Yogi Cabinet: పక్కా ప్లాన్తో యోగి కొత్త కేబినెట్.. ముస్లిం నేతకు చోటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తిరుగులేని విజయాన్ని అందుకుంది భారతీయ జనతా పార్టీ… ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాథ్ ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా సాగింది. వరుసగా రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసి చరిత్ర సృష్టించారు యోగి. లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో, రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్.. యోగితో ప్రమాణం చేయించారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నితీష్ కుమార్ వంటి మిత్రపక్ష నేతలూ అటెండయ్యారు. జనంతో కిటకిటలాడింది లక్నో అటల్ స్టేడియం. నయా భారత్ నయా యూపీతో నినాదాలతో మార్మోగింది.
Read Also: Congress: కాంగ్రెస్ ప్రక్షాళన.. ఇవాళే కీలక భేటీ..
Also Read
- TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
- Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
ఇక, యోగి ఆదిత్యానాథ్ కాకుండా 52 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. 2024 లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా యోగి జంబోకేబినెట్ కొలువుదీరినట్టు కనపడుతోంది. ఎమ్మెల్యేగా ఓడిపోయినా, పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన కేశవ్ ప్రసాద్ మౌర్య ఉప ముఖ్యమంత్రి పీఠం నిలబెట్టుకున్నారు. అయితే, దినేష్ శర్మను మాత్రం, బ్రాహ్మణ లీడర్ బ్రజేష్ పాతక్ తో రీప్లేస్ చేసింది బీజేపీ అధినాయకత్వం. సురేష్ ఖన్నా, సూర్యప్రతాప్ సాహి, స్వతంద్ర దేవ్ సింగ్, బేబీ రాణి మౌర్య, మాజీ బ్యూరోక్రాట్ ఏకే శర్మ, కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి బీజేపీలో చేరిన జితిన్ ప్రసాదకు యోగి కేబినెట్ లో చోటు దక్కింది. డానిష్ ఆజాద్ అన్సారి మాత్రమే యోగి మంత్రివర్గంలో ఏకైక ముస్లిం మినిస్టర్. అలాగే మాజీ పోలీస్ అధికారి అసీమ్ అరుణ్, దయా శంకర్ సింగ్, నితిన్ అగర్వాల్, కల్యాణ్ సింగ్ మనవడు సందీప్ సింగ్ లకు ఇండిపెండెంట్ చార్జ్ లతో మంత్రులుగా స్థానం దొరికింది.. మొత్తంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్లో ఒకే ఒక్క ముస్లిం నేతకు చోటు దక్కింది. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన డానిష్ అజాద్ అన్సారి.. గత యోగి సర్కార్లో మైనారిటీ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన మొహిసిన్ రజా స్థానంలో ఈసారి చోటు దక్కించుకున్నారు. సహాయ మంత్రిగా అన్సారీ ప్రమాణస్వీకారం చేశారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే అత్యధికంగా 273 స్థానాలు గెలిచింది. ఇందులో ఒక్క బీజేపీకే 255 సీట్లు వచ్చాయి. 37 ఏళ్ల నుంచి యూపీకి రెండోసీఎం అయినవారు లేరు. ఈ రికార్డును బద్దలుకొట్టారు యోగి. కొత్త మంత్రివర్గంతో దాదాపు రెండు గంటల పాటు సమావేశం కూడా నిర్వహించారు సీఎం యోగి ఆదిత్యనాథ్.
తాజావార్తలు
-
Bunny Vas: భారీ కలెక్షన్ల వెనుక అసలు నిజం బయటపెట్టిన బన్నీ వాస్!
-
SRH Lowest Score: ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డు.. 86 పరుగులకే కుప్పకూలిన ఆరెంజ్ ఆర్మీ..
-
Kagiso Rabada: వాళ్లు మొదలెట్టారు, మేము ముగించాం.. ఎస్ఆర్హెచ్ విక్టరీపై రబాడ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్ ఫైర్
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ ఇంకా బ్రతికే ఉన్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!