య కేసులో అరెస్టైన నిందితులను విచారించగా జీషాన్ అక్తర్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ హత్యకు ప్రణాళిక వేసింది జీషానేనని వెల్లడించారు. హత్య జరిగిన వెంటనే నకిలీ పాస్పోర్టును వినియోగించి దేశం విడిచి పారిపోయాడు. దీంతో జీషాన్పై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఈ క్రమంలో అతడు కెనడాలో అరెస్ట్ అయ్యాడు.
జీషాన్ అసలు పేరు మొహమ్మద్ యాసిన్ అక్తర్.. పంజాబ్లోని జలంధర్ వాసి. 2022లో పంజాబ్ పోలీసులు ఓ కేసులో అరెస్ట్ చేశారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో సన్నిహిత సంబంధాలున్నాయి. 2024, అక్టోబర్ 12న బాబా సిద్ధిఖీ ముంబైలోని తన కుమారుడి కార్యాలయంలో ఉండగా కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయారు.
తాజావార్తలు
-
KTR: ప్రచార హామీలు మరిచారా.? జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రభుత్వంపై ఫైర్.!
-
Indian Army Internship 2026: రూ.75 వేల స్టైపెండ్.. భారత సైన్యం నుంచి ఇంటర్న్షిప్ అవకాశం!
-
SS Rajamouli : వారణాసి కథ, కథనం ఏంటో చెప్పిన రాజమౌళి
-
Medak: నకిలీ బాబా బాగోతం.. యువతిని పెళ్లి చేసుకుని, గుప్తనిధుల పేరుతో లక్షలు కాజేసిన కేటుగాడు..!
-
Dr Mohan Rao Patibandla: గుంటూరు వైద్యుడికి అంతర్జాతీయ వేదికపై త్రివిజయం.. ఒకే సదస్సులో మూడు పురస్కారాలు!
ట్రెండింగ్
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!