Union Budget: తమిళనాడులో బడ్జెట్ మంటలు.. డీఎంకే వర్సెస్ బీజేపీ..
- తమిళనాడులో కేంద్ర బడ్జెట్ మంటలు..
- రాష్ట్రం పేరు కూడా లేదని స్టాలిన్ ఆగ్రహం..
- యూపీఏ సమయంలో 6 సార్లు తమిళనాడు ప్రస్తావన లేనది బీజేపీ కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget: కేంద్ర బడ్జెట్ తమిళనాడులో అధికార డీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి కారుణమవుతోంది. బడ్జెట్లో కేంద్రం తమిళనాడును పట్టించుకోలేదని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనపై దృష్టి సారించడం కన్నా ప్రత్యర్థులనున లక్ష్యంగా చేసుకుంటే మీరు ఒంటరి అవుతారని ప్రధానిని హెచ్చరించారు. ఇండియా కూటమిలోని డీఎంకే, బీజేపీ 400 స్థానాల ఆశల్ని దెబ్బతీసిందని, తమిళనాడులో రెండోసారి వరసగా ఓటమిని అందించిందని ఆయన అన్నారు.
Read Also: Bihar: పేపర్ లీకేజీకి పాల్పడితే పదేళ్లు జైలు.. రూ.కోటి ఫైన్.. అసెంబ్లీలో బిల్లు ఆమోదం
Also Read
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
- Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
ఎన్నికలము ముగిశాయని, ప్రస్తుతం మనం దేశం గురించి ఆలోచించాలని, 2024 బడ్జెట్ మీ ప్రభుత్వాన్ని కాపాడుతుంది, కానీ దేశాన్ని కాదని, ప్రభుత్వాన్ని నిష్పక్షపాతంగా నడపండని, లేకుంటే మీరు ఒంటిరి అవుతారని స్టాలిన్ అన్నారు. మిమ్మల్ని ఓడించిన వారి పట్ల మీరు ప్రతీకారం తీర్చుకోవద్దని ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. డీఎంకే అధికార ప్రతినిధి ఏ శరవణన్ మాట్లాడుతూ.. బీహార్ కన్నా 10 రెట్లు మేం భారత ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నామని, మేమే అతిపెద్ద పన్ను చెల్లింపుదారులమని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే, శనివారం జరగబోయే నీతి ఆయోగ్ సమావేశానికి స్టాలిన్తో సహా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, రేవంత్ రెడ్డి, సుఖ్విందర్ సుఖు దాటవేయనున్నారు. బడ్జెట్కి తమ నిరసన తెలియజేయనున్నారు.
ఇదిలా ఉంటే తమిళనాడులో అధికార డీఎంకే చేస్తున్న విమర్శలకు బీజేపీ గట్టిగానే స్పందిస్తోంది. నీతిఆయోగ్ సమావేశానికి గైర్హాజరు అవుతామని ముఖ్యమంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాలు సమర్పించిన 10 బడ్జెట్లలో ఆరు సార్లు తమిళనాడు ప్రస్తావన లేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి ఏ సంక్షేమ పథకం కూడా రావడం లేదనే అభిప్రాయాన్ని స్టాలిన్ కలిగిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్తో కలిసి డీఎంకే కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో ఆరు బడ్జెట్లలో రాష్ట్రం పేరు కూడా లేదని అన్నామలై ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
Virat Kohli: SRH మ్యాచ్కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ స్థితికి కారణం వారే అంటూ..
-
Peddi: ‘పెద్ది’కి లైన్ క్లియర్.. పర్సంటేజ్ విధానంపై గుడ్ న్యూస్
-
Hyderabad Water Board : ఏసీబీ దాడుల్లో షాక్.. బయటపడ్డ కోట్ల సామ్రాజ్యం.!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
-
Cheesy Chicken Sandwich Recipe: నోరూరించే చీజీ ‘చికెన్ శాండ్విచ్’.. బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ కోసం ఐదు నిమిషాల్లో ఇలా చేసుకోండి!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!