UP: తాజ్మహల్ రికార్డ్ను అధిగమించిన అయోధ్య.. దేంట్లో అంటే..!
- అయోధ్య రామమందిరం సరికొత్త రికార్డ్
- తాజ్మహల్ రికార్డ్ బద్దలుకొట్టిన అయోధ్య
- 9 నెలల్లోనే అత్యధికంగా సందర్శించిన టూరిస్ట్ ప్రాంతం అయోధ్యనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయోధ్య రామమందిరం సరికొత్త రికార్డ్ సొంతం చేసుకుంది. దేశంలోనే మోస్ట్ పాపులర్ పర్యాటక కేంద్రంగా అయోధ్య నిలిచినట్లుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఒకప్పుడు ఆగ్రాలోని తాజ్మహల్ పర్యాటకరంగంలో అగ్రగామిగా ఉండేది. ఇప్పుడు దాని రికార్డ్ను అయోధ్య బద్దలుకొట్టింది. రికార్డు స్థాయిలో అయోధ్యను సందర్శకులు సందర్శించారని.. తాజ్ మహల్ రికార్డ్ను అధిగమించిందని యూపీ పర్యాటక మంత్రి జైవీర్ సింగ్ స్పష్టం చేశారు.
ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 22న అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ప్రధాని మోడీ ఆయోధ్య రామమందిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా అతిరథ మహరథులంతా హాజరయ్యారు. రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తల దగ్గర నుంచి సినీ ప్రముఖులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేశారు.
Also Read
- PM Modi: వాదనలు బలంగా ఉండాలి.. శబ్దం కాదు.. వర్షాకాల సమావేశాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
- Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
- DMK MLA Markandeyan: డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్.. ఎందుకంటే?
- Vande Mataram Bill 2026: 'వందేమాతరం'పై.. నేడు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా
తాజాగా అయోధ్య రామమందిరం సరికొత్త రికార్డ్ను నెలకొల్పింది. అయోధ్య రామమందిరాన్ని చూసేందుకు దేశీయంగానే కాకుండా విదేశీల నుంచి కూడా పెద్ద ఎత్తున సందర్శించేందుకు తరలివచ్చారు. ఆలయం ప్రారంభం అయిన కొద్ది రోజుల్లోనే తాజ్మహల్ రికార్డ్ను అధిగమించింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ను ఎక్కువ మంది సందర్శించే టూరిస్ట్ ప్లేస్ ఇదే. దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో వచ్చి సందర్శిస్తుంటారు. అలాంటిది ఇప్పుడు తాజ్మహల్ కంటే అయోధ్యనే ఎక్కువ మంది సందర్శిస్తున్నారు. తాజాగా దేశ, విదేశాల నుంచి ఎక్కువ మంది సందర్శించిన ప్రాంతం అయోధ్యగా నిలిచింది. జనవరి 2024 నుంచి సెప్టెంబర్ మధ్య అయోధను సందర్శించిన దేశీయ పర్యాటకుల సంఖ్య 13.55 కోట్ల మంది కాగా.. 3, 153 మంది విదేశీ పర్యాటకులు సందర్శించారని ఉత్తర ప్రదేశ్ పర్యాటక శాఖ వెల్లడించింది. అదే సమయంలో తాజ్మహల్ను 12.51 మంది సందర్శించారు. ఇందులో దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు ఉన్నారు. అంటే ఆగ్రా కంటే అయోధ్యనే ఎక్కువ మంది సందర్శించారని పేర్కొంది. అంటే కేవలం 9 నెలల్లో తాజ్మహల్ రికార్డ్ను అధిగమించినట్లుగా తెలిపింది.
మొత్తంగా యూపీలోని ఆయా పర్యాటక కేంద్రాలను జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో 47.61 కోట్ల మంది టూరిస్టులు సందర్శించారని తెలిపింది. గత ఏడాది 48 కోట్ల మంది పర్యాటకులు సందర్శిస్తే.. ఈ ఏడాది కేవలం తొమ్మిది నెలల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నట్లు పర్యాటక మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు. అయోధ్య, తాజ్మహల్తో పాటు వారణాసి 6.2 కోట్ల మంది స్వదేశీ పర్యాటకులతో పాటు 1.84 లక్షల మంది విదేశీ సందర్శకులను ఆకర్షించింది. ప్రయాగ్రాజ్ 4,790 మంది విదేశీయులతో సహా 4.80 కోట్ల మంది పర్యాటకులు సందర్శించారు. కృష్ణుడి జన్మస్థలమైన మధురలో 6.8 కోట్ల మంది సందర్శకులు వచ్చారు. ఇందులో 87,229 మంది అంతర్జాతీయ పర్యాటకులు ఉన్నారు. మీర్జాపూర్లో కూడా 1.18 కోట్ల మంది సందర్శకులు వచ్చారు.
తాజ్ మహల్ అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తూ ఉండగా.. దేశీయ టూరిస్టుల సంఖ్య మాత్రం కొద్దిగా తగ్గింది. 2022-23లో అంతర్జాతీయంగా వచ్చేవారి సంఖ్య 26.84 లక్షల నుంచి 2023-24 నాటికి 27.70 లక్షలకు పెరిగింది. అయితే దేశీయ పర్యాటకుల సంఖ్య 1.93 లక్షల మేర తగ్గింది.
తాజావార్తలు
-
Uday Krishna Reddy: లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆత్మహత్య యత్నం..!
-
Jung Ho-Yeon: ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన తొలి కొరియన్ నటి.. ‘స్క్విడ్ గేమ్’ స్టార్ మరో అరుదైన ఘనత
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
PM Modi: వాదనలు బలంగా ఉండాలి.. శబ్దం కాదు.. వర్షాకాల సమావేశాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
-
RAAKA: ‘రాకా’లో తెలుగు బ్యూటీ ఎంట్రీ…. అల్లు అర్జున్ సినిమాతో సిరి హనుమంతుకు బిగ్ బ్రేక్!
ట్రెండింగ్
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!