Arvind Kejriwal: మీరు ఆప్కి ఓటేస్తే నేను మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో జైలుకు వెళ్లిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కి రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. లోక్సభ ఎన్నికల ప్రచారం తర్వాత జూన్ 1న లొంగిపోవాలని సూచించింది. ఇదిలా ఉంటే ఆయన జైలు నుంచి విడుదలైన తర్వాత నుంచి బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీ టార్గెట్గా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ రోజు ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆప్ గుర్తుకు ఓటేస్తే తాను మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం రాదని ఆయన ప్రజల్ని కోరారు.
Read Also: Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు హైరిస్క్ వార్నింగ్!
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
50 రోజుల తర్వాత జైలు నుంచి కేజ్రీవాల్ విడుదల కావడాన్ని ఆప్ ఈ ఎన్నికల్లో కీలక మలుపుగా భావిస్తోంది. ఇండియా కూటమి కూడా కేజ్రీవాల్ విడుదల పట్ల హర్షం వ్యక్తం చేసింది. ఆదివారం న్యూఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతికి మద్దతుగా మోతీ నగర్లో కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించారు. ‘‘నేను తిరిగి జైలుకు వెళితే, బీజేపీ మీకు అమలవుతున్న సంక్షేమ పథకాలను ఆపేస్తుంది. ఉచిత విద్యుత్, పాఠశాలల పరిస్థితి దిగజారుతుంది. మొహల్లా క్లీనిక్స్ మూతపడుతాయి.’’ అని కేజ్రీవాల్ అన్నారు. నేను మీ కోసం పనిచేసినందుకే నన్ను జైలుకు పంపారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలోని ప్రజలకు తాను సేవ చేయడం ఇష్టం లేదని చెప్పారు.
ఢిల్లలోని ఏడు నియోజకవర్గాలకు మే 25న ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న కేజ్రీవాల్ లొంగిపోవాల్సి ఉంది. గత ఎన్నికల్లో ఢిల్లీలోని అన్ని ఎంపీ స్థానాలను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే, ఈ సారి ఎన్నికల్లో ఆప్ గట్టి పోటీ ఇవ్వాలని అనుకుంటోంది. ఇప్పటికే ఇండియా కూటమి పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్-ఆప్ కలిసి పోటీ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?