Union Budget: తమిళనాడులో బడ్జెట్ మంటలు.. డీఎంకే వర్సెస్ బీజేపీ..
- తమిళనాడులో కేంద్ర బడ్జెట్ మంటలు..
- రాష్ట్రం పేరు కూడా లేదని స్టాలిన్ ఆగ్రహం..
- యూపీఏ సమయంలో 6 సార్లు తమిళనాడు ప్రస్తావన లేనది బీజేపీ కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget: కేంద్ర బడ్జెట్ తమిళనాడులో అధికార డీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి కారుణమవుతోంది. బడ్జెట్లో కేంద్రం తమిళనాడును పట్టించుకోలేదని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనపై దృష్టి సారించడం కన్నా ప్రత్యర్థులనున లక్ష్యంగా చేసుకుంటే మీరు ఒంటరి అవుతారని ప్రధానిని హెచ్చరించారు. ఇండియా కూటమిలోని డీఎంకే, బీజేపీ 400 స్థానాల ఆశల్ని దెబ్బతీసిందని, తమిళనాడులో రెండోసారి వరసగా ఓటమిని అందించిందని ఆయన అన్నారు.
Read Also: Bihar: పేపర్ లీకేజీకి పాల్పడితే పదేళ్లు జైలు.. రూ.కోటి ఫైన్.. అసెంబ్లీలో బిల్లు ఆమోదం
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
ఎన్నికలము ముగిశాయని, ప్రస్తుతం మనం దేశం గురించి ఆలోచించాలని, 2024 బడ్జెట్ మీ ప్రభుత్వాన్ని కాపాడుతుంది, కానీ దేశాన్ని కాదని, ప్రభుత్వాన్ని నిష్పక్షపాతంగా నడపండని, లేకుంటే మీరు ఒంటిరి అవుతారని స్టాలిన్ అన్నారు. మిమ్మల్ని ఓడించిన వారి పట్ల మీరు ప్రతీకారం తీర్చుకోవద్దని ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. డీఎంకే అధికార ప్రతినిధి ఏ శరవణన్ మాట్లాడుతూ.. బీహార్ కన్నా 10 రెట్లు మేం భారత ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నామని, మేమే అతిపెద్ద పన్ను చెల్లింపుదారులమని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే, శనివారం జరగబోయే నీతి ఆయోగ్ సమావేశానికి స్టాలిన్తో సహా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, రేవంత్ రెడ్డి, సుఖ్విందర్ సుఖు దాటవేయనున్నారు. బడ్జెట్కి తమ నిరసన తెలియజేయనున్నారు.
ఇదిలా ఉంటే తమిళనాడులో అధికార డీఎంకే చేస్తున్న విమర్శలకు బీజేపీ గట్టిగానే స్పందిస్తోంది. నీతిఆయోగ్ సమావేశానికి గైర్హాజరు అవుతామని ముఖ్యమంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాలు సమర్పించిన 10 బడ్జెట్లలో ఆరు సార్లు తమిళనాడు ప్రస్తావన లేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి ఏ సంక్షేమ పథకం కూడా రావడం లేదనే అభిప్రాయాన్ని స్టాలిన్ కలిగిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్తో కలిసి డీఎంకే కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో ఆరు బడ్జెట్లలో రాష్ట్రం పేరు కూడా లేదని అన్నామలై ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!