Bengaluru: బెంగళూరులో మహిళ హత్య.. రూ.20 లక్షల నగలు చోరీ
- బెంగళూరులో మహిళ హత్య
- రూ.20 లక్షల నగలు చోరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మార్పు కనిపించడం లేదు. చట్టాలకు భయపడకుండా ఘాతుకాలకు తెగబడుతున్నారు. తాజాగా బెంగళూరులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. కూతురు పెళ్లి కోసం దాచి పెట్టిన బంగారు నగలు దోచుకెళ్లారు.
ఇది కూడా చదవండి: TDP Mahanadu: రేపటి నుంచి మహానాడు… పసుపు పండుగకు కడప ముస్తాబు..
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
లత, ప్రకాష్ భార్యాభర్తలు. సెంట్రల్ బెంగళూరులోని కాటన్పేట్లోని అద్దె ఇంట్లో ఉంటారు. కుమార్తె, కుమారుడు ఉన్నారు. లత (40) గృహణి. భర్త ప్రకాష్ బెంగళూరులో హోల్సేల్ బట్టల వ్యాపారి. భార్య హత్య సమయంలో దుకాణంలో ఉన్నాడు. కుమార్తె ప్రైవేట్ ఉద్యోగంలో ఉంది. కుమారుడు పాఠశాలకు వెళ్లాడు.
ఇది కూడా చదవండి: PM Modi: మోడీ ర్యాలీకి హాజరైన కల్నల్ సోఫియా ఖురేషి ఫ్యామిలీ.. ప్రధాని ట్వీట్
ఇంట్లో ఒంటరిగా ఉన్న లతను ఎవరో టార్గెట్ చేసి మాటు వేశారు. అప్పటికే కుమార్తె పెళ్లి కోసం రూ.20లక్షల ఖరీదైన నగలు కొని ఇంట్లో పెట్టారు. అయితే దుండగులు ఇంట్లోకి ప్రవేశించి లతను అత్యంత దారుణంగా హతమార్చి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. మధ్యాహ్నం భోజనం కోసం ప్రకాష్ ఇంటికి వచ్చేటప్పటికీ భార్య శవమై కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇంట్లో నగదు, నగలు పోయినట్లుగా ఫిర్యాదు చేశాడు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. లతను తెలిసిన వ్యక్తులే చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నగలు, నగదు దోచుకునే ముందు లత గొంతు కోసి చంపేశారని పేర్కొన్నారు. కచ్చితంగా తెలిసిన వాళ్ల పనేనని అనుమానిస్తున్నారు. కుమార్తె పెళ్లి కోసం ఇంట్లో నగలు, నగదు ఉన్నట్లు బంధువులకే తెలుసని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పరిచయం ఉన్న కుటుంబ సభ్యుల్ని విచారిస్తున్నారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!