Supreme Court: “మహిళా వైద్యుల భద్రత మీ బాధ్యత”.. బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
- పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
- కోల్కతా వైద్యురాలి ఘటనపై విచారణ..
- మహిళా వైద్యులకు నైట్ డ్యూటీ మినహాయిస్తూ ప్రభుత్వ నోటిఫికేషన్..
- మహిళలు రాత్రి పూట పనిచేయలేరని మీరు ఎందుకు అనుకుంటున్నారు..? వారికి భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత..
- సుప్రీం ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: కోల్కతా వైద్యురాలి ఘటనపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ తీరుపై ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళా వైద్యులకు రాత్రి షిఫ్టులు కేటాయించడాన్ని నిరాకరిస్తున్నామని ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ని సీజేఐ విమర్శించారు. వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వానిది అని అన్నారు.
కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ తీసుకువచ్చింది. ‘‘మహిళలు పనిచేయని మీరు ఎలా చెప్పగలరు..రాత్రి వేళ్లలో మహిళా వైద్యులకు రాయితీ అక్కర్లేదు..అదే షిఫ్టులో పనిచేయడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారు’’ అని బెంగాల్ ప్రభుత్వం తరుపున కేసు వాదిస్తున్న కపిల్ సిబల్ని ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది.
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
‘‘మిస్టర్ సిబల్ మీరు దీన్ని చూడాలి. దానికి సమాధానం మీరు తప్పనిసరిగా భద్రత ఇవ్వాలి. పశ్చిమ బెంగాల్ నోటిఫికేషన్ సరిచేయాలి. భద్రత కల్పించడం మీ డ్యూటీ. మహిళలు రాత్రి పూట పనిచేయలేరు అని మీరు చెప్పలేరు. పైలట్లు, ఆర్మీ మొదలైనవి రాత్రి కూడా పనిచేస్తున్నాయి. ’’ అని సీజేఐ అన్నారు. మహిళా వైద్యులు పరిస్థితి రాత్రిపూట పని చేయకపోవడం వారి కెరీర్కి విఘాతం కలిగిస్తుందని కోర్టు పేర్కొంది.
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగడంతో, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అలపన్ బంద్యోపాధ్యాయ మహిళా వైద్యుల భద్రతకు భరోసా ఇవ్వడానికి కొత్త చొరవను ప్రకటించారు. అన్ని మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల వద్ద ఉమెన్-ఫ్రెండ్లీ భద్రతా సిబ్బందిని మోహరిస్తామని చెప్పారు. వైద్య కళాశాలలు, ఆసుపత్రుల వద్ద స్థానిక పోలీసులతో నిత్యం రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.రాత్రి విధుల విషయంలో మహిళా వైద్యులు జంటగా పనిచేసే విధంగా షిఫ్ట్లు ఏర్పాటు చేయబడతాయని చెప్పారు.
తాజావార్తలు
-
Akkineni Nagarjuna : 29న నాగార్జున ‘కింగ్ 100’ క్రేజీ గ్లింప్స్ బ్లాస్ట్.. అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ అప్డేట్
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!