Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Yogi Adityanath Vs Deputy Keshav Maurya Delhi Meet Fuels Up Bjp Rumblings Talk

UP BJP: యూపీ బీజేపీలో లుకలుకలు.. ఉప ఎన్నికల ముందు యోగి vs కేశవ్ మౌర్య?

Published Date :July 17, 2024 , 3:15 pm
By BV Reddy
  • ఉత్తర్ ప్రదేశ్ బీజేపీలో యోగి వర్సెస్ కేశవ్ ప్రసాద్ మౌర్య..?
  • నడ్డాలో భేటీ కావడంతో సందేహాలు..
  • వచ్చే ఉప ఎన్నికల నేపథ్యంలో హాట్ హాట్‌గా యూపీ రాజకీయాలు..
UP BJP: యూపీ బీజేపీలో లుకలుకలు.. ఉప ఎన్నికల ముందు యోగి vs కేశవ్ మౌర్య?
  • Follow Us :
  • google news
  • dailyhunt

UP BJP: లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీ ప్రదర్శన ఆ పార్టీలో విబేధాలకు కారణమైనట్లు తెలుస్తోంది. గత రెండు పర్యాయాల్లో ఉత్తర్ ప్రదేశ్‌లోని మెజారిటీ సీట్లను దక్కించుకున్న బీజేపీ, 2024లో మాత్రం దారుణమైన ఫలితాలను చవిచూసింది. ముఖ్యంగా ప్రతిష్టాత్మక రామమందిరం ఉన్న ఫైజాబాద్ స్థానంలో బీజేపీ ఓడిపోవడం ఆ పార్టీని మరింత కుంగదీసింది. మొత్తం 80 ఎంపీ సీట్లు ఉన్న యూపీలో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి 43 సీట్లను గెలుచుకోగా, బీజేపీ కేవలం 36 చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రానున్న 10 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల కోసం బీజేపీ కార్యచరణ సిద్ధం చేసుకుంటోంది.

ఇటీవల 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా బీజేపీ కేవలం 2 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో యూపీ ఉప ఎన్నికలు బీజేపీకి చాలా కీలకంగా మారాయి. ఇదిలా ఉంటే యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మంగళవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని 10 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికలకు ముందు పార్టీ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌తో పాటు బీజేపీ ఉత్తరప్రదేశ్ యూనిట్‌లో కూడా పెద్ద మార్పు వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, ముఖ్యమంత్రి యోగి మార్పు గురించి ప్రత్యేకం ఎలాంటి చర్చ జరగలేదని తెలుస్తోంది. రాష్ట్రంలో ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత మార్పు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోందని తెలుస్తోంది. మరోవైపు బీజేపీ యూపీ చీఫ్ భూపేంద్ర చౌదరి కూడా నడ్డాలో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో విభేదాల మధ్య కేశవ్ మౌర్య, జెపి నడ్డా మధ్య సమావేశం కూడా జరిగింది.

Read Also: Rythu Runa Mafi: రేపే రైతుల ఖాతాల్లోకి రుణ మాఫీ సొమ్ము.. కార్డు లేకున్నా వర్తింపు..

ఈ 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికల షెడ్యూల్‌ని ఈసీ ఇంకా ప్రకటించకపోయినప్పటికీ, బీజేపీ మాత్రం కార్యాచరణ మొదలుపెట్టింది. మరోవైపు ఈ రోజు ముఖ్యమంత్రి యోగి తన ఇన్‌చార్జ్ మంత్రులతో ఈ రోజు సమావేశమయ్యారు. నిజాయితీగా ఉండి గెలవగల అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని, వారి ఇమేజ్ మరియు ప్రజలతో సంబంధానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రులందరూ వారివారి నియోజకవర్గాల్లో స్థానిక విషయాలపై అభిప్రాయాలు తెలుసుకోవాలని, అభ్యర్థుల్ని అంచనా వేయాలని ఆదేశించినట్లు సమాచారం.

గత వారం లక్నోలో జరిగిన బీజేపీ యూపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో కేశవ్ ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ.. ప్రభుత్వం కన్నా ఆర్గనైజేషన్ ఎప్పుడూ పెద్దది అని వ్యాఖ్యానించారు. అదే సమావేశంలో యోగి ప్రసంగిస్తూ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అంచనాలు, అతి ఆత్మవిశ్వాసం ఓటమికి కారణమని చెప్పారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయిన వారితో సహా పలువురు యుపి బిజెపి నాయకులు ఆదిత్యనాథ్ పని తీరును విమర్శించారు. ఆయన తీరు ఓటమికి కారణమని అన్నారు. బీజేపీ, యూపీ ప్రభుత్వం మధ్య సమన్వయం దెబ్బతినకుండా ఎలాంటి ప్రకటనలు చేయవద్దని నేతలకు నడ్డా సూచించారు.

ఇదిలా ఉంటే, బీజేపీ తీరుపై ప్రతిపక్ష నేత, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విరుచుకుపడ్డారు. గతంలో ఇతర పార్టీలో బీజేపీ చేసిన పని, ప్రస్తుతం ఆ పార్టీలో చెలరేగుతోందని, అంతర్గత విభేదాల గురించి ప్రస్తావించారు. ప్రజల గురించి ప్రభుత్వం ఆలోచించే స్థితిలో లేదని చెప్పారు. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నదని అఖిలేష్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం బలహీనంగా మారిందని ట్వీట్ చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • CM Yogi
  • jp nadda
  • Lok Sabha elections-2024
  • UP BJP

తాజావార్తలు

  • CSK IPL 2026: ఐపీఎల్ 2026కు ముందు సీఎస్‌కేకు భారీ ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ ఈ సీజన్ మొత్తానికి దూరం

  • Massive Water Cloud Discovered in Space: అంతరిక్షంలో భారీ మేఘం.. సముద్రాలన్నింటి కంటే 140 ట్రిలియన్ల రెట్ల ఎక్కువ నీరు..!

  • USA Crime : అమెరికాలో తెలుగు యువకుడు అరెస్ట్.. ఒక్క తప్పు జీవితం తలకిందులు..!

  • Telangana: ఐదుగురిని ప్రభుత్వ విప్‌లుగా నియమించిన తెలంగాణ ప్రభుత్వం..

  • Balineni Srinivasa Reddy Tweet Delete: మాజీ మంత్రి బాలినేని ట్వీట్ ఎపిసోడ్‌లో ట్విస్ట్..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions