Yogi Adityanath: ‘‘పాకిస్తాన్ మానవాళికి క్యాన్సర్’’ .. విభజన పాపం కాంగ్రెస్దే..
- పాకిస్తాన్ ప్రపంచ మానవాళికి క్యాన్సర్..
- దేశ విభజన పాపం కాంగ్రెస్ పార్టీదే..
- విరుచుకుపడిన సీఎం యోగి ఆదిత్యనాథ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి దాయాది దేశం పాకిస్తాన్పై నిప్పులు చెరిగారు. త్రిపుర అగర్తలాలో సిద్దేశ్వరి ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ పార్టీపై కూడా విరుచుకుపడ్డారు. ‘‘కాంగ్రెస్ ఒప్పందాన్ని అనుసరిస్తే, వారు దేశాన్ని విభజిస్తారు. దేశంలోని జాతుల సంప్రదాయాన్ని నాశనం చేస్తారని ఆర్ఎస్ఎస్కి తెలుసు’’ అని అన్నారు.
Read Also: Karnataka: పాలస్తీనా జెండాలతో హల్చల్.. నలుగురు మైనర్లు అరెస్ట్
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
పాకిస్తాన్ ప్రపంచ మానవాళికి క్యాన్సర్ వంటిదని అన్నారు. దానికి చికిత్స చేసేంత వరకు భారత సమస్యలను పరిష్కరించలేమని అన్నారు. ‘‘ప్రస్తుతం పీఓకే స్వేచ్ఛగా ఉండాలని మళ్లీ భారతదేశంలో కలవాలని డిమాండ్ చేస్తోంది. పాకిస్తాన్ మానవాళికి క్యాన్సర్, దీనికి సకాలంలో చికిత్స చేయడానికి ప్రపంచం కలిసి రావాలి’’ అని అన్నారు.
1947లో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నవారు భారతదేశాన్ని విభజించాలని కోరుకునే ముస్లింలీగ్కి మద్దతు ఇచ్చారని, దీంతోనే పాకిస్తాన్ పుట్టిందని అన్నారు. 1905లో బెంగాల్ విభజించడానికి బ్రిటీష్ ప్రయత్నాలను ప్రస్తావించారు. ఇది ప్రజా ఉద్యమం ద్వారా అడ్డుకున్నామని, ముస్లిం లీగ్పై ఇదే విధంగా వ్యతిరేకత చూపిస్తే పాకిస్తాన్ సృష్టిని నిరోధించి ఉండేవాళ్లమని అన్నారు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో ఇటీవల అశాంతిపై యోగి ఆదిత్యనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు.బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో ప్రస్తుతం చర్చించాల్సిన అవసరం లేదని, దీనికి బాధ్యులెవరో ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా, తిప్రమోతా అధినేత ప్రద్యోత్ కిషోర్ మాణిక్య దెబ్బర్మ కూడా పాల్గొన్నారు.
पाकिस्तान 'नासूर' है, ये मानवता का 'कैंसर' है…
इसका उपचार समय रहते दुनिया की ताकतों को मिलकर करना होगा… pic.twitter.com/SvJnE3VrcI
— Yogi Adityanath (@myogiadityanath) September 16, 2024
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?