Mamata Banerjee: బెంగాల్ విభజన, కొత్త కేంద్రపాలిత ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించం..
- బెంగాల్ విభజనను సహించేది లేదు..
- కొత్త కేంద్రపాలిత ప్రాంతాన్ని ఒప్పుకోం..
- బీజేపీ ఎంపీ ప్రతిపాదనపై మండిపడ్డ మమతా బెనర్జీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ని విభజించే అన్ని చర్యల్ని తిప్పికొడుతామని ఆ రాష్ట్ర సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రాన్ని హెచ్చరించారు. బెంగాల్ని విభజించేందుకు వారిని రానివ్వండి.. దాన్ని ఎలా అడ్దడుకోవాలో వారికి చెబుతాం అని అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఈ రోజు అన్నారు. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లోని కొన్ని జిల్లాలను విభజించి కొత్త కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఇటీవల లోక్సభలో ప్రసంగించిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: North Korea: కిమ్ తర్వాత ఉత్తర కొరియాను పాలించేది ఈమెనే..
Also Read
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
ఇదే విధంగా బంగ్లాదేశ్తో తీస్తా నది నీటిని పంచుకునే విషయంలో బీజేపీ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని, దానిని ఎప్పటికీ మేం అంగీకరించబోమని ఆమె చెప్పారు. వరదల నియంత్రణకు బీజేపీ సర్కార్ అన్ని రాష్ట్రాలకు నిధులు ఇచ్చినా, బెంగాల్ నిధులను మాత్రం తగ్గిస్తోందని ఆమె మండిపడ్డారు. ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో భారత్-బంగ్లాదేశ్ రివర్ కమిషన్కు అనుగుణంగా భారత్-భూటాన్ రివర్ కమిషన్ ఏర్పాటు చేయాలనే తాను డిమాండ్ చేశానని చెప్పారు.
ఇటీవల జార్ఖండ్కి చెంది బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మాట్లాడుతూ.. జార్ఖండ్ రాష్ట్రంలోకి బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఎక్కువయ్యారని అన్నారు. అక్కడ ఉన్న గిరిజనుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుందని ఆయన చెప్పారు. సంతాల్ పరగణా ప్రాంతంలోకి బంగ్లాదేశీ చొరబాటుదారులు ప్రవేశించి, గిరిజన మహిళల్ని పెళ్లి చేసుకుంటున్నారని చెప్పారు. గతంలో ఈ ప్రాంతంలో 36 శాతం గిరిజన జనాభా ఉంటే ప్రస్తుతం 26 శాతానికి తగ్గిందని, మిగతా 10 శాతం ఏమైపోయారని ప్రశ్నించారు. ఈ ప్రాంతాల్ని కలిపి కొత్తగా కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని లేకపోతే హిందువులు కనుమరుగు అవుతారని చెప్పారు.
తాజావార్తలు
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
-
Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
-
E3 Tryon: E3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. 165KM రేంజ్, AI ఫీచర్లు.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!