Supreme Court: “మహిళా వైద్యుల భద్రత మీ బాధ్యత”.. బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
- పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
- కోల్కతా వైద్యురాలి ఘటనపై విచారణ..
- మహిళా వైద్యులకు నైట్ డ్యూటీ మినహాయిస్తూ ప్రభుత్వ నోటిఫికేషన్..
- మహిళలు రాత్రి పూట పనిచేయలేరని మీరు ఎందుకు అనుకుంటున్నారు..? వారికి భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత..
- సుప్రీం ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: కోల్కతా వైద్యురాలి ఘటనపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ తీరుపై ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళా వైద్యులకు రాత్రి షిఫ్టులు కేటాయించడాన్ని నిరాకరిస్తున్నామని ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ని సీజేఐ విమర్శించారు. వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వానిది అని అన్నారు.
కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ తీసుకువచ్చింది. ‘‘మహిళలు పనిచేయని మీరు ఎలా చెప్పగలరు..రాత్రి వేళ్లలో మహిళా వైద్యులకు రాయితీ అక్కర్లేదు..అదే షిఫ్టులో పనిచేయడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారు’’ అని బెంగాల్ ప్రభుత్వం తరుపున కేసు వాదిస్తున్న కపిల్ సిబల్ని ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది.
Also Read
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
- PM Modi: జేడీ వాన్స్తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
- Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
‘‘మిస్టర్ సిబల్ మీరు దీన్ని చూడాలి. దానికి సమాధానం మీరు తప్పనిసరిగా భద్రత ఇవ్వాలి. పశ్చిమ బెంగాల్ నోటిఫికేషన్ సరిచేయాలి. భద్రత కల్పించడం మీ డ్యూటీ. మహిళలు రాత్రి పూట పనిచేయలేరు అని మీరు చెప్పలేరు. పైలట్లు, ఆర్మీ మొదలైనవి రాత్రి కూడా పనిచేస్తున్నాయి. ’’ అని సీజేఐ అన్నారు. మహిళా వైద్యులు పరిస్థితి రాత్రిపూట పని చేయకపోవడం వారి కెరీర్కి విఘాతం కలిగిస్తుందని కోర్టు పేర్కొంది.
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగడంతో, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అలపన్ బంద్యోపాధ్యాయ మహిళా వైద్యుల భద్రతకు భరోసా ఇవ్వడానికి కొత్త చొరవను ప్రకటించారు. అన్ని మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల వద్ద ఉమెన్-ఫ్రెండ్లీ భద్రతా సిబ్బందిని మోహరిస్తామని చెప్పారు. వైద్య కళాశాలలు, ఆసుపత్రుల వద్ద స్థానిక పోలీసులతో నిత్యం రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.రాత్రి విధుల విషయంలో మహిళా వైద్యులు జంటగా పనిచేసే విధంగా షిఫ్ట్లు ఏర్పాటు చేయబడతాయని చెప్పారు.
తాజావార్తలు
-
Anjali Sivaraman: హీరోయిన్గా కాదు.. అమృతా షేర్గిల్గా అంజలి.. 100 ఆడిషన్ల తర్వాత బిగ్ ఛాన్స్!
-
Ashmita Chaliha: కొరియాలో భారత త్రివర్ణం రెపరెపలు.. చైనా షట్లర్ను చిత్తు చేసిన అష్మిత చాలిహా.. తొలి BWF టైటిల్ సొంతం!
-
Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
-
Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
-
Adnan Sami: ఆరు నెలలే బ్రతుకుతానన్నారు.. తండ్రికిచ్చిన మాటకోసం 110 కిలోలు తగ్గినా: అద్నాన్ సమి
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!