Moonlighting: “మూన్లైటింగ్”పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన.. టెక్కీలకు షాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Worker Can Not Take Up Moonlighting As Per Rule says Labour Minister In Parliament: ఈ మధ్య ఐటీ, సాఫ్ట్ వేర్ రంగాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘‘మూన్లైటింగ్’’. ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూనే మరో కంపెనీకి కూడా పనిచేయడాన్ని మూన్లైటింగ్ గా పేర్కొంటారు. ఇటీవల దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో మూన్లైటింగ్ చేస్తున్నారనే ఆరోపణలతో ఒకేసారి 300 మంది ఉద్యోగులను తొలగించింది. దీంతో ఒక్కసారిగా ఐటీ రంగంలో ఉద్యోగులు షాక్ కు గురయ్యారు. మూన్లైటింగ్ పద్దతిని విడనాడకుంటే తాము కూడా ఇదే విధంగా వ్యవహారించాల్సి ఉంటుందని మిగతా కంపెనీలు కూడా ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది.
తాజాగా మూన్లైటింగ్ పై కేంద్రమంత్రి పార్లమెంట్ లో కీలక ప్రకటన చేశారు. చట్టపరంగా ఒక కార్మికుడు తన ఉద్యోగంతో పాటు యజమాని ఆసక్తికి వ్యతిరేకంగా ఏ విధమైన పనిని చేయకూడదని అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో వర్క్ ఫ్రం హోం పుణ్యమా అని చాలా మంది ఐటీ ఉద్యోగులు మూన్లైటింగ్ కి పాల్పడ్డారు.
Also Read
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
- Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
- Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
- DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
Read Also: Umair Sandhu: చిరంజీవిని అంకుల్ అన్న ప్రముఖ క్రిటిక్.. మెగా అభిమానుల ఫైర్
అయితే ఉద్యోగుల తొలగింపుకు మూన్లైటింగ్ కారణం అని ప్రభుత్వం భావిస్తుందా..? అనే ప్రశ్నకు కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి సమాధానం ఇచ్చారు. ఇండస్ట్రియల్ ఎంప్టాయిమెంట్(స్టాండర్డ్ ఆర్డర్స్)చట్టం 1946 ప్రకారం.. ఒక కార్మికుడు తను ఉద్యోగం చేస్తున్న సంస్థ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేయకూడదు. అతని ఉద్యోగంతో పాటు మరో ఉద్యోగం చేయకూడదు. సంస్థ యజమాని ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇది ఉంటుందని కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి లోక సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఉద్యోగుల తొలగింపు అనేది సంస్థల్లో సాధారణం అని.. దేశంలో మూన్లైటింగ్ పై ప్రభుత్వం అధ్యయనం చేస్తుందా..? అనే ప్రశ్నకు లేదని సమాధానం ఇచ్చారు.
మూన్లైటింగ్ కారణంగా ఉద్యోగులను తొలగించవద్దని ప్రభుత్వం కంపెనీలను ఆదేశించిందా..? అనే ప్రశ్నకు సంబంధించి ఐటీ, సోషల్ మీడియా, ఎడ్టెక్ సంస్థలు, సంబంధిత రంగాల్లో మల్లీనేషనల్ కంపెనీలు, భారతీయ కంపెనీల విషయంలో అధికార పరిధి ఆయా రాష్ట్రప్రభుత్వాలదే అని మంత్రి పేర్కొన్నాడు. పారిశ్రామిక వివాదాల చట్టం-1947 ప్రకారమే ఉద్యోగుల తొలగింపు ఉంటుందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Hyderabad Metro : మెట్రో వ్యవస్థకు ఎలాంటి నష్టం లేదు.. స్పష్టం చేసిన HMRL
-
RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
-
MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!