Bihar: పేపర్ లీకేజీకి పాల్పడితే పదేళ్లు జైలు.. రూ.కోటి ఫైన్.. అసెంబ్లీలో బిల్లు ఆమోదం
- పేపర్ లీకేజీపై కఠిన చట్టం తీసుకొచ్చిన నితీష్ సర్కార్
- పదేళ్లు జైలు.. కోటి ఫైన్
- అసెంబ్లీలో బిల్లు ఆమోదం
పేపర్ లీకేజీ వ్యవహారాలు దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి. ఏదొక రాష్ట్రంలో అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కేంద్రం నిర్వహించిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ కావడం పెను సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో బీహార్లోని నితీష్ కుమార్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రం లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు, ప్రభుత్వ నియామక పోటీ పరీక్షల్లో అవకతవకల్ని నియంత్రించేందుకు బీహార్ అసెంబ్లీలో కీలక బిల్లును బుధవారం ఆమోదించింది. బీహార్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు-2024ను రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదరి సభలో ప్రవేశపెట్టగా.. ప్రతిపక్షాల వాకౌట్ మధ్య మూజువాణి ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందింది.
ఇది కూడా చదవండి: Railway Minister Ashwini Vaishnaw: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు.. ఏపీలో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి రూ. 9151 కోట్లు
Also Read
నీట్-యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్, అక్రమాల ఆరోపణలపై చెలరేగిన వివాదానికి బీహార్ కేంద్ర బిందువుగా మారింది. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షల్లో అక్రమాలను కట్టడి చేయడమే లక్ష్యంగా ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం.. ఆయా పరీక్షల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.కోటి జరిమానాతో పాటు కఠినంగా శిక్షించనున్నారు.
ఇది కూడా చదవండి: Maharashtra: మాకు 80-90 సీట్లు కావాల్సిందే.. బీజేపీ కూటమిలో అజిత్ పవార్ పట్టు..
పేపర్ లీకేజీపై ప్రభుత్వం కఠిన చట్టం తీసుకువచ్చిందని మంత్రి విజయ్ కుమార్ చౌదరి తెలిపారు. ఈ చట్టంతో విద్యార్థుల భవిష్యత్ సురక్షితంగా ఉంటుందని చెప్పారు. అక్రమాలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు.
#WATCH | On the anti-paper leak bill passed in Assembly today, Bihar Minister Vijay Kumar Choudhary says,"Bihar government has made a strict law against paper leak. With this law, the future of aspirants and students will be secured. The law proposes 10 years imprisonment and a… pic.twitter.com/S3Gjyybsy2
— ANI (@ANI) July 24, 2024
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో