Mamata Banerjee: బెంగాల్ విభజన, కొత్త కేంద్రపాలిత ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించం..
- బెంగాల్ విభజనను సహించేది లేదు..
- కొత్త కేంద్రపాలిత ప్రాంతాన్ని ఒప్పుకోం..
- బీజేపీ ఎంపీ ప్రతిపాదనపై మండిపడ్డ మమతా బెనర్జీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ని విభజించే అన్ని చర్యల్ని తిప్పికొడుతామని ఆ రాష్ట్ర సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రాన్ని హెచ్చరించారు. బెంగాల్ని విభజించేందుకు వారిని రానివ్వండి.. దాన్ని ఎలా అడ్దడుకోవాలో వారికి చెబుతాం అని అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఈ రోజు అన్నారు. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లోని కొన్ని జిల్లాలను విభజించి కొత్త కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఇటీవల లోక్సభలో ప్రసంగించిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: North Korea: కిమ్ తర్వాత ఉత్తర కొరియాను పాలించేది ఈమెనే..
Also Read
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ఇదే విధంగా బంగ్లాదేశ్తో తీస్తా నది నీటిని పంచుకునే విషయంలో బీజేపీ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని, దానిని ఎప్పటికీ మేం అంగీకరించబోమని ఆమె చెప్పారు. వరదల నియంత్రణకు బీజేపీ సర్కార్ అన్ని రాష్ట్రాలకు నిధులు ఇచ్చినా, బెంగాల్ నిధులను మాత్రం తగ్గిస్తోందని ఆమె మండిపడ్డారు. ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో భారత్-బంగ్లాదేశ్ రివర్ కమిషన్కు అనుగుణంగా భారత్-భూటాన్ రివర్ కమిషన్ ఏర్పాటు చేయాలనే తాను డిమాండ్ చేశానని చెప్పారు.
ఇటీవల జార్ఖండ్కి చెంది బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మాట్లాడుతూ.. జార్ఖండ్ రాష్ట్రంలోకి బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఎక్కువయ్యారని అన్నారు. అక్కడ ఉన్న గిరిజనుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుందని ఆయన చెప్పారు. సంతాల్ పరగణా ప్రాంతంలోకి బంగ్లాదేశీ చొరబాటుదారులు ప్రవేశించి, గిరిజన మహిళల్ని పెళ్లి చేసుకుంటున్నారని చెప్పారు. గతంలో ఈ ప్రాంతంలో 36 శాతం గిరిజన జనాభా ఉంటే ప్రస్తుతం 26 శాతానికి తగ్గిందని, మిగతా 10 శాతం ఏమైపోయారని ప్రశ్నించారు. ఈ ప్రాంతాల్ని కలిపి కొత్తగా కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని లేకపోతే హిందువులు కనుమరుగు అవుతారని చెప్పారు.
తాజావార్తలు
-
Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
-
Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
-
KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!