Shashi Tharoor: ఉగ్రవాదం ప్రపంచానికి అతి పెద్ద సమస్య.. పాక్పై శశిథరూర్ ఫైర్!
- ఉగ్రవాదంతో భారత్ పై పాకిస్తాన్ విషం చిమ్ముతుంది..
- టెర్రరిజం ప్రపంచానికి అతి పెద్ద సమస్యగా మారింది..
- ఉగ్రవాద చర్యలను భారత్ సహించేది లేదు: ఎంపీ శశిథరూర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashi Tharoor: ఉగ్రవాదంతో అంటకాగుతూ మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్తాన్ను ఎండగట్టేందుకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నాయకత్వంలోని బృందం అమెరికాకు వెళ్లింది. ఈ క్రమంలోనే న్యూయార్క్లోని 9/11 మెమోరియల్ను టీమ్ సందర్శించింది. ఈ సందర్భంగా ఎంపీ శశిథరూర్ మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదం ప్రపంచానికి ఉన్న అతి పెద్ద సమస్యగా మారిందన్నారు. దీనిపై మనం ఐక్యంగా పోరాడాలని కోరారు.
Read Also: Cyber Den: కాల్ సెంటర్ ముగుసుగులో భారీగా ఆర్థికమోసాలు.. అమెజాన్ కస్టమర్లే లక్ష్యంగా..?!
Also Read
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
అయితే, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకొన్న చర్యలను ఎంపీ శశిథరూర్ భారత కాన్సులేట్లో చెప్పుకొచ్చారు. పహల్గాంలో మతం ఆధారంగా టూరిస్టులపై ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారని పేర్కొన్నారు. ఈ దాడితో భారత్లో మతపరమైన అల్లర్లు సృష్టించాలని వారు ప్రయత్నించారు.. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్ర సంస్థ ఈ దారుణానికి పాల్పడిందన్నారు. లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ ఇది. దీన్ని ఉగ్ర సంస్థగా ప్రకటించాలని ఇండియా ఇప్పటికే ఐక్యరాజ్య సమితిని అభ్యర్థించింది.. నేను ప్రభుత్వంలో కాకుండా.. ప్రతిపక్ష పార్టీలో ఉన్నాను.. ఈ దాడి తర్వాత పాకిస్తాన్ పై భారత బలగాలు తెలివితో దెబ్బ తీశాయని శశిథరూర్ వెల్లడించారు.
Read Also: Asaduddin Owaisi: పాక్ ఉగ్రవాద దేశం.. ఈసారి దాడి చేస్తే.. నాశనం చేస్తాం!
ఇక, పాక్లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు దాడులు చేసి.. వాటిని నేలమట్టం చేశాయని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేర్కొన్నారు. మేము టెర్రర్ స్పాట్స్ పై దాడి చేస్తే.. పాక్ సైన్యం రియాక్ట్ అయింది.. మాపై ప్రతి దాడులకు దిగింది. వాటిని సమర్థమంతంగా తిప్పికొట్టామని వెల్లడించారు. ఈ ఆపరేషన్తో ఉగ్ర చర్యలను భారత్ సహించదనే గట్టి మెస్సేజ్ ఇచ్చిందన్నారు. ఇది పహల్గాం దాడికి ప్రతిస్పందన మాత్రమే తప్ప.. పాక్తో యుద్ధం చేయాలనేది మా ఉద్దేశం కాదని శశిథరూర్ తెలిపారు.
Shashi Tharoor in NYC — Unleashed & Unapologetic:
"Enough is enough. Terrorism isn't just India's fight—it's the world's war. At 9/11 Memorial, we stood in solidarity, but with steel in our spine."
"At the Consulate, I made it clear: I urged smart, punishing strikes—and India… pic.twitter.com/4iBht27Ehh— Megh Updates 🚨™ (@MeghUpdates) May 25, 2025
తాజావార్తలు
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Oscars Academy :’RRR’ ఎడిటర్కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్కు రంగం సిద్ధం
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కష్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!