Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story With Record Footfall Ayodhya Surpasses Taj Mahal As Uttar Pradeshs Top Tourist Destination

UP: తాజ్‌మహల్ రికార్డ్‌ను అధిగమించిన అయోధ్య.. దేంట్లో అంటే..!

Published Date :December 20, 2024 , 3:54 pm
By Suresh Maddala
  • అయోధ్య రామమందిరం సరికొత్త రికార్డ్
  • తాజ్‌మహల్ రికార్డ్ బద్దలుకొట్టిన అయోధ్య
  • 9 నెలల్లోనే అత్యధికంగా సందర్శించిన టూరిస్ట్ ప్రాంతం అయోధ్యనే
UP: తాజ్‌మహల్ రికార్డ్‌ను అధిగమించిన అయోధ్య.. దేంట్లో అంటే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

అయోధ్య రామమందిరం సరికొత్త రికార్డ్ సొంతం చేసుకుంది. దేశంలోనే మోస్ట్ పాపులర్ పర్యాటక కేంద్రంగా అయోధ్య నిలిచినట్లుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఒకప్పుడు ఆగ్రాలోని తాజ్‌మహల్ పర్యాటకరంగంలో అగ్రగామిగా ఉండేది. ఇప్పుడు దాని రికార్డ్‌ను అయోధ్య బద్దలుకొట్టింది. రికార్డు స్థాయిలో అయోధ్యను సందర్శకులు సందర్శించారని.. తాజ్ మహల్‌ రికార్డ్‌ను అధిగమించిందని యూపీ పర్యాటక మంత్రి జైవీర్ సింగ్ స్పష్టం చేశారు.

ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 22న అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ప్రధాని మోడీ ఆయోధ్య రామమందిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా అతిరథ మహరథులంతా హాజరయ్యారు. రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తల దగ్గర నుంచి సినీ ప్రముఖులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేశారు.

తాజాగా అయోధ్య రామమందిరం సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పింది. అయోధ్య రామమందిరాన్ని చూసేందుకు దేశీయంగానే కాకుండా విదేశీల నుంచి కూడా పెద్ద ఎత్తున సందర్శించేందుకు తరలివచ్చారు. ఆలయం ప్రారంభం అయిన కొద్ది రోజుల్లోనే తాజ్‌మహల్ రికార్డ్‌ను అధిగమించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న తాజ్‌మహల్‌ను ఎక్కువ మంది సందర్శించే టూరిస్ట్ ప్లేస్ ఇదే. దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో వచ్చి సందర్శిస్తుంటారు. అలాంటిది ఇప్పుడు తాజ్‌మహల్‌ కంటే అయోధ్యనే ఎక్కువ మంది సందర్శిస్తున్నారు. తాజాగా దేశ, విదేశాల నుంచి ఎక్కువ మంది సందర్శించిన ప్రాంతం అయోధ్యగా నిలిచింది. జనవరి 2024 నుంచి సెప్టెంబర్ మధ్య అయోధను సందర్శించిన దేశీయ పర్యాటకుల సంఖ్య 13.55 కోట్ల మంది కాగా.. 3, 153 మంది విదేశీ పర్యాటకులు సందర్శించారని ఉత్తర ప్రదేశ్ పర్యాటక శాఖ వెల్లడించింది. అదే సమయంలో తాజ్‌మహల్‌ను 12.51 మంది సందర్శించారు. ఇందులో దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు ఉన్నారు. అంటే ఆగ్రా కంటే అయోధ్యనే ఎక్కువ మంది సందర్శించారని పేర్కొంది. అంటే కేవలం 9 నెలల్లో తాజ్‌మహల్ రికార్డ్‌ను అధిగమించినట్లుగా తెలిపింది.

మొత్తంగా యూపీలోని ఆయా పర్యాటక కేంద్రాలను జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో 47.61 కోట్ల మంది టూరిస్టులు సందర్శించారని తెలిపింది. గత ఏడాది 48 కోట్ల మంది పర్యాటకులు సందర్శిస్తే.. ఈ ఏడాది కేవలం తొమ్మిది నెలల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నట్లు పర్యాటక మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు. అయోధ్య, తాజ్‌మహల్‌తో పాటు వారణాసి 6.2 కోట్ల మంది స్వదేశీ పర్యాటకులతో పాటు 1.84 లక్షల మంది విదేశీ సందర్శకులను ఆకర్షించింది. ప్రయాగ్‌రాజ్ 4,790 మంది విదేశీయులతో సహా 4.80 కోట్ల మంది పర్యాటకులు సందర్శించారు. కృష్ణుడి జన్మస్థలమైన మధురలో 6.8 కోట్ల మంది సందర్శకులు వచ్చారు. ఇందులో 87,229 మంది అంతర్జాతీయ పర్యాటకులు ఉన్నారు. మీర్జాపూర్‌లో కూడా 1.18 కోట్ల మంది సందర్శకులు వచ్చారు.

తాజ్ మహల్ అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తూ ఉండగా.. దేశీయ టూరిస్టుల సంఖ్య మాత్రం కొద్దిగా తగ్గింది. 2022-23లో అంతర్జాతీయంగా వచ్చేవారి సంఖ్య 26.84 లక్షల నుంచి 2023-24 నాటికి 27.70 లక్షలకు పెరిగింది. అయితే దేశీయ పర్యాటకుల సంఖ్య 1.93 లక్షల మేర తగ్గింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ayodhya surpasses
  • Record footfall
  • Taj Mahal
  • Top tourist destination
  • Uttar Pradeshs

తాజావార్తలు

  • Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసు..15 బాల్స్‌లో హాఫ్ సెంచరీ! ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన కుర్రాడు..

  • Sam Altman Controversy: ChatGPT సీఈవోపై ఉద్యోగుల సంచలన ఆరోపణలు..

  • Anushka Shetty: అనుష్క ‘ప్రమోషన్’ పంతం వీడనుందా?

  • Hair Care Tips: సాంబ్రాణి ధూపంతో మీ జుట్టు పొడవుగా, ఒత్తుగా మారిపోతుంది తెలుసా..?

  • Kantara Part 3:రిషబ్ శెట్టి ఆ మాయా ప్రపంచానికి గుడ్ బై చెప్పేస్తున్నాడా?

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions