China: కలిసి పనిచేసేందుకు సిద్ధం.. పీఎం మోడీకి చైనా ప్రధాని అభినందనలు..
- ప్రధాని మోడీకి చైనా ప్రీమియర్ అభినందలు..
- కలిసి పనిచేసేందుకు సిద్ధమన్న లీ కియాంగ్..
- గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాల్లో క్షీణత..
- ‘వన్ చైనా’ పాలసీని గౌరవించాలన్న చైనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: భారత్-చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సరైన దిశలో ముందుకు తీసుకెళ్లేందుకు న్యూఢిల్లీలో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని బీజింగ్ తెలిపింది. మూడోసారి ఎన్నికైన ప్రధాని నరేంద్రమోడీకి చైనా ప్రధాని లీ కియాంగ్ మంగళవారం అభినందనలు తెలియజేశారు. రెండు దేశాల పటిష్టమైన, స్థిరమైన అభివృద్ధి రెండు దేశాల ప్రజల శ్రేయస్సుకు మాత్రమే కాకుండా, ఈ ప్రాంతం మరియు ప్రపంచ స్థిరత్వానికి సానుకూల శక్తిని ఇస్తుందని లీ కియాంగ్ తన సందేశంలో పేర్కొన్నట్లు చైనీస్ మీడియా నివేదించింది.
2024 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి గెలిచి, ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలిచినందుకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ జూన్ 5న ప్రధాని మోడీకి అభినందనలు తెలియజేసింది. నాలుగేళ్ల క్రితం గాల్వాన్ ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య దిగజారిన సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఆరోగ్యకరమైన సంబంధాలపై దృష్టి పెట్టాలని పేర్కొంది.
Also Read
- Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్కు స్పష్టం చేసిన భారత్..
- Modi-Shinde: ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ.. సరికొత్త ఊహాగానాలు
- Kochi Flight: గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
- Jantar Mantar: జంతర్ మంతర్లో నిరసనలు అవసరమా? ఢిల్లీ హైకోర్టు ప్రశ్న
మే 5, 2020లో తూర్పు లడఖ్ సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ ఏర్పడింది. దీని తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు సరిగా లేవు. పలుమార్లు సైనిక స్థాయిలో చర్చలు జరిగినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఇటీవల చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ.. ‘‘భారత సార్వత్రిక ఎన్నికల ఫలితాలను మేము గమనించాము మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి మరియు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ విజయానికి అభినందనలు తెలియజేస్తున్నాము’’ అని చెప్పారు. ఇదిలా ఉంటే మరోవైపు తైవాన్ ప్రెసిడెంట్ లై చింగ్ తే ప్రధాని మోడీ విజయానికి శుభాకాంక్షలు చెప్పడం, దీనికి మోడీ స్పందించడంపై చైనా రగిలిపోతోంది. తైవాన్ ‘‘వన్ చైనా విధానం’’లో అంతర్భాగమని పేర్కొంది. భారత్ దీనిని గౌరవించాలని కోరింది.
తాజావార్తలు
-
Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్కు స్పష్టం చేసిన భారత్..
-
Vishwanath and Sons Trailer: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ టాక్.. సూర్య-మమితా కెమిస్ట్రీ అదుర్స్.!
-
Modi-Shinde: ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ.. సరికొత్త ఊహాగానాలు
-
Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్కు కృష్ణా జలాలు
-
Ritika Nayak : ‘కొరియన్ కనకరాజు’తో జాక్పాట్.. టాలీవుడ్కు కొత్త గోల్డెన్ లెగ్గా రితికా నాయక్.!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!