Nitin Gadkari: 2023 చివరికల్లా గుంతలు లేని జాతీయ రహదారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitin Gadkari: ఈ ఏడాది చివరకల్లా దేశంలోని జాతీయ రహదారులపై గుంతలు లేకుండా చేస్తామని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిష్ గడ్కరీ చెప్పారు. ఇందుకోసం కేంద్రం ప్రత్యేక విధివిధానాలను సిద్ధం చేస్తున్నందని వెల్లడించారు. ఇప్పటికే దేశంలోని 1,46,000 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల మ్యాపింగ్ పూర్తైందని తెలిపారు. ఏడాది చివరి నాటకిి గుంతలను తొలగించేందుకు పర్ఫామెన్స్ బెస్డ్ మెయింటనెన్స్, స్వల్పకాలిక నిర్వహణ ఒప్పందాలను పటిష్టం చేస్తున్నట్లు రోడ్డు రవాణా, రహదారుల కార్యదర్శి అనరాగ్ జైన్ తెలిపారు.
బిల్ట్-ఆపరేట్-ట్రాన్స్ఫర్(BOT) మోడ్ లో రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు గురువారం గడ్కరీ తెలిపారు. సాధారణంగా రోడ్ల నిర్మాణం మూడు పద్ధతుల్లో జరుగుతాయి. బీఓటీ, ఇంజనీరింగ్-ప్రొక్యూర్మెంట్ అండ్ కన్ట్రక్షన్(EPC), హైబ్రీడ్ యాన్యుటీ మోడల్(HAM) మోడళ్లలో రోడ్ల నిర్మాణం జరుగుతుంది.
Also Read
Read Also: Congress: కాంగ్రెస్లో చేరిన మైనంపల్లి, రోహిత్, వేముల వీరేశం.. పలువురు నేతలు
EPC మోడ్లో నిర్మించబడిన రోడ్లకు చాలా ముందుగానే నిర్వహణ అవసరమవుతుంది, అయితే BOT మోడ్లో, కాంట్రాక్టర్కు రాబోయే 15-20 సంవత్సరాల వరకు నిర్వహణ ఖర్చులు భరించాల్సి ఉంటుంది, దీంతో రోడ్లు నాణ్యత ప్రమాణాలతో నిర్మిస్తారు. దీంతో BOT మోడ్ లో రోడ్ల నిర్మాణం చేయాలని నిర్ణయించినట్లు గడ్కరీ చెప్పారు. వర్షాల వల్ల హైవేలు దెబ్బతింటాయని, గుండలు ఏర్పడుతాయని పేర్కొన్న గడ్కరీ, జాతీయ రహదారులపై మంత్రిత్వ శాఖ భద్రతా ఆడిట్ చేస్తోందని వెల్లడించారు.
జాతీయ రహదారులపై గుంతలు లేకుండా ఉండేలా పాలసీని రూపొందిస్తున్నామని, ప్రాజెక్టు విజయవంతానికి యువ ఇంజనీర్లను కలుపుకుపోతామని అన్నారు. BOT ప్రాజెక్టుల్లో ప్రైవేట్ పెట్టుబడీదారులు 20-30 ఏళ్ల రాయితీ వ్యవధిలో హైవే ప్రాజెక్టులను ఫైనాన్సింగ్, బిల్డింగ్, ఆపరేటింగ్ రిస్క్ తీసుకుంటారు. డెవలపర్లు యూజర్ ఛార్జీలు, టోల్ ద్వారా పెట్టుబడుల్ని తిరిగి పొందుతారు. EPC ప్రాజెక్టుల్లో హైవేలను నిర్మించడానికి ప్రభుత్వం డెవలపర్లకు డబ్బు చెల్లిస్తుంది. ఆ తర్వాత టోల్ ఆదాయాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!