Asaduddin Owaisi: హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు..
- బీజేపీని కాంగ్రెస్ గెలిపించింది..
- అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు..
- కాంగ్రెస్ పనితీరుపై ఆగ్రహం..
Asaduddin Owaisi: హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసి, బీజేపీ ఘన విజయాన్ని సాధించింది. మొత్తం 90 స్థానాల్లో 48 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 37 స్థానాలకే పరిమితమైంది. ఇదిలా ఉంటే, ఈ ఓటమిపై కాంగ్రెస్ మిత్రపక్షాలు, ఇండియా కూటమి పార్టీలు హస్తం పార్టీపై విరుచుకుపడుతున్నాయి. అహంకారం, అతివిశ్వాసమే కాంగ్రెస్ని దెబ్బతీసిందని ఉద్దవ్ ఠాక్రే శివసేన ఆరోపించింది. టీఎంసీ కూడా ఇలాంటి విమర్శలనే చేసింది.
Read Also: Israel: లెబనాన్కు నెతన్యాహు వీడియో వార్నింగ్.. గాజాకు పట్టిన గతే పడుతుందని హెచ్చరిక
తాజాగా హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ ఓటమిపై స్పందించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. హర్యానాలో అధికార బీజేపీపై వ్యతిరేక ఉన్నప్పటికీ, కాంగ్రెస్ బీజేపీని ఓడించలేకపోవడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఈవీఎంలపై నిందలు వేయడం కాంగ్రెస్కి అలవాటైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ విజయానికి కాంగ్రెస్ కారణమని, హర్యానాలో వారే ప్రతిపక్షంగా ఉన్నారని చెప్పారు.
‘‘ఈవీఎంలను నిందించడం చాలా సులువు. మీరు ఈవీఎంల వల్లే గెలిచారు. మీరు ఓడిపోతే తప్పు. నా ఉద్దేశం ప్రకారం బీజేపీ ఈ రాష్ట్రంలో(హర్యానా)లో ఓడిపోవాల్సింది. వారికి అనేక విసయాలు వ్యతిరేకంగా ఉన్నాయి’’ అని ఆయన అన్నారు. పదేళ్లపాటు అధికార వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి, కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు బీజేపీకి లాభం చేకూర్చాయని అన్నారు. ఎన్నికల పోరులో బీజేపీకి కాస్త అవకాశం ఇచ్చినా, సద్వినియోగం చేసుకుంటుందని అన్నారు.
తాజావార్తలు
-
Citadel Season 2: యాక్షన్లోకి దిగిన ప్రియాంక చోప్రా.. ‘సిటాడెల్’ సీజన్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్..
-
High Court: కేసీఆర్, హరీష్ రావుకు బిగ్ రిలీఫ్.. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టుపై హైకోర్టు స్టే..
-
Polavaram-Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. జనాలను అప్రమత్తం చేసిన అటవీ శాఖ!
-
Venugopal Rao: ఢిల్లీ క్యాపిటల్స్ను ముంచేసింది వాళ్లే.. డైరెక్టర్ వేణుగోపాల్ రావు కుండబద్దలు!
-
Dhurandhar: హిస్టరీలో ఫస్ట్ టైమ్.. థియేటర్లలో ‘ధురంధర్’ మేకింగ్?
ట్రెండింగ్
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?
-
144Hz రిఫ్రెష్ రేట్, 13.2 అంగుళాల డిస్ప్లే, 13380mAh బ్యాటరీతో OPPO Pad 5 Pro లాంచ్.!
-
50MP+50MP+50MP కెమెరాలు, IP68/IP69 రేటింగ్, వేపర్ చాంబర్ కూలింగ్ టెక్నాలజీతో నేడు లాంచ్ కానున్న Motorola Edge 70 Pro.!
-
Abhishek Sharma సెంచరీ దెబ్బ.. రికార్డులు అబ్బా.. బద్దలైన రికార్డులు ఇవే..!
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!